కాకి - హంస

                కాకి - హంస

ఉజ్జయిని నగరం పొలిమేరల్లో ఒక రావిచెట్టు ఉండేది. చెట్టు మీద ఒక కానీ, ఒక హంసా గూళ్ళు కట్టుకొని నివసించేవి.

ఒకరోజు మండుటెండలో ఒక బాటసారి నడుచు కొంటూ వచ్చి, అలసిపోయి ఆ చెట్టు కింద పడుకొన్నాడు. కాస్సేపటి తర్వాత నీడ కొంచెం తొలిగి, అతని కళ్ళ మీద ఎండ పడుతుండగా హంస చూచింది.

పాపం మంచినిద్రలో ఉన్నవాడికి నిద్రాభంగంమవు తుందని, దయ తలచి, ఎండ అతని మీద పడకుండా తన రెక్కలు అడ్డుగా పెట్టి కూర్చొంది.

దానిపై కొమ్మమీద కూచొన్న కాకికి, ఆ బాటసారి అలా సుఖంగా నిద్రపోతుంటే, కన్ను కుట్టింది. ఈర్ష్య పట్టలేక, ఆ కుళ్ళుమోతు కాకి, ఆ బాటసారి మొహాన పడేలా రెట్ట వేసింది. వేసి యింక అక్కడ నిలవకుండా ఎగిరిపోయింది. అలా చేయటం వల్ల దానికి ఒరిగిందేమీ లేదు. దుర్మార్గుల స్వభావం అంతే మరి.

కాస్సేపటికి బాటసారి నిద్రలేచాడు. మొహాన రెట్ట తుడుచుకొంటూ పైకి చూశాడు. హంస కనిపించింది. తన ముఖం మీద హుసే రెట్ట వేసిందని అపోహపడి, తన విల్లంబులు అందుకొని ఒక్క బాణంతో హంసని కూలగొట్టాడు. ఏ పాపం ఎరగని హంస చచ్చిపోయింది. "పాపీ చిరాయువు" అన్నట్లు, పాపిష్ఠి కాకి మాత్రం బతికిపోయింది.

అందుకే దుర్మార్గుడయిన ఈ కొంగ వంటి వాళ్ళతో కలవటం ప్రమాదమని నా అరుణముఖుడు. అభిప్రాయం' అన్నాడు.

అదంతా విని, నేను అరుణముఖుడితో యిలా అన్నాను : "స్నేహితుడా, నాకు మా రాజెంతో నువ్వూ అంతే. ఆమాటకొస్తే, మంచివాళ్లు లోకంలో అందరూ తమలాంటి వాళ్ళే అని భావిస్తారు. నేను ఒకటి, మరొకడు ఒకటి అనుకోవటం "ఆత్మవత్సర్వ భూతాని" (అన్ని ప్రాణులూ మనలాంటివే) అన్న సూక్తి తెలుసు గదా! క్షణభంగురమయిన శరీరం కోసం, నిన్ను చంపి ఆ పాపాన నరకానికి వెళతానా? నీకు రాగల ప్రమాదం ఏమీ లేదు. నాతో వచ్చెయ్" అంటే, ఆ అరుణముఖుడు పకపక నవ్వాడు. "నీ మాయ మాటలు నేను నమ్ముతాననుకోబోకు. నువ్వు యిప్పటి పగ మనసులో పెట్టుకొని, నాతో వచ్చి, మధ్య దారిలో నన్ను చంపేస్తావు. అందుకే యిన్ని తియ్యటి మాటలు చెప్తున్నావు. 'అతి వినయం ధూర్త లక్షణం' అన్నారు. నీ మెత్తటి మాటలు చూస్తేనే నువ్వు| ధూర్తుడివీ, దుర్మార్గుడివీ అని తెలిసిపోతున్నది. ఇప్పటిదాకా మమ్మల్నీ, మా దేశాన్నీ, రాజునీ అంతలా తిట్టేసి, యిప్పుడు మాట మారుస్తున్నావు. అసలు మా రాజుకూ, మీ రాజుకూ యుద్ధం రావటానికి నీ మాటలే గదా కారణం? మునుపు ఇలాగే, ఓ పెద్దపులి కొంగను చంపిన కథ ఉన్నది, విను" అంటూ పులీ, కొంగా కథ చెప్పాడు.

కుందేలు - ఏనుగు

           కుందేలు - ఏనుగు


తను చెప్పదలచుకొన్న నీతికథలు రెండూ ముగించిన తర్వాత హిరణ్యగర్భుడు. 'సరి సరి, ఇంతకీ నువ్వు చెప్పే సమాచారం పూర్తి కాలేదు. ఆ అడివి పక్షులన్నీ నిన్ను తిట్టిపోసి నీతో యుద్ధానికి దిగాయి అన్నావు. ఆ తర్వాత ఏం జరిగింది?' అన్నాడు.

దీర్ఘముఖుడు చెప్పసాగాడు:

'ఆ పక్షులన్నీ నామీదికి వచ్చి, 'కృతఘ్నుడా! ఇంట తిని ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు, మా దేశం వచ్చి మా రాజుని నిందిస్తావా? మేము చిత్రవర్ణుడి బంటులం. నిన్ను ఇప్పుడే చీల్చి చంపుతాం' అంటూ నా ఒళ్ళంతా కుళ్ళబొడిచారు. 'మీ రాజు హిరణ్యగర్భుడు, హంస. టివాడు. అలాంటివాడి కెవరూ భయపడరు. ఇంక అతను రాజ్యమెలా చేస్తాడు? రాజు అన్న తరువాత ఒకప్పుడు మృదువుగా, శాంతంగా ఉండాలి, ఒకప్పుడు కరుకుగా, క్రూరంగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడూ మెత్తగా ఉండే మీ బలహీనపు రాజు సవ్యంగా రాజ్యమెలా చేస్తాడు? చేరితే పెద్ద పళ్ళచెట్టు కింద చేరాలి. పళ్ళు కాకపోతే, నీడయినా దొరుకుతుంది. బలహీనుడయిన రాజు దగ్గర చేరటం దండగ. పొట్టకోసం అలాటి హీనుడి దగ్గర సేవ చేయటం కంటే, ఆకూ, అలమూ తింటూ అడివిలో పడుండటమే నయం. రాజు మనల్ని కష్టకాలంలో రక్షించగలిగి ఉండాలి. లేకపోతే, రాజెందుకు,రాజ్యమెందుకు ? పూర్వం కుందేళ్ళు ఏనుగుని మోసం చేసి. తమ పాటికి తాము హాయిగా బతకలేదూ? కావాలంటే ఆ కథ చెప్తాం, విను.

ఓ అడవిలో కొన్ని ఏనుగులుండేవి. ఓ ఏడు వానలు సరిగా పడక అడవిలో కొలను ఎండిపోయింది. ఏనుగులన్నీ వాటి రాజు దగ్గరికి వెళ్ళి, 'రాజా, మనం ఇన్నాళ్ళూ స్నానం, పానం చేస్తున్న చెరువు కాస్తా ఎండిపోయింది. తాగటానికి కూడా నీళ్ళు దొరకట్లేదు. ఈ కష్టం నించీ ఎలా బయటపడాలో తెలియటం లేదు. ఏదో ఉపాయం ఆలోచించి, మమ్మల్ని నువ్వే రక్షించాలి. ముంచినా, తేల్చినా ఇంక నువ్వే మాకు దిక్కు అన్నాయి.

రాజు ఒక సేవకుణ్ణి పంపి ఆ చుట్టుపట్ల ప్రాంతాలన్నీ వెతికించాడు. కొంతదూరంలో పెద్ద చెరువు కనిపించింది. ఏనుగులన్నీ ఆ చెరువు ప్రాంతానికి పోయి దప్పిక తీర్చుకోవడమే గాక హాయిగా స్నానాలు కూడా చేశాయి. కానీ, ఆ ఏనుగుల హడావిడిలో, తొక్కిసలాటలో, పాపం, ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్ళు చాలా నలిగిపోయాయి. కొన్ని కుందేళ్ళయితే ఏనుగుల కాళ్ళకింద పడి చచ్చేపోయాయి.

ఆ కుందేళ్ళ రాజు పేరు శిలీముఖుడు. మంత్రి పేరు రోమకర్ణుడు. తనతోటి కుందేళ్ళు అలా ఏనుగుల కాళ్ళకిందపడి చచ్చిపోతుంటే, రోమకర్ణుడి కెంతో బాధ కలిగింది. రాజు శిలీముఖుడి దగ్గరికి వెళ్ళి, 'రాజా! ఈ ఏనుగుల గుంపు రావటంతో మన కుందేళ్ళకు ప్రళయం వచ్చేసింది. ఏదయినా యుక్తితో మనల్ని మనం రక్షించుకోవాలి' అన్నాడు.

శిలీముఖుడు తన మంత్రులనందరినీ పిలిచాడు. "ఈ ఏడు వేసవి ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఈ ఏనుగులు తెగ తిరిగేస్తున్నాయి. ఇవి యిలా రోజూ మన అడవిలో తిరిగితే, అడవిలో కుందేళ్ళన్నీ వాటి కాళ్ళక్రిందపడి నలిగి చావవలసిందే. మీలో ఎవరయినా మంచి ఉపాయం చెప్పండి" . అన్నాడు. ఏ ఉపాయం తోచక కుందేళ్ళు ముఖం, ముఖం చూసుకొంటూ మౌనంగా కూర్చొన్నాయి. ఇంతలో విజయుడు అనే ముసలి కుందేలు లేచి, 'రాజా, ఇదో పెద్దపని కాదు. బలం లేకపోయినా, తెలివి ఉంటే ఎంత కష్టమయిన పనయినా చేయచ్చు. ఈ ఏనుగులను ఇక్కణ్ణించి తరిమివేసే పని నాకు అప్పజెప్పండి. నేను సాధించి వస్తాను' అంది. రాజు అనుమతించాడు. విజయుడు బయల్దేరాడు..

ఆలోచిస్తూ నడుస్తూ విజయుడు చెరువు పక్కనే ఉన్న కొండపైకి ఎక్కి కూర్చొని, ఏనుగుల గుంపు మళ్ళీ నీళ్ళ కోసం చెరువు దగ్గరికి వచ్చేదాకా వేచి ఉన్నాడు. అవి వచ్చి, నీళ్ళు తాగి తిరిగిపోతుండగా కొండ మీద నుంచీ ఒక కేక వేశాడు. 'ఓ ఏనుగు రాజా! ఇది ఒక్క మాట విని వెళ్ళు!' అని. ఏనుగులు రాజు కిందినుంచీ కొండమీదికి చూసి, 'ఇంతకీ నువ్వెవరివి? నాతో ఏం మాట్లాడాలి. త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి' అన్నాడు.

విజయుడు గంభీరంగా మొహం పెట్టి నేను సామాన్యశ్రీ కాదు. వెన్నెలతో లోకాలన్నింటినీ వెలిగించే ఆ చంద్రుడు మా మహారాజు. నేను మహాబలుడయిన ఆ మహారాజు దూతను. ఆయన సందేశం నీకు వినిపించడానికి వచ్చాను, విను! "ఈ చెరువు నా సామ్రాజ్యంలోది. ఎంతటి బలవంతుడయినా నా అనుమతి లేకుండా ఇక్కడికి రాకూడదు. మీరు వచ్చి, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తిరిగి, మా కుందేళ్ళను తొక్కి చంపి మహాపరాధం చేశారు. మీకు బతకాలని ఆశ ఉంటే, వెంటనే ఇక్కణ్ణించి పారిపొండి. ఇక ముందెప్పుడూ ఇటు పక్కలకు రావద్దు. మీ తప్పును తెలియక చేసిన తప్పుగా భావించి, క్షమిస్తున్నాను. నా ఆజ్ఞ పాటించకపోతే మిమ్మల్నందర్నీ భస్మం చేస్తాను" అని ఆయన మీకు చెప్పమన్నాడు. ఆయన మీమీద చాలా కోపంగా ఉన్నాడు. మీరొకసారి వెళ్ళి ఆయన కాళ్ళమీద పడి క్షమాపణ చెప్పుకొంటే చల్లబడతాడు. లేదంటే మీ ఇష్టం” అన్నాడు.

ఈ మాటలకు ఏనుగులు నిజంగా భయపడిపోయినాయి, ఏదో నక్కలతో, పిల్లులతో అంటే యుద్ధం చేయొచ్చు కానీ, సాక్షాత్తూ దైవ స్వరూపులయిన సూర్య చంద్రుల వంటి వాళ్ళతో శత్రుత్వమే?

"ఓ విజయుడా! మేము. మీరాజు కోపానికి తట్టుకోగల వాళ్ళం కాదు. తెలియక పొరపాటు చేశాం. ఇంకెప్పుడూ ఈ చెరువుజోలికి రాము. మమ్మల్ని క్షమించమని, నువ్వే మా తరఫున మీ రాజుకు చెప్పు, ఆయన ఎదుటబడే ధైర్యం మాకులేదు. నువ్వే ఎలాగయినా ఆయనకు నచ్చజెప్పి.. మమ్మల్ని కాపాడు. మేం వెళ్ళి వస్తాం" అన్నాయి ఏనుగులు.

"మా రాజు సన్మార్గుడు, చల్లనివాడు. తెలియక చేసిన తప్పులు ఆయన తప్పక క్షమిస్తాడు. భయపడకండి. ఆయన పేరునే ఈ సరస్సుని 'చంద్రసరస్సు' అంటారు. మేము ఆయన సేవకులం. ఆయన ఈ సరస్సు కాపలాకు మమ్మల్ని నియమించాడు. చంద్రుడికి కుందేళ్ళంటే చాలా ప్రేమ అని మీకు తెలుసు గదా! మీ మాటలు ఆయనకు నేను చెప్పొచ్చు.. కానీ ఇప్పుడాయన ఆకాశంలో తిరిగి రావడానికి వెళ్ళాడు. ఇప్పుడాయనను మనం చేరలేం. కానీ ఆయన అప్పుడప్పుడూ మన సరస్సుకు వచ్చిపోతుంటాడు. ఈ రాత్రికి వస్తాడు. మీ రాజు సాయంత్రం చీకటిపడుతుండగా వచ్చి, ఆయన్ని కలిసి క్షమాపణ చెప్పుకొంటే బాగుంటుంది" అన్నాడు విజయుడు.

అలాగేనని ఏనుగుల రాజు సాయంకాలం చీకటి పడుతుండగా ఒంటరిగా చెరువు దగ్గరికి వచ్చాడు. విజయుడు చెరువులో కదుల్తున్న చంద్రబింబం చూపించాడు. ఇంకా పూర్తిగా చీకటి పడకపోవటం వల్ల చంద్రబింబం కొంత ఎర్రగా కనిపించింది. “అదిగో చూడు, ఆయన ఎంత కోపంగా ఉన్నాడో, ఇలాంటప్పుడు మనం ఆయన్ని పలకరించటం ప్రమాదం.. పుటుక్కున చంపేసినా చంపేస్తాడు. అంచేత నువ్వు వెళ్ళిపో. ఇక్కణ్ణించే ఆయనకు ఒక్క నమస్కారం పెట్టి వెళ్ళిపో, నేను సరయిన సమయం చూసి, ఆయన చల్లబడ్డ తర్వాత నువ్వు చెప్పిందంతా ఆయనకు చెప్పి, మిమ్మల్ని క్షమించమని ఎలాగో నచ్చచెబుతాను. కానీ, మళ్ళీ ఎప్పుడూ మీలో ఎవరూ ఈ చుట్టు పక్కలకి కూడా రావద్దు. వస్తే ఆయన మీ ప్రాణాలు దక్కనీయడు!" అన్నాడు విజయుడు. ఓ నమస్కారం పెట్టి, ఏనుగుల రాజు, తన మందనంతా తీసుకొని ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయాడు.

ఈ కథతో చెప్పే నీతి బోధపడింది గదా? 'మీ రాజు వంటి బలహీనుడయిన రాజుని కొలిచే కంటే, ಬುದ್ಧಿ బలంతో యుక్తితో జీవించడం మేలు' అంటూ ఆ అడవి పక్షులు మా రాజువయిన నిన్ను బాగా తిట్టేశాయి.

నాకు చాలా కోపం వచ్చేసింది. అయినా దాన్ని అణుచుకొంటూ 'మా హంస రాజు హిరణ్యగర్భుడు పిరికివాడు కారు శత్రువుల్ని చెందాడటంలో ఆయన్ని మించిన పరాక్రమశాలి ఈ భూమి మీద లేదు. మీకాయన సంగతి శ్రీ శ్రీ తెలియదు. తెలియనప్పుడు ఆయన సంగతి మాట్లాడొద్దు. ఆయన గొప్పవీరుడు' అన్నారు.

ఆ పక్షులు మండిపడి, నన్ను కట్టి పడేసి కొట్టి, హింసించాయి. కొన ప్రాణంతో ఉన్న సన్ను వాళ్ళ రాజు. . చిత్రవర్ణుడి ముందుకు తీసుకెళ్ళాయి. "రాజా, ఈ కొంగ మదించి, మంచీ చెడూ లేకుండా, మిమ్మల్ని నిందించాడు. ఇతరుల్ని నిందించేవాడు తన పాపంలో తనే కాలిపోతారు, చచ్చినవాడిని చంపటం ఎందుకూ అని మీరు జాలి చూపొద్దు. వీడిని మేమే చంపుదుం. కానీ మీకు విషయం చెప్పి, మీ అనుమతితో చంపాలని ఇక్కడికి తెచ్చాం" అన్నాయి. కానీ చిత్రవర్ణుడు వాటిని వారించాడు. "వీడెవరూ? ఏ దేశం వాడు?" అని అడిగాడు, "వీడిది కర్పూరద్వీపమట, వీడి రాజు పేరు హిరణ్యగర్భుడట" అని అవి జవాబు చెప్పాయి. ఇంతలో చిత్రవర్ణుడి మంత్రి - దూరదర్శి అనే గడ్డ - కల్పించుకొని, మీ రాజ్యానికి మంత్రి ఎవరు?" అని నన్నడిగాడు. 'మా రాజ్యానికి మంత్రి సర్వజ్ఞడనే చక్రవాక పక్షి. ఆయన ధర్మజ్ఞుడూ, అనుభవం కలవాడూ, వీరుడూ, ప్రతిభాశాలీ', అని చెప్పాను.

ఇంతలో అక్కడే ఉన్న ఒక చిలుక - దానిపేరు అరుణముఖుడు - చిత్రవర్ణుడితో ఇలా అంది: "రాజా, ఈ కర్పూర ద్వీపంలాంటి చిన్న దీవులన్నీ జంబూద్వీపంలో భాగమే కాబట్టి, ఆరాజ్యంకూడా మనదే. ఆ హంసరాజు హిరణ్యగర్భుడు మీ కింద సామంతుడుగా ఉండాల్సినవాడే. ప్రతి ఏడు మీకు కప్పం కట్టాల్సిన వాడు. వెంటనే ఒక దూతని హిరణ్యగర్భుడి దగ్గరకు పంపి, మీకు కట్టవలసిన పన్ను కట్టించుకోండి. ఇలాంటి విషయాల్లో రాజులు జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మడికి అసంతృప్తి, రాజుకు తృప్తి పనికిరావు. రాజు ఏదో రకంగా శత్రువుల్ని లోబరచుకొని తనరాజ్యం పెంచుకోవాలి. అవసరమయితే మీరు సైన్యంతో బయల్దేరి వెళ్ళి కర్పూరద్వీపం ఆక్రమించాలి. ముందు దూతను పంపండి.

హిరణ్యగర్భుడు మంచిగా మాట విన్నాడా సరేసరి, లేకపోతే యుద్ధంలో ఓడి చస్తారు."

ఈ మాటలు చిత్రవరుడికి బాగా నచ్చాయి. సరేనన్నాడు.

చూడండి రాజా! వాళ్ళ మదమూ, దుర్మార్గమూ, దురాశా! ఆశ వల్లే కదా అన్ని అనర్థాలూ! ఆశను జయించి, తృప్తిగా ఉండేవాడే అదృష్టవంతుడు! నేను ఊరుకోలేక. చిత్రవర్ణుడితో యిలా అన్నాను: "రమ్మనంగానే సొమ్ము వస్తుందా? చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకముండాలి. బాడు దున్న ఈనిందంటే, నువ్వు దూడను కట్టేయమంటావా? హిరణ్యగర్భుడు మహావీరుడని మరచిపోకు. నిశ్చింతగా ఉన్నవాడివి ఉండక, చెట్టు కొట్టి నెత్తిన వేసుకొంటావెందుకు? వట్టి మాటలతో రాజ్యాలు రావు. ఇప్పుడు నీవాళ్ళు నీ మెప్పుకోసం వదరుతున్నారు. కానీ, రేపు వీళ్ళ సలహా వల్ల నువ్వు కష్టాలలో పడితే ఏం చేయాలో తెలీక చుక్కలు లెక్కపెట్టాల్సిందే, అయినా కర్పూర ద్వీపం మీద పూర్తి హక్కు మా రాజుదే".

అంటే చిత్రవర్ణుడు, ఓ విషపు నవ్వు నవ్వి, "తొందరపడకు, ఎవరి హక్కో యుద్ధంలోనే తేలుతుంది. నువ్విప్పుడే మీ దేశం వెళ్ళి మీ రాజుని యుద్ధానికి సిద్దం చేయి. నీతో బాటు నా దూతగా ఈ అరుణముఖుడిని పంపుతాను" . అన్నాడు. అరుణముఖుడు (చిలుక) దీనికి ఒప్పుకోలేదు. "రాజా! నా ఎత్తు ధనం ఇచ్చినా, నేను ఈ దుష్టుడితో, అహంభావితో ప్రయాణం చేయలేను. వాడిని ముందు వెళ్ళనివ్వండి. ఆ తర్వాత నేను వెళతాను. మీ మాట కాదన్నందుకు క్షమించండి. వీడితో వెళ్తే వీడు నన్ను దోవలోనే చంపే ప్రమాదం ఉంది. అదీగాక మంచివాడితో కలిస్తే పూలతో కలిసిన దారానికి లాగా గౌరవం వస్తుంది. దుర్మార్గుడితో కలిస్తే, ఇనుముతో కలిసిన అగ్నికి సమ్మెట దెబ్బలు తగిలినట్లు కష్టాలు తప్పవు. ఇలాంటి దుర్మార్గుడితో సాంగత్యం చేస్తే పూర్వం కాకి హంస కథలో హంసలాగా అవుతుంది నా పని. ఆ కథ విను" అంటూ కథ మొదలెట్టాడు అరుణముఖుడు.

పులి తోలు కప్పుకొన్న గాడిద

   పులి తోలు కప్పుకొన్న గాడిద 

కరిపురం అనే ఊర్లో విలాసుడనే రజకుడుండేవాడు. అతను ఒక గాడిదను కొనుక్కొని, దాన్ని బాగా మేపేందుకు ఓ ఉపాయం ఆలోచించాడు. రాత్రివేళల ఆ గాడిద మీద ఒక పులితోలు కప్పి దాన్ని చీకట్లో పంటచేల వైపు పంపించేవాడు. పొలాల మీద పంటకు కాపలా కూర్చొన్నవాళ్ళు దాన్ని చూసి పులి అని భయపడి దగ్గరకి వెళ్ళటానికి జంకేవారు. ఈ ఉపాయం కొన్నాళ్ళు పనిచేసింది. గాడిద బాగా మేసి బలిసింది.

రోజూ యిలా తమ పైరు నష్టమౌతుంటే రైతులకూ బాధే. ఒకరాత్రి ఒకరైతు, గుండె దిటవు చేసికొని, ఈ రాత్రి ఎలాగయినా పులిని పట్టి చంపాలని, బయల్దేరాడు. తనూ ఒక బూడిదరంగు దుప్పటి కప్పుకొని, చీకట్లో కనబడకుండా తన పొలం గట్టున చెట్టునీడలో కూర్చొన్నాడు. అతని చేతిలో విల్లు, అంబులూ సిద్ధంగా ఉన్నాయి, పులి కనబడితే చంపేందుకు. రోజులాగే, గాడిద చేనులో పడి మేయటానికి వచ్చింది, పులితోలు కప్పుకొని. చెట్టుకింద కూర్చొన్న రైతును చూసింది. బూడిదరంగు దుప్పటితో, చీకట్లో కూర్చొన్న ఆ రైతు ఆకారాన్ని చూస్తే, దానికి అది తనలాంటి మరో గాడిదలాగా  కనిపించింది. తనలాగే రాత్రిపూట చేను మేయటానికి వచ్చిందనుకొంది. దగ్గరకు వెళ్ళి, పలకరింతగా, ఓండ్ర పెట్టింది.

దాని కూత వినగానే, అప్పటిదాకా భయపడుతూ కూర్చొన్న రైతుకు, భయం పోయింది. 'ఈ పనికిమాలిన గాడిదను చూసి యిన్నాళ్ళు పులి అని భయపడుతూ నష్టపోయాను, ఎంత మూర్ఖుణ్ణి!' అనుకొని ఒకే ఒక్క బాణం వేసి, దాని ప్రాణం తీశాడు.

నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉంటే సురక్షితంగా ఉండేది! 'అందుకే అయినచోటా, కానిచోటా నోటి దురుసుతనం చూపిస్తే ప్రమాదం.' అని కథ ముగించాడు హిరణ్యగర్భుడు.

పావురం - డేగ

                పావురం - డేగ 


మధురా నగరంలో ఓ గుడి దగ్గర ఓ పావురాల జంట కాపురముండేది. ఓ రోజు ఆ పావురాలు గుడి మంటపం
దగ్గర తిరుగుతుంటే ఒక డేగ వాటిని చూసింది. ఎలాగయినా వాటిని పట్టుకొని చంపాలని చాలాసేపు ప్రయత్నం చేసింది. గుడి రక్షకులు అక్కడే ఉండటం వల్ల, డేగ పావురాలను పట్టుకోలేక పోయింది. కొంతసేపయింతర్వాత “సరేలే! ఈ పావురాలు ఎక్కడికి పోతాయి? వంటింటి కుందేళ్ళలా ఇక్కడే ఉంటాయి గదా! మరోసారి వచ్చి వీటిని చంపచ్చు" అనుకుని డేగ ఎగిరిపోయింది.

ఇదంతా చూస్తున్న ఆడ పావురానికి భయం వేసింది. 'చూశావా, డేగ యివాల్టికయితే మనల్ని వదిలి పెట్టిపోయింది. కానీ, ఎంత కోపంగా వెళ్ళిపోయిందో చూశావా? అది ఇంక ఎప్పుడూ మనమీద కన్ను వేసే ఉంచుతుంది. మనం ఇక్కణ్ణించి వెళ్ళిపోకపోతే, అది మనల్ని బతకనియ్యదు. ముందే జాగ్రత్త పడటం మంచిది' అంది తన భర్తతో.

మగపావురం ఈ మాటలు లెక్కచెయ్యలేదు. 'ఎందుకిలా అనవసరంగా భయపడతావ్? నీకు నా బలం తెలియదు. ఉన్న ఊరూ, కన్నతల్లి ఒక్కలాంటివారు. డేగకు భయపడి పారిపోతే నలుగురూ మనల్ని చూసి నవ్వుతారు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది తప్పా ఎంత భయపడి ఏం లాభం? సుఖదుఃఖాలు ఈశ్వరేచ్ఛ బట్టి కలుగుతాయి, కంగారుపడకు. ఎంతటి బలమయిన పక్షి అయినా, నాకు ఎదుటపడటానికి జంకుతుంది. ఈ డేగ ఎంత? అదీ మనలాగా పక్షే కానీ, దయ్యం కాదు. అది మన జోలికి వస్తే ఒక్క ముక్కుపోటుతో దాన్ని చంపేస్తాను. గోళ్ళతో చీల్చి చెండాడుతాను. నువ్వే అది చూసి మెచ్చుకొంటావ్. నా మాట విని నిశ్చింతగా ఉండు" అన్నాడు. భర్త కెదురు చెప్పలేక ఆడపావురం కూడా అప్పటికి ఊరుకొంది.

కానీ ఆ మర్నాడు ఉదయమే డేగ మళ్ళీ వచ్చింది. గుడి ప్రహరీ గోడ మీద కాపువేసి, పొద్దున్నే పావురాల జంట బయటికి రాగానే, వాటి మీదికి దూకి, మగపావురాన్ని ముక్కున కరుచుకుపోయి తినేసింది. ఆడపావురం అతి కష్టం మీద గుడిలోకి దూరి తప్పించుకొంది.

అందువల్ల, బలవంతుడితో తలపడటం మంచిది కాదు. అది నాశనానికే.

అంతేకాదు, ఎంత బలమున్నా మాట దురుసుతనం పనికిరాదు. గొడ్డలితో కొట్టేసినచెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటతో విరిగిన మనసు సరిచేయలేం. దీనికీ ఉదాహరణగా ఓ కథ ఉంది. అదీ విను' అంటూ మరో కథ చెప్పాడు హిరణ్యగర్భుడు.

కోతులు - కుందేలు

            కోతులు - కుందేలు

మాల్యవంతమనే పర్వతం మీద ఒక ఉండేది. ఒకసారి ఆ అడవిలో కొన్ని కోతులు దాహం తీర్చుకోవడానికి వెతుకుతూ చాలాసేపు తిరగాల్సి వచ్చింది. ఎండమావుల వెనక తిరిగి, తిరిగి నీళ్ళు దొరకక, చాలా అలిసిపోయి కోతులన్నీ ఓ మర్రిచెట్టు కింద కూలబడ్డాయి. వాటిలో ఒక కొండముచ్చు యిలా అంది : 'చూశారా! మనం నీళ్ళ కోసం తిరుగుతూ, తిరుగుతూ మన స్థావరం నించీ ఏడెనిమిది మైళ్ళు వచ్చేశాం. ఎండవేడికి కాళ్ళు బొబ్బలెక్కాయి. నాలుక పిడచకట్టుకుపోయింది. అడుగు తీసి వేసే ఓపిక లేదు. నీళ్ళు దొరకనే లేదు. ఇప్పుడేం చేయాలి?'

ఆ మర్రిచెట్టు తొర్రలో ఓ కుందేలుంది. పాపం ఆ మాటలు విని దానికి ఆ కోతుల మీద జాలివేసింది. తొర్రలోంచి బయటికొచ్చి 'పిచ్చి కోతుల్లారా! మీరు పాపం అనవసరంగా ఎండమావులు చూసి, వాటిలో నీళ్ళు దొరుకుతాయని భ్రమపడి పరుగెట్టి అలసిపోయారు. మీకు నీళ్ళు కావాలంటే, అల్లదిగో, ఆ దిక్కున, పల్లంలో, దగ్గర్లోనే ఓ చెరువుంది. అక్కడికి పోయి | దాహం తీర్చుకోండి' అని చెరువున్న దిక్కు చూపించింది.

మంచి సలహా చెప్పినందుకు కోతులు సంతోషపడలేదు. సరికదా! చాలా కోపం తెచ్చుకున్నాయి. వాటిలో ఒక కోతి కుందేలు వెనక కాళ్ళు పట్టి పైకెత్తి, "విన్నారా! ఈ కుందేలు మనల్ని ఎన్ని తిట్లు తిట్టిందో, మనకు తెలివిలేదట. తెలివి దీనికే ఉన్నదట. ఇది చెప్తే తప్పా మనకు తెలీదట. చూశారా, దీని పొగరు?' అంటూ, దాన్ని నేలకు వేసి కొట్టి, కొట్టి చంపేసింది. తరువాత కోతులన్నీ కుందేలు చూపించిన చెరువు  దగ్గరికి వెళ్ళి, హాయిగా దాహం తీర్చుకొని చక్కాపోయాయి!

నీతి ఏమిటంటే మూర్ఖులకు హితవు చెప్పే ప్రయత్నం చేస్తే అది ప్రమాదం.

సరే, మళ్ళీ మన కథకి వస్తే, ఆ జంబూద్వీప పక్షులన్నీ నన్నూ, మిమ్మల్నీ బాగా తిట్టిపోసి, 'దుర్మార్గుడా, నువ్వు మా దేశానికి వచ్చి, మమ్మల్నే నిందిస్తావా? మీ రాజు గొప్పలూ, మీ ఊరి గొప్పలూ గోరంతలు కొండంతలు చేసి, నీ పక్షపాత బుద్ధి చూపించుకొన్నావు. ప్రపంచమంతా మెచ్చుకొన్న మా రాజు చిత్రవర్ణుడు నీకు నచ్చదు. మీ హంసరాజు, మేఘం కనిపిస్తే భయం వేసి పారిపోయే పిరికివాడు, పెద్దవీరుడా? మీ హిరణ్యగర్భుడి వంటి రాజులు వెయ్యి మందయినా మా చిత్రవర్ణుడికి సాటిరారు. నీ సలహా ఏడిచినట్టుంది. నువ్వే మా మాట విను. నువ్వూ, మీ రాజూ కలిసి మా రాజు దగ్గర ఆశ్రయం పొంది బతకండి' అని నోటికొచ్చినట్టు మాట్లాడాయి.

నాకు, ఆ మాటలు విని, చాలా కోపమొచ్చింది. అయితే, అప్పటికి చేసేదేమీ లేక, అతి కష్టం మీద నా కోపం కప్పిపుచ్చి యిలా అన్నాను: “ఇవేం మాటలు! నా అభిప్రాయం చెప్పమని అడిగింది మీరు. అడిగారు కదా అని నాకు తోచింది. చెప్పాను. నచ్చితే వినండి, లేకపోతే మానేయండి. అంతేకాని, యిలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మా రాజు గొప్పతనం. మీకేం తెలుసు? నిష్కారణంగా ఆ మహానుభావుణ్ణి తిట్టి, పాపం కట్టుకొంటున్నారు. నోటి దురుసుతనం మంచిది కాదు. మీరు రాళ్ళు రువ్వితే నేను పూలు రువ్వుతాననుకోకండి. మా రాజు సంగతి తరువాత మాట్లాడచ్చు. ముందసలు ఈ నెమలిని తీసుకొచ్చి మీకు రాజుగా కూర్చోబెట్టిన మూర్ఖుడెవరో వాడి సంగతి మొదట

నేను ఈ మాటలు అనేసరికి, ఆ పక్షులకు మరింత కోపం వచ్చింది. అవన్నీ కలిసి నామీదికి యుద్ధానికి వచ్చాయి. నేనూ ఊరుకోలేదు. అవమానించిన వాళ్ళమీద పరాక్రమం చూపించటమే పురుషలక్షణం కాబట్టి నేను వాటినన్నింటినీ ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొన్నాను..

కథ యిక్కడి దాకా రాగానే, హిరణ్యగర్భుడు కథ చెప్తున్న దీర్ఘముఖుడితో యిలా అన్నాడు: 'మదంతో ఒళ్ళు మరిచిపోయి, తామెంతో తమ బలమెంతో తెలుసుకోకుండా, తమకంటే బలవంతులయిన వారితో కయ్యానికి కాలు దువ్వితే, నాశనమయిపోతారు. వెనకటికి ఒక పావురం యిలాగే గురించి, డేగతో పోట్లాడి దెబ్బతిన్న  కథ ఒకటి ఉంది. చెప్తాను, విను.

దీర్ఘముఖుడి యాత్రా విశేషాలు

    దీర్ఘముఖుడి యాత్రా విశేషాలు

కర్పూరద్వీపంలో పద్మదేళి అనే పేరు గల సరస్సు ఉండేది. హిరణ్యగర్భుడు అనే హంస ఆ కొలనులో పక్షులన్నిటికీ రాజు, చాలా బుద్ధిమంతుడూ, సజ్జనుడూ అని పేరు పొందాడు. ఓ రోజు హిరణ్యగర్భుడి దగ్గరకు దీర్ఘముఖుడనే కొంగ వచ్చింది. దీర్ఘముఖుడు అంతకు ముందు కొన్ని నెలలుగా ఎటో బయటి ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ అప్పుడప్పుడే సరస్సుకు తిరిగివచ్చాడు.

"ఏం దీర్ఘముఖా, క్షేమమా? నిన్ను చూసి చాలారోజులయింది. చాలా దేశాలు తిరిగి వచ్చి అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. ఇంతకూ, ఏఏ దేశాలు చూశావు? ఏమేం విశేషాలు చూశావు? నీ మొహం చూస్తే ఏదో విశేషం చెప్పబోతున్నట్లు కనిపిస్తున్నది. ఏమిటా వింత, చెప్పు?' అన్నాడు హిరణ్యగర్భుడు.

"మీ రాజ్యంలో మీరు రాజుగా ఉండగా, మాకెప్పుడూ క్షేమమే. కానీ, దేశం వదిలి యాత్రలు తిరుగుతుంటే సుఖం ఎప్పుడూ ఉండదు. నేనెంత చిక్కిపోయానో తెలుస్తూనే ఉన్నది. కదా? దానికేం గాని, గడిచిన కొద్ది నెలలలో నేను చాలా ప్రాంతాలు తిరిగి, తిరిగి దేవుడి దయవల్ల క్షేమంగా వచ్చాను. రకరకాల వింతలూ, విశేషాలూ చూశాను. అవన్నీ చెప్పాలంటే చాలాకాలం పడుతుంది. అన్నీ నిదానంగా చెప్తాను. దోవలో ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. ముందు దాన్ని గురించి చెప్పనీయండి” అని మొదలు పెట్టాడు దీర్ఘముఖుడు.

'జంబూద్వీపంలో వింధ్యపర్వతం మీద చిత్రవర్ణుడని ఒక నెమలి ఉంది. చిత్రవర్ణుడు ఆ ప్రాంతంలో పక్షులకు రాజు. నేను అతడున్న అడవికి వెళ్ళాను. అక్కడి పక్షులు నన్ను చూసి "ఎవరు నువ్వు, ఏ దేశం వాడివి, ఎక్కడినించీ ఎక్కడికి నీ ప్రయాణం? మీ రాజు ఎవరు?' అని ప్రశ్నించాయి.

'నా పేరు దీర్ఘముఖుడు. మా రాజు హిరణ్యగర్భుడనే పుణ్యాత్ముడు. దేశదేశాలు చూడాలని ఆసక్తితో తిరుగుతూ, తిరుగుతూ మీ ఊరొచ్చాను. ఈ రోజంతా మీతో గడిపి, మీ దేశపు విశేషాలు విని తెలుసుకొని, రేపు వెళ్ళిపోతాను' అన్నాను. ఆ పక్షులు నన్నెంతో ప్రేమగా ఆదరించి, ఆ అడవి ప్రాంతంలో ఉన్న చూడదగ్గ విశేషాలన్నీ చూపించాయి. వాళ్ళ రాజును కూడా కలిసి వచ్చాను. అదంతా అయిన తర్వాత ఆ పక్షులు నన్నో ప్రశ్న అడిగాయి.

"దీర్ఘముఖా, నీకు మీ బాగుందా? మీ రాజు రాజ్య బాగుందా, మా రాజ్యం గొప్పవాడా, మా రాజు గొప్పవాడా?
మొహమాటం, పక్షపాతం లేకుండా మనసులో మాట చెప్పు' అనగా, నేను నిర్మొహమాటంగా జవాబిచ్చాను.

'మిత్రులారా! మీరు బావిలో కప్పల లాగా, లోకజ్ఞానం ఏమీ లేకపోవడం వల్ల యిలాంటి పిచ్చి ప్రశ్న అడుగుతున్నారు. మా రాజ్యానికీ, మీ రాజ్యానికీ పోలిక ఎక్కడ? ఏనుగుకూ, దోమకూ ఉన్నంత తేడా ఉంది. హస్తిమశకాంతరం. మాది అందమయిన దేశం. మీది కీకారణ్యం. మా ఊరు స్వర్గం, మా రాజు వైభవం ఇంద్ర వైభవం. మీదేమో అడవి. మీరూ, మీ రాజూ ఈ కారడవిలో కాయలూ, దుంపలూ తింటూ బతికేవాళ్ళు. ఇక్కడి పక్షులన్నీ కాకిమూకలు. అసలు మీరు ఈ నెమలిరాజును పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారో నాకు తెలియటం లేదు. నన్నడిగితే, యిది మీ తప్పుకాదు. మిమ్మల్ని, పాపం, దేవుడిలా పుట్టించాడు, మీరేం చేస్తారు? అయినా మీరంతా సాటి పక్షులు కాబట్టి మీకో సలహా యిస్తాను. మీరు నిజంగా బాగుపడదల్చుకొంటే, రేప్పొద్దున నేను బయల్దేరేటప్పుడు నాతో వచ్చేయండి. మా దేశం పోదాం. అక్కడ మా రాజు పాలనలో చల్లగా కాలం గడపండి. వేరే ఆలోచన లేకుండా, నాతో రండి. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోదాం' అన్నాను.

రోగికి పథ్యం పెడితే రుచిస్తుందా? వాళ్ళకు నా మాటలు నచ్చలేదు సరికదా, పట్టరాని కోపం వచ్చింది. నన్నూ, మాకు రాజయిన మిమ్మల్ని నిష్కారణంగా వాళ్ళు తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కాదు. అవన్నీ ఇక్కడ చెప్తే బావుండదు. అయినా వాళ్ళు అలా మొరిగితే, మీకొచ్చిన తక్కువతనమేమీ లేదు. వాటి బుద్ధి బయటపడింది. పాముకి పాలుపోస్తే దాని విషం మరీ పెరుగుతుంది. అలాగే బుద్ధిలేని వాళ్ళకు హితవు చెప్తే కూడా వాళ్ళకు మదం పెరుగుతుంది. సలహాలు చెప్పినా మంచివాడికే చెప్పాలి. లేకపోతే కోతులకు నీతి చెప్పటానికి ప్రయత్నించిన కుందేలులాగా ప్రమాదంలో పడతాం.

ఆ కథ వినండి.

విగ్రహం (యుద్దం)

                     విగ్రహం

మిత్రలాభం, మిత్రభేదం కథలు పూర్తయింతర్వాత రాజకుమారులు విష్ణుశర్మని, 'ఈ నీతిచంద్రికలో మూడోభాగంగా విగ్రహం అనేకథ ఉందట కదా? అది కూడా చెప్పరా?' అన్నారు. విగ్రహం అంటే యుద్దం.ఈ కథ ఒక నెమలికి, హంసకీ జరిగిన యుద్ధం గురించిన కథ కనక దీనికి విగ్రహం అని పేరు పెట్టారు. విష్ణుశర్మ పిల్లల శ్రద్ధచూసి సంతోషించి విగ్రహం కథ చెప్పటం మొదలెట్టారు.

రాజధర్మం

                     రాజధర్మం

ఇలా కథలు చెప్తూ కంటకుడు, దమనకుడి దుర్మార్గాన్ని బాగా తిట్టిపోశాడు.  

పక్కన ఎద్దు, సింహం భయంకరంగా యుద్ధం చేశాయి. చివరికి యుద్ధంలో పింగళకుడు, సంజీవకుణ్ణి చంపేశాడు. అతని కోపం చల్లారింది.

కొంతసేపయిన తర్వాత అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఉత్తపుణ్యానికి యుద్ధంలో దిగి సజ్జనుడయిన సంజీవకుణ్ణి చంపినందుకు ఎంతో చింతించాడు. “అడవి జంతువుల్ని రక్షించి, పోషించేవాడు అడవికి రాజు గాని నాలాంటి క్రూరుడు ఏం రాజు? ఆలోచన లేకుండా నా స్నేహితుడూ, శ్రేయోభిలాషీ సంజీవకుణ్ణి పొట్టన పెట్టుకొన్నాను. విషవృక్షమయినా నేను పెంచిన చెట్టును, నేనే నరికేయడం తప్పు. నా సేవకుడు తెలిసో తెలియకో తప్పు చేస్తే మాత్రం నయానో భయానో వాడి తప్పు వాడికి తెలియజెప్పి, మొదటి తప్పు వదిలేయాలి. మళ్ళీ అదే తప్పు చేస్తే పదవిలోంచి తీసేయాలి. అంతకంటే కఠినంగా శిక్షించటం న్యాయం కాదు. లోకం మెచ్చదు. మిగిలిన సేవకులలో కూడా రాజు పట్ల భక్తి చచ్చిపోతుంది.

ఎంతకష్టమయిన పనయినా సాధించవచ్చు కానీ మంచి సేవకుణ్ణి సంపాదించడం కష్టం. ఎంతో అప్రతిష్ఠ చేతులారా తెచ్చుకొన్నాను" అంటూ చాలా బాధపడ్డాడు.

దమనకుడు యిలా అన్నాడు “రాజా, శత్రువును చంపి యిలా దుఃఖించడం రాజులకు మంచిది కాదు. రాజు తనను బాధించేవాడి నెవడినైనా సత్వరం శిక్షించాలని పండితులు చెబుతారు. అపకారం చేసిన వాళ్ళను వదిలేయడం మునులు ధర్మం, రాజులకది ధర్మం కాదు”

రాజు కొంతసేపటికి ఊరట పొందాడు. తర్వాత బహుకాలం తన పరిజనాలతో సుఖంగా రాజ్యం చేశాడు.

అని విష్ణుశర్మ కథ ముగించి “ఈ మిత్రభేదమనే తంత్రాన్ని రాజు శత్రువుల మీద ప్రయోగిస్తే విజయం పొందుతాడు" అన్నాడు. రాజకుమారులు కథలు విని చాలా సంతోషించారు.


ఇంద్రపాలితుడు

            ఇంద్రపాలితుడు




అజన్తుదమనే ఊళ్ళో ఇంద్రపాలితుడనే వర్తకుడుండేవాడు. అతనికి ధనగుప్తుడనే స్నేహితుడు ఉన్నాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు మిత్రుడి దగ్గరకు వెళ్ళి "మిత్రమా! ఉన్నట్టుండి నేను ఊరెళ్ళాల్సొచ్చింది. మానటానికి లేదు. రేపే ప్రయాణం. నా దగ్గర అరవయి బారువలు యినుము ఉంది. అది నీ దగ్గర వదిలి వెళతాను. నీ సరుకుతో పాటు మంచి బేరం వస్తే వీలయినంత అమ్మిపెట్టు. మిగిలిన సరుకు నేను వచ్చిన తరువాత తిరిగి తీసుకుంటాను” అన్నాడు.

"అయ్యో! అదెంత భాగ్యం! నువ్వేమయినా పరాయివాడివా? నా సొమ్మొకటీ, నీ సొమ్మొకటీ కాదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. నేను నీ సరుకు జాగ్రత్త చేసి, వీలయినంత మంచి ధరకి అమ్మిపెడతాను" అన్నాడు ధనగుప్తుడు.

ఇంద్రపాలితుడు సంతోషించి, నిశ్చింతగా ఊరెళ్ళిపోయాడు.
కొన్ని రోజుల తర్వాత స్వగ్రామానికి తిరిగివచ్చి, ధనగుప్తుడి యింటికి వెళ్ళాడు. ధనగుప్తుడు మామూలు అతిథి సత్కారాలు చేశాడు.

"మిత్రమా! ఇనుము ధర పెరిగిందని విన్నాను. మన సరుకేం చేశావు?" అని అడిగాడు ఇంద్రపాలితుడు.

ధనగుప్తుడు విచారంగా ముఖం పెట్టాడు. “నీ సరుకు కొంత నా సరుకుతో కలిపి ఓ గదిలో పెట్టి తాళం వేశాను. నిన్న కొంతమంది వచ్చి “ఇనుము కావాలి, అమ్ముతారా?” అది తాళం తీయించి చూశాను. గదిలో యినుమంతా మాయమయిపోయింది. తాళం తాళంగానే ఉంది. నా సొమ్ము పోయినందుకు నాకు బాధలేదు. గానీ నీ సరుకు పోయినందుకు నేను అమితంగా బాధపడుతున్నాను” అన్నాడు. "తాళం తాళంగా ఉంటే, సరుకు ఎలా పోయిందా అని బాగా ఆలోచించాను. మా యింట్లో ఎలుకలు ఎక్కువ. నీ ఇనుమూ, నా ఇనుమూ కూడా ఆ ఎలుకలే తినేసి ఉంటాయి, సందేహం లేదు!" అన్నాడు.

ఇంద్రపాలితుడికి ధనగుప్తుడి మోసం అర్ధమయింది. కానీ ఏం చేస్తాడు, తన సొమ్ము ఎలా తిరిగి సాధించుకొంటాడు? అప్పటికి మాత్రం, "పోనీలే ధనగుప్తా, నువ్వింతగా చెప్పక్కర్లేదు. నువ్వు నాకు కొత్తవాడివా? నేను నీకు కొత్తా? మనకెంత ప్రాప్తమో అంతే. దీన్ని గురించి నువ్వెక్కువ బాధపడకు" అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

అతనితో స్నేహం మాత్రం ముందటిలాగే కొనసాగించాడు. ఓసారి ఇంద్రపాలితుడు ధనగుప్తుడి యింట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో వీధిలో ఎవరో మామిడిపళ్ళు అమ్ముతూ వచ్చాడు. ధనగుప్తుడి కొడుకు పసివాడు పళ్ళు కావాలని మారాం చేయసాగాడు. ఇంద్రపాలితుడు 'పళ్ళు నేను కొనిపెడతాను పద' అని ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని వీథిలోకి తీసుకెళ్ళాడు. వీళ్ళు వీథిలోకి వెళ్ళేటప్పటికి ఆ పళ్ళబండివాడు కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. బండి వెనకాల కొంతదూరం పిల్లాణెత్తుకొని నడిచాడు ఇంద్రపాలితుడు. పిల్లాణ్ణి ఒకచోట దాచేసి వట్టి చేతులతో ధనగుప్తుడి యింటికి తిరిగి వచ్చేశాడు.

"పిల్లాడెక్కడ?" అన్నాడు ధనగుప్తుడు.

“వాడా? పళ్ళు కొనేందుకు ఒక నిమిషం వాణ్ణి చంకలోంచి దించాను. ఇంతలో ఓ గద్ద వచ్చి పిల్లాణ్ణి ఎత్తుకుపోయింది. నా పిల్లాడిని కాకుండా నీ పిల్లవాడిని తీసుకెళ్ళిందే అని నాకు ఎంతో బాధగా వుంది” అన్నాడు ఇండ్రపాలితుడు.

"ఓరి దిష్టివాడా, పిల్లాడి వంటి మీద ఉన్న బంగారునగలు కాజేయడానికి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావు? నాలుగు సొమ్ముల కోసం పసిపిల్లవాడిని నువ్వే పొట్టను పెట్టుకొన్నావు. లేకపోతే పిల్లవాణ్ణి గద్ద ఎత్తుకుపోవటం ఎక్కడయినా జరుగుతుందా? దుర్మార్గుడా, నీ పని పట్టిస్తాను చూడు!" అంటూ ధనగుప్తుడు శాపనార్థాలు పెడుతూ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు.

న్యాయాధికారి ఇంద్రపాలితుణ్ణి పిలిచి జరిగినదేమిటని ప్రశ్నించాడు. ఇంద్రపాలితుడు మళ్ళీ ఆమాటే చెప్పాడు  పిల్లాడిని గద్ద ఎత్తుకుపోయిందని.

"ఏమిటి నువ్వు చెప్పేది? పిల్లాడిని గద్ద ఎలా ఎత్తుకుపోతుందయ్యా?" అని న్యాయాధికారి గద్దించాడు.         
"అయ్యా, నేను ఈయన యింటిలో అరవై బారులు
ఇనుము పెట్టి వెళితే దాన్ని ఎలుకలు తినేశాయట! అది
సంభవమయితే, పిల్లాణ్ణి గద్ద తన్నుకుపోవటం సంభవం
కాదంటారా?” అన్నాడు ఇంద్రపాలితుడు.

దాంతో జరిగిన కథ అందరికీ అర్థమయింది. ధనగుప్తుణ్ణి మందలించి, అతని దగ్గర్నుంచి ఇనుమునూ, ఇంద్రపాలితుడు దాచినచోటు నుంచీ పిల్లవాడినీ తెప్పించి, ఇనుమును ఇంద్రపాలితుడికీ, పిల్లాడిని ధనగుప్తుడికీ యిప్పించారు. ఇంద్రపాలితుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నించినందుకు ధనగుప్తుడికి తగిన శిక్ష కూడా విధించారు.


నందిగుప్తుడు

                 నందిగుప్తుడు

నాపతి అనే పట్టణంలో నందిగుప్తుడూ, సుదర్శన గుడూ అని ఇద్దరు వర్తకులుండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి వాళ్ళిద్దరూ ఇతరదేశాల్లో కూడా వ్యాపారం చేసి చాలా... డబ్బు సంపాదించుకొని తిరిగి సొంత ఊరు చేరారు.

ఊరు చేరుతుండగానే నందిగుప్తుడు "సుదర్శనా, మనం 1 దేశాల్లో వ్యాపారం చేసి యింత సంపాదించుకొచ్చామని ఎవరికీ తెలియనియ్యడం మంచిదికాదు. తెలిస్తే అందరి కళ్ళూ 2 మన డబ్బు మీదే ఉంటాయి. అందుచేత మన డబ్బంతా ఇంకెబిందెలలో దాని రహస్యంగా ఊరి బయటే మర్రిచెట్టుకింద పాతివేసి ఉంచుదాం. కావలసినపుడు వచ్చి, కావలసినంత తీసుకువెళ్ళాం రహస్యంగా. ఏమంటావ్?" అన్నాడు.

మదర్శనుడు కూడా దానికి ఒప్పుకోవటంతో మిత్రులిద్దరూ డబ్బు దాచేసి, ఊరికి తిరిగి వచ్చారు.

నందిగుప్తుడికి దురాశ ఎక్కువ. ఓరోజు వాడు వెళ్ళి, సుదర్శనుడికి తెలియకుండా డబ్బు దాచిన బిందెలను తవ్వి తీసుకొని మరోచోట రహస్యంగా దాచుకొన్నాడు.

ఆ తరువాత కొన్నాళ్ళకు వాడు సుదర్శనుడి దగ్గరకు వెళ్ళి "సుదర్శనా మన దగ్గర ఎక్కువ డబ్బు లేదని అందర్నీ నమ్మించాము. పైగా దేశపరిస్థితులు సురక్షితంగానే ఉన్నాయి. దొంగల భయం కూడా తగ్గిపోయింది. కనుక యింక మనం మన డబ్బు తెచ్చేసుకొందాం" అన్నాడు.

మిత్రులిద్దరూ మర్రిచెట్టు కింద తవ్వి చూస్తే, సొమ్ము లేదు!

నందిగుప్తుడు గుండెలు బాదుకొంటూ "ఎంతపని చేశావు సుదర్శనా! సొమ్మంతా నాకు తెలీకుండా దొంగతనం చేశావా? మనిద్దరికీ తప్ప ఈ సొమ్ము సంగతి మూడోవాడికి తెలియదు. డబ్బంతా కాజేసి, ఏమీ తెలియనట్లు నటిస్తే వేసూరుకొంటానా? పద, రాజుగారి దివాణానికి, వాళ్ళు నాలుగు తగిలిస్తే గానీ నీకు బుద్ధి రాదు!" అంటూ, సుదర్శనుణ్ణి రాజుగారి దగ్గరికి లాక్కెళ్ళాడు.

"రాజా! వీడు నా మిత్రుడు, నా సొమ్ము దొంగి "లించాడు" అని ఫిర్యాదు చేశాడు.

"రాజా! మేం మిత్రులమన్నమాట నిజమే. మర్రిచెట్టు క్రింద యిద్దరం కలిసి రహస్యంగా డబ్బు దాచుకొన్నమాటా నిజమే. ఈరోజు దాచుకొన్న డబ్బు తెచ్చుకొనేందుకు వెళ్ళి చూస్తే అక్కడ డబ్బు లేదు. ఇంతవరకే నాకు తెలుసు. నేను ఏ పాపమూ ఎరగను" అన్నాడు సుదర్శనుడు చేతులు జోడించి.

రాజు తన ధర్మాధికారుల్ని పిలిచి ఈ తగవు తీర్చ
మన్నాడు.

వాళ్ళు విషయం విని, "సుదర్శనుడు డబ్బు దొంగిలించాడనేందుకు సాక్షులున్నారా?" అని అడిగారు నందిగుప్తున్ని.

"అయ్యా, సాక్షులు చూస్తుండగా దొంగ దొంగతనం చేస్తాడా? పైగా మేం డబ్బు దాచింది. ఎక్కడో ఊరు బయట మర్రిచెట్టు కింద. అక్కడ సాక్షులెవరుంటారు, ఎలా ఉంటారు, నన్ను ఎక్కడినించీ తీసుకు రమ్మంటారు?" అంటూ నందిగుప్తుడు. గుండెలు బాదుకున్నాడు..

కాసేపయిన తరువాత, ఒక ఎత్తు వేశాడు. దీనంగా చూస్తూ ధర్మాధికారితో యిలా అన్నాడు: "సాక్షి లేకపోవటమేమిటి? ఉంది. ఈ దొంగతనానికి ఆ మర్రిచెట్టు సాక్షి, నాలాంటి మంచివాడికి ఆ చెట్టే సాక్ష్యం చెబుతుంది. నేను సత్యం చెబుతుంటే, నాకు దుష్టబుద్ధి లేకపోతే, ఆ మర్రిచెట్టే నా పక్షాన సాక్ష్యం పలుకుతుంది. ఇదే నా శపథం. మీరు వచ్చి ఆ మర్రిచెట్టునే అడగండి!"

ఈ శపథం విని దివాణంలో అందరూ ఆశ్చర్యపోయారు. "ఈ కలికాలంలో చెట్ల చేత మాట్లాడించగల మహానుభావులూ, సత్యవంతులూ ఉంటారా?" అని కొందరు ముక్కున వేలేసుకున్నారు. "ఇవన్నీ కల్లబొల్లి మాటలూ, తనే సొమ్ము దొంగిలించి ఈ వేషాలన్నీ వేస్తున్నాడు!" అనుకొన్నారు. మరికొందరు.

ధర్మాధికారులు మాత్రం "ఈరోజు చాలా పొద్దు పోయింది. రేపు మనం మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి అడిగి చూద్దాం!" అని వెళ్ళిపోయారు.

ఆరోజు రాత్రి యింటికి వెళ్ళి, తలుపులన్నీ భద్రంగా బిడాయించి, నందిగుప్తుడు తన తండ్రితో ఈ విషయం అతి రహస్యంగా చర్చించాడు. "నాన్నా! ధనమూలమిదం జగత్ అన్నారు కదా! ధనం లేనివాడికి లోకంలో విలువలేదు. కనుక ఎలాంటి దుర్మార్గమయినా చేసి డబ్బు సంపాదించవచ్చని నా అభిప్రాయం. అంతగా అయితే తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతోనే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అందుకని మర్రిచెట్టు కింద సొమ్యు నేనే దొంగిలించి, ఆ దొంగతనం సుదర్శనుడి నెత్తిన వేశాను. జనాన్ని నమ్మించడానికి ఈ మర్రిచెట్టు సాక్ష్యం ఎత్తువేశాను. పొద్దున్నే చీకటితో నువ్వు వెళ్ళి ఆ మర్రిచెట్టు తొర్రలో ఎవరికీ కనబడకుండా కూర్చో. ధర్మాధికారుల ప్రశ్నలకి జవాబు చెప్పి మర్రిచెట్టు సాక్ష్యం చెప్పిందని నమ్మించు. అప్పుడు నేనొక ధర్మరాజునని ధర్మాధికారులతో పాటు ఊళ్ళో అంతా నమ్మేస్తారు. సొమ్ము మనదవుతుంది. సుదర్శనుడు జైలులో పడతాడు!" అన్నాడు.

"కుమారా, నాకీ పని మంచిదని అనిపించటం లేదు. నువ్వు యిది ఉపాయమనుకొంటున్నావు గానీ దీనిలో అపాయం గ్రహించటం లేదు" అన్నాడు నందిగుప్తుడి తండ్రి.

"నాన్నా, మనకొచ్చిన ఆలోచన ప్రకారం పోవాలి గానీ, ఉపాయంలో అపాయముందని, అపాయానికి ఉపాయమనీ ఊరికే చర్చిస్తూ కూర్చొంటే పనులు జరగవు. ఈ చర్చకి క అంతుండదు. నేను చెప్పినట్లు చెయ్యి. అంతా బాగానే జరుగుతుంది" అని నందిగుప్తుడు తండ్రిని ఒప్పించాడు.

ఆర్ధరాత్రి దాటగానే వాడు తండ్రిని తీసుకెళ్ళి చెట్టుతొర్రలో కూర్చోబెట్టి వచ్చాడు. తెల్లవారగానే ధర్మాధికారులు దగ్గరకు వెళ్ళాడు. మర్రిచెట్టు సాక్ష్యం వింత చూసేందుకు ఊళ్ళో జనమంతా కూడా వాళ్ళతో పాటు ఊరి బయట మర్రిచెట్టు దగ్గర గుమిగూడారు.

ధర్మాధికారి మర్రి చెట్టును ఉద్దేశించి ప్రశ్నవేశాడు  "ఈ మిత్రుల యిక్కడ పాతిపెట్టిన ధనం ఏమయింది? ఎవరు దొంగిలించారు? నీకు తెలిస్తే నిజం చెప్పు" అని.

మర్రిచెట్టు మధ్యలోనించీ జవాబు వచ్చింది: "ఆ
ధనమంతా ఒకరోజు అర్ధరాత్రి సుదర్శనుడు ఒక్కడే వచ్చి
తీసికెళ్ళిపోయాడు" అని! వింటున్న జనమంతా నిశ్చేష్బులయిపోయారు. సుదర్శనుడికి మాత్రం యిది మోసమని తెలిసిపోయింది. "ధర్మాధికారులారా! ఇదేదో మోసం. దీన్ని నమ్మకండి. చెట్టేమిటీ, సాక్ష్యం చెప్పడమేమిటి? నాకు అనుమతిస్తే ఈ బండారం యిప్పుడే బయటపెడతాను" అన్నాడు. అందరూ చూస్తుండగా అతను చెట్టెక్కి ప్రతి కొమ్మా, తొర్రా గాలించాడు. ఒక తొర్రలో నించీ నందిగుప్తుడి ముసలి తండ్రి బయటికొచ్చాడు. అంతసేపు ఆ చెట్టు తొర్రలో కూర్చొని, కూర్చొని అతని సగం ప్రాణం పోయి వుంది. అందరి ముందు తన మోసం బయటపడగానే ఆ పరాభవం భరించలేక అక్కడే పడిపోయి ప్రాణాలు విడిచాడు. ధర్మాధికారులు సుదర్శనుడికి పాతిపెట్టిన ధనమంతా యిప్పించి, నందిగుప్తుడికి కొరతవేశారు.

అని కథ పూర్తి చేసి కరటకుడు యింకా యిలా అన్నాడు : “నాది కూడా తప్పే. నువ్వు ఈ దుర్మార్గపు మిత్రభేదం గురించి మొదట చెప్పినప్పుడే నేను నిన్ను వారించి ఉండా ల్సింది. పాపం, సంజీవకుడు మనకేం అపకారం చేశాడు? ఎందుకతనికిలా అన్యాయం చేశావు? పాపిష్ఠివాణ్ణి నేనూ అందుకు సహాయం చేసి పాపం కట్టుకొన్నాను. ఇతరులను మోసం చేసిన పాపం ఊరికే పోదు. అది మనకే తిరిగి తగులుతుంది" అంటూ ఇంద్రపాలితుడి కథ చెప్పసాగాడు.





యుద్ధం

                   యుద్ధం

దమనకుడు చెప్పిన తీతువు కథ పూర్తయింది.

సంజీవకుడు మాత్రం, "చూడు దమనకా! నువ్వు ఎంత చెప్పినా నేను నీతో వచ్చి పింగళకుడి కాళ్ళమీద పడే ప్రశ్నేలేదు. చావుకు భయపడేవాడిని కాదు. ఏదో ఓరోజు చావు. ఎవరికయినా తప్పదు. రోజూ ఎంతోమంది చస్తున్నారు. నిన్న ఉన్నవాళ్ళు యివాళ లేరు. దీనికేమిటి భయపడేది? నాకు ప్రాణం కన్నా మానం ముఖ్యం. అందుకని, నువ్వు కథలు చెప్పి నా మనసు మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. నేను వస్తున్నాననీ, యుద్ధానికి సిద్ధంగా ఉండమనీ పింగళకుడికి చెప్పు. ఇదే నా ఆఖరి మాట" అన్నాడు.

దమనకుడు బయల్దేరి తిరిగి పింగళకుడిని చేరాడు.

"రాజా, నువ్వు చెప్పినట్టే నేను సంజీవకుడి దగ్గిరికి వెళ్ళాను. నేను చెప్పాను. అతను పొగరుగా నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. అవన్నీ నేను చెప్పనూకూడదు, మీరు విననూ కూడదు. ఎంత నచ్చచెప్పినా అతను వినలేదు. 'తను పట్టిన కుందేలుకు మూడుకాళ్ళే' అన్నట్లు మొండికెత్తాడు. నేను యుద్ధానికి వస్తున్నాను. మీరాజును సిద్ధంగా ఉండమని చెప్పమని చెప్పాడు. నేనెంత ప్రయత్నం చేసినా అతని మనసు మార్చలేకపోయాను. ఇంక మీరేం చేస్తారో అది మీ నిర్ణయం" అన్నాడు.

సంజీవకుడికీ, పింగళకుడికీ భయంకరమయిన యుద్ధం మొదలయింది. ఎద్దు తన కొమ్ములతో కుమ్మితే సింహం సొమ్మసిల్లిపడిపోతున్నది. తేరుకొని, సింహం ఎద్దుమీదికి ఎగిరి తంతే, ఎద్దు పడిపోతున్నది.

యుద్ధం జరుగుతుండగా కరటక, దమనకులు పక్కన నిలబడి వింత చూస్తున్నారు. దమనకుడు కరటకుడితో "చూశావా, నా తడాఖా!" అన్నాడు.

అకారణంగా యిలా యుద్ధం జరగడం కరటకుడికి నచ్చలేదు. "దమనకా! నిన్ను నమ్మినందుకు రాజు యిప్పుడు ఫలం అనుభవిస్తున్నాడు. ముందు నువ్వే తగుదునమ్మా అని వీళ్ళిద్దరికీ స్నేహం కలిపావు. తరువాత నువ్వే వాళ్ళ మధ్య విరోధం పుట్టించావు. నువ్వు దూరం ఆలోచించట్లేదు. ఈ పోరు మంచిది కాదు. చేతయితే యిలాంటి పోట్లాటలు మాన్పించాలి గాని పుట్టించకూడదు. నువ్వు రాజుకు నిజంగా సేవ చేయాలనుకొంటే రాజుకేది హితమో అది చెప్పాలి. అదే నీకూ మంచిది. మంచివాడికి కీడు తలపెట్టడం, చెడ్డవాడికి సహాయం చేయడం, చివరికి నిన్నే నాశనం చేస్తయ్. తెలిసి తెలియకుండా రాజుకు చెడు సలహాలు ఇవ్వకూడదు" అన్నాడు.

“అయినా నీలాంటి వాడికి బుద్ధి చెప్పబోవడం కూడా అనవసరం. వెనకటికి కొన్ని తెలివితక్కువ కోతులు మిణుగురు పురుగుల గుంపు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నామని సంతోషిస్తుంటే, దోవన పోయే పక్షి “ఇదేం పిచ్చి, చలి కాచుకోవడానికి అది నిప్పుకాదు, మిణుగురు పురుగుల దండు!" అన్నదట. “మేమేం చేయాలో మాకు తెలుసు, చెప్పేందుకు నువ్వెవర”ని ఆ కోతులు ఆ పిట్ట మీద పడి దాన్ని చంపేశాయట. లోకంలో మనకు మంచిమాటలు చెప్పే సజ్జనులు చాలా తక్కువగా ఉంటారు. మంచిమాట వినేవాళ్ళు మరీ తక్కువ. ఏదేమయినా, తన మేలు కోసం యితరులు కీడు తలపెట్టేవాడు బాగుపడడు. దానికి నందిగుప్తుడి కథే నిదర్శనం” అంటూ కరటకుడు దమనకుడికి ఆ కథ చెప్పడం ఆరంభించాడు.

మూడు చేపల కథ

           మూడు చేపల కథ



ఒక చెరువులో మూడు చేపలున్నాయి. ఓ సంవత్సరం కరువు వచ్చే సూచనలు కనిపించాయి. వానలు లేక చెరువు ఎండిపోయే ప్రమాదమే వస్తే చెరువుల్లో బతికే చేపలకూ, యితర జంతువులకూ ఎప్పుడూ జీవన్మరణ సమస్యే. ఏం చేయాలి?

మొదటి చేపకు జాగ్రత్త ఎక్కువ. దానిపేరే 'అనాగత విధాత'. అది మిగిలిన రెండు చేపలతో "ఈ ఏడు ఈ చెరువు ఎండిపోవటం ఖాయం. ఇక్కడికి దగ్గర్లో మరో పెద్ద చెరువుంది. ఈ చెరువునించీ ఆ చెరువుకు ఈదుకు వెళ్ళేందుకు సన్నకాలవ కూడా ఉంది. మనం ఇప్పుడే జాగ్రత్తపడి అక్కడికి వెళ్ళిపోదాం!” అంది.

రెండో చేపకు కొంచెం బద్ధకం. దానిపేరు ప్రత్యుత్పన్న మతి. “దీనికిప్పుడే యింత కంగారెందుకు? ఇంకా కొన్నాళ్ళు చూద్దాం. అవసరమయితే అప్పుడాలోచించవచ్చు. ఇప్పటినించే బుర్ర చెడగొట్టుకోవడ మెందుకు?” అంది.

మూడో చేప పేరు యద్భవిష్యం. “ఎలా జరగవలసింది అలా జరుగుతుంది, మనం ఆపగలమా? దేవుడే చూసుకుంటాడు!" అని దాని భరోసా.

వీళ్ళతో పెట్టుకోకుండా, మొదటి చేప తన దోవన తను పెద్ద చెరువుకు వెళ్ళిపోయింది.

నీళ్ళు కొన్నాళ్ళ తరువాత ప్రమాదం రానే వచ్చింది. చెరువులో బాగా తగ్గిపోయాయి. పెద్దచెరువుకు వెళ్ళే కాలవ మార్గం ఎండిపోయింది. జాలరులు వచ్చి వలలూ, బుట్టలూ తెచ్చి చెరువులో ఉన్న చేపలన్నింటినీ పట్టేశారు. వలలో పడ్డ యద్భవిష్యం ప్రమాదం తెలుసుకోకుండా, ఏ ఉపాయం | లేకుండా వలలోనించీ మళ్ళీ నీళ్ళలోకి దూకాలనే ప్రయత్నం చేస్తుండగా జాలరులు దాన్ని కర్రతో కొట్టి చంపేశారు.

రెండోచేప ప్రమాదం వచ్చిందని తెలుసుకొని, చచ్చినదానిలా పడి ఉంది. దాన్ని పట్టుకొన్న జాలరి దాన్ని ఒడ్డుకు విసిరాడు. మిగిలిన చేపలన్నింటినీ కూడా పట్టుకొన్న తర్వాత వాడు గట్టుకుచేరి దాన్ని తీసుకొనే లోపల ఎలాగోలా రెండోచేప చచ్చీ చెడి గట్టు మీదనుంచీ నీళ్ళలోకి దొర్లి, ప్రాణం దక్కించుకొంది.

“అందుచేత దైవం, దైవం అని నిర్లిప్తంగా కూర్చొంటే చెడిపోతాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి" అన్నది.

 ఆడతీతువు తన భర్తతో. “నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మనకే ప్రమాదమూ జరగదు, చూస్తూ వుండు" అన్నది మగతీతువు.

కొన్నాళ్ళకి ఆడతీతువు గుడ్లు పెట్టింది. ఆమె భయపడ్డట్టే, ఒక పర్వదినం నాడు సముద్రం పొంగి, దాని అలల తాకిడికి చెట్టుకొమ్మల్లో ఉన్న తీతువుపిట్టల గూడు పడిపోయి, అందులో గుడ్లన్నీ కొట్టుకుపోయాయి.

ఆడతీతువుకు, సహజంగానే, పట్టరానంత దుఃఖం వచ్చింది. “చూశావా, నేను చెప్తున్నా నువ్వు పట్టించుకోలేదు. యిప్పుడేం చేయాలో చెప్పు” అంటూ వలవలా ఏడ్చింది. భర్త దాన్ని ఊరడించాడు.

ఆ ప్రాంతంలో ఉన్న యితర పక్షులన్నిటినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేశాడు. 'సోదరులారా, చూశారా ఈ సముద్రం నిష్కారణంగా నాకు ఎంత ఘోరమయిన అన్యాయం చేసిందో? ఈ సముద్రాన్నంతా ఒక్క గుక్కలో పీల్చి పారెయ్యగల గరుత్మంతుడు  మనకు అండగా ఉన్నాడని, సముద్రం మర్చిపోయింది. ఈ సముద్రుడి పొగరు అణచాలంటే మనమందరం కలిసి పనిచేయాలి. లేకపోతే ఈరోజు నాకొచ్చిన కష్టం రేపు మీలో ఎవరికయినా రావచ్చు. అందువల్ల మనందరం కలిసి గరుత్మంతుణ్ణి ప్రార్థిద్దాం. ఆయనే నా కష్టాన్ని తొలగిస్తాడు" అని ఆ పక్షులన్నింటినీ ఒప్పించాడు.

పక్షులన్నీ కలిసి చేసిన తపస్సుకు సంతోషించి గరుత్మంతుడు ప్రత్యక్షమై "మీకేం కావాలో చెప్పండి!" అని అడిగాడు. పక్షులు సముద్రం చేసిన ఘోరాన్ని గరుత్మంతుడికి చెప్పాయి. గరుత్మంతుడు కోపంతో ఊగిపోయాడు. గరుత్మంతుడి బలమంటే సముద్రానికీ భయమే. గరుత్మంతుడు ఆజ్ఞ యివ్వగానే సముద్రుడు తీతువు పిట్టల గుడ్లు తిరిగి తెచ్చి అప్పజెప్పాడు. “ఈసారికి క్షమిస్తున్నాను. మళ్ళీ ఈ పిట్టలకేదయినా యిబ్బంది కలిగించావో, నీ భరతం పడతాను, జాగ్రత్త!” అని సముద్రాన్ని హెచ్చరించి గరుత్మంతుడు మాయమయ్యాడు.


తీతువుపిట్ట - సముద్రము

      తీతువుపిట్ట - సముద్రము

ఒక సముద్రం ఒడ్డున ఒక చెట్టు ఉంది. దానిమీద తీతువుపిట్టల జంట ఒకటి కాపురం ఉండేది. కొంతకాలానికి అడ తీతువు గర్భం ధరించింది. మగతీతువు "నీకేం కావాలో చెప్పు. నా శక్తంతా ఉపయోగించి నీకది తెచ్చి యిస్తాను". అంది. ఆడతీతువు, "నాకేమీ అక్కర్లేదు కానీ, పర్వదినాల్లో ఈ సముద్రం పొంగి అలలు మన చెట్టు కొమ్మలను తాకి తడిపేస్తున్నాయ్. రేప్పొద్దున నేను పెట్టబోయే గుడ్లు ఆ అలలతాకిడికి కొట్టుకు పోతాయేమోనని నాకు భయంగా ఉంది. అందువల్ల వీలయినంత త్వరగా మనం మరో చోటికి వెళ్ళటం మంచిది" అంది.

మగతీతువుకు ఆమె భయం చూసి నవ్వు వచ్చింది. "పిచ్చిదానా, పక్షులన్నిటికీ గరుత్మంతుడు రక్ష. ఆయనంటే నముద్రానికీ భయమే. కంగారుపడుతున్నావు” అన్నాడు. ఇది తెలియక నువ్వు

ఆడతీతువుకు ఈ ధోరణి నచ్చలేదు. "ఏదో ఆపద రాబోతుందంటే, తెలివయినవాడు, ఎంత బలవంతుడయినా దాన్నించీ తప్పించుకొనేందుకు ప్రయత్నం చేసుకోవాలి గానీ, నేనేదో బలవంతుణ్ణనుకొని గర్వంతో విర్రవీగి కూర్చొంటే వాడికే నష్టం. మనలాంటి బలహీనుల సంగతి చెప్పనే అక్కర్లేదు కదా? మంచిమాటలు వినని మూర్ఖుడు హంస-తాబేలు కథలో తాబేలు లాగా నాశనం పొందుతాడు" అంటూ ఆ కథ చెప్పింది.

భువనసారం అని పేరు గల ఒకానొక చెరువుండేది. అది చాలా అందమయిన పెద్దచెరువు. అందులో వికట, సంకటాలని రెండు హంసలూ, కంబుగ్రీవమనే ఓ తాబేలూ చాలా స్నేహంగా తిరుగుతూ ఉండేవి. ఒక సంవత్సరం వానలు పడక చెరువు బొత్తిగా ఎండిపోసాగింది. హంసలు రెండూ ఆ చెరువు విడిచి మరో పెద్ద చెరువుకు పోక తప్పదని నిశ్చయించుకొని, ఒకరోజు ఆ మాటే తాబేలుకు చెప్పాయి. అన్నాళ్ళ స్నేహం తరువాత తాబేలుని విడిచివెళ్ళాలంటే వాటికి ఎంతో దుఃఖం కలిగింది. తాబేలుకూ అంతే.

"మనం యిన్నాళ్ళూ సొంత అన్నదమ్ముల లాగ బతికాం. ఇప్పుడు మిమ్మల్నిలా విడిచిపెట్టాలంటే నా కెంతో బాధగా ఉంది. పోనీ మీతో వద్దామంటే, మీలా చకచకా ఎగిరి వెళ్ళేందుకు నాకు రెక్కలు లేవు. వేగంగా నడవను కూడా లేను. ఏదో ఒక ఉపాయం ఆలోచించి నన్ను కూడా మీతో తీసుకెళ్ళ గూడదూ?" అంది తాబేలు.

"అలాగే ఉంది కానీ ఏం చేస్తాం? నిన్ను వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళటానికి వీలుపడదు, చాలా దూరం వెళ్ళాలి కదా? పోనీ ముక్కున కరుచుకొని వెళ్తామంటే అదీ సాధ్యం కాదు. ఏదో సాహసం చేయబోయామంటే, తోవలో నువ్వు జారిపడిపోతే మొదటికే మోసం. ఎలాగోలా గుండెరాయి చేసుకుని బతికేయటం తప్పా మార్గం కనబడదు. నీకిక్కడ వచ్చిన ప్రమాదం లేదు. ఇక్కడే ఉండిపో, అదృష్టం బాగుంటే మళ్ళీ కలుద్దాం" అన్నాయి హంసలు.

కానీ కంబుగ్రీవం మొండిఘటం. ఎంత చెప్పినా ఊరుకోదు. ఎలాగోలా, ఎంత ప్రమాదకరమయినా సరే, నన్ను మీతో తీసుకెళ్ళండి అని పట్టుబట్టింది.

"నువ్వు మరీ అలా పట్టుబడితే, ఒక ఉపాయం ఉంది. కానీ అది చాలా ప్రమాదంతో కూడింది. ఒక కర్ర సంపాదించి దాన్ని చెరో చివరా మేమిద్దరం ముక్కుతో కరచిపట్టుకొంటాం. నువ్వు నీ నోటితో ఆ కర్రనే మధ్యలో గట్టిగా కరిచిపట్టుకో. కర్రతో సహా ఎగిరిపోదాం. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నోరు తెరచినా, పట్టు వదిలిపోయి దబ్బున కిందపడిపోతే ప్రాణాలు దక్కవు!” అన్నాయి హంసలు.

అదే ఉపాయం ప్రకారం హంసలు తాబేలుతో సహా
ఆకాశంలోకి ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. కానీ అవి
ఒక నగరం మీదిగా ఎగురుతుండగా, ఆ నగరంలో జనమంతా
ఈ వింత చూసి “ఏమిటిది, ఏమిటిది! హంసలు రెండు ఒక
కర్రను పట్టుకొని ఎగరడమేమిటి, ఆ కర్రని కరుచుకొని తాబేలు ఎగరడమేమిటి?" అని గుంపులుగా గుమిగూడి నగరవీధుల్లో ఆశ్చర్యంలో గోలగోలగా పరుగెట్టసాగారు.

ఆ కలకలం విన్న తాబేలు తన జాగ్రత్త మరిచిపోయి "ఏమిటీ కలకలం ?” అని అడగబోయి నోరు తెరిచింది. ఏమవుతుంది? దభీమని ఆకాశంలో అంతెత్తునించీ కిందపడిపోయింది. కొన ఊపిరితో మిగిలిన దాన్ని, నగరజనులు బతకనిస్తారా? మాంసం తీసుకెళ్ళిపోయారు!

“ఇంతకీ ఈ కథ ఎందుకు చెప్పానంటే అపాయం రాబోతున్నప్పుడు, ఏదో చేసేద్దాంలే, దేవుడున్నాడు గదా, గరుత్మంతుడున్నాడు కదా అంటూ సరయిన ఉపాయం లేకుండా కూర్చొంటే, కష్టం గట్టెక్కలేము. ఇది మనం తెలుసుకోవాలి” అంది ఆడతీతువు.

ఇదే నీతి చెప్పేందుకు ఆడతీతువు మరో కథ కూడా
చెప్పింది.


వడ్రంగి - సింహం

             వడ్రంగి - సింహం

ఓ ఊళ్ళో ఓ వడ్రంగి ఉండేవాడు. వాడు రోజూ అడవికి వెళ్ళి తన పనికి ఉపయోగించే చెట్లు నరికి, ఆ  మొద్దులతో రకరకాల సామాన్లు తయారుచేసి అమ్ముకొని పొట్టు పోసుకొనేవాడు.

ఒకరోజు అతను అడవిలో తిరుగుతుండగా ఒక సింహం  ఎదురొచ్చింది. భయంతో వణుకుతూ నిల్చుండిపోయాడు. సింహానికి అతని భయం చూసి జాలివేసింది. "భయపడబోకు. నేను ఏనుగు కుంభస్థలాల మీదికి ఎగిరి వాటిని చంపుతాను. కానీ, నీలాంటి బలహీనుల్ని చంపటంలో నాకు మజా లేదు. నీ దోవన నువ్వు వెళ్ళిపో" అంది.

ఆ వడ్రంగి 'బతుకుజీవుడా' అనుకొని ఆ సింహానికి సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోయాడు. ఆ కృతజ్ఞతతో వడ్రంగి అడవికి వచ్చేప్పుడల్లా ఆ సింహం కోసం ఆహారం తెచ్చి యిస్తూండేవాడు.

ఇలా జరుగుతుండగా, ఒకరోజు ఆ సింహానికి సేవకులయిన కాకీ-నక్కా సింహంతో ముచ్చట్లాడుతూ “రాజా! ఈ మధ్య మీరు ఎక్కువగా వేటకు వెళుతున్నట్టు లేదు కారణమేమిటి?" అని అడిగాయి.

“అదో కథ. నాకో భక్తుడున్నాడు. వాడు నాకు ఆహారం తెచ్చిపెడుతూ ఉంటాడు" అంది సింహం.

“అంత మంచి భక్తుడెవరో ఓసారి మాకు చూపించగూడదా?” అన్నాయి కాకీ - నక్కా,

"అదెంత భాగ్యం. రండి, వెళదాం. కొంచెంసేపట్లో అతను రానే వస్తాడు. మీరే చూద్దురు గానీ” అంది సింహం.

రోజులాగే వడ్రంగి వచ్చాడు. సింహం కోసం ఆహారం కూడా తెచ్చాడు. కానీ సింహాన్ని, దాని పక్కనే ఉన్న కాకి నక్కలనూ చూడగానే కంగారుగా దగ్గర్లో ఉన్న చెట్టేక్కేశాడు. సింహానికి ఆశ్చర్యం వేసింది.

"ఇదేమిటి? క్రూరజంతువుని, నన్ను చూసి భయపడని

వాడివి, ఈరోజూ ఈ కాకీ - నక్కలను చూసి అంత

భయపడతావేం?" అంది సింహం.

“నీవల్ల నాకు ఏ హానీ జరగదని నాకు తెలుసు. కానీ నీ అనుచరులు కాకీ - నక్కా నీ పక్కనుంటే నీకేదో దుర్భోధ చేయకమానరు. రాజు మంచివాడయినా, అతని దగ్గిర ఉండే సహచరులు అతణ్ణి దుష్టుడిగా మార్చి పారేస్తారు. అదీ నా భయం!” అన్నాడు వడ్రంగి.

కాబట్టి, నేననేదేంటంటే, పింగళకుడికి సహజంగా నామీద ఎంత మంచి అభిప్రాయం ఉన్నా అతని సహచరులు ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి అతని మనసు విరిచేశారు. నామీద కోపం కలిగేట్టు చేశారు. ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? ఊరికే మరణించేకంటే, అతనితో యుద్ధం చేసే మరణిస్తాను స్వర్గం దక్కుతుంది” అన్నాడు సంజీవకుడు.

“నువ్వు చెప్పే బీరాలూ, వేదాంతం బాగానే ఉన్నాయి. కానీ, ఉపాయం ఉపయోగించి అపాయం లోంచి బయటపడే అవకాశం వెతుక్కోకుండా బలవంతుడయిన శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకోడం ఏం ధర్మం? యుద్ధం చేయదలచుకొంటే తన బలం, శత్రువు బలం సరిగా బేరీజు వేసుకొని, గెలవటం ఖాయమంటేనే యుద్ధానికి దిగాలి. లేకపోతే తీతువుపిట్టా-సముద్రం కథలాగా అవుతుంది” అని దమనకుడు ఆ కథ చెప్పాడు.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...