సీతాదేవి అనుమతి

                               సీతాదేవి అనుమతి 

రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ్మ అంటూ విసిగిస్తున్నాడు. నాయనమ్మ  సరే అంది కానీ ఇది కథ కాదు కల.చింటూ కలా అన్నాడు.నాయనమ్మ మరి మొదలు పెడదామా అంటూ కథలోకి 


             

"రామాయణంలో రావణుడు సీతాదేవిని తీసుకెళ్ళేటపుడు ఆమె తన నగలు అన్ని ఒక మూటలో పెట్టి విసిరింది.ఆ మూట హనుమకు దొరికింది కానీ అందులో నుండి ఒక ఉంగరం నీళ్లలో పడింది.ఆ ఉంగరాన్ని చేప ఆహారం అనుకోని తినేసింది.చాలా రోజులు గడిచాయి.ఒక రోజు జాలరి చేపలు పట్టడానికి వచ్చి ఆ చేపని పట్టుకుని వెళ్ళాడు.ఇంటికి వెళ్లి కోసి చూస్తే అందులో ఉంగరం ఉంది.ఆ ఉంగరం తను భార్యకి ఇచ్చి పెట్టుకోమన్నాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే తన దరిద్రం అంత పోయి పెద్ద ధనవంతుడు అయిపోయాడు. ఈ విషయం ఆ ఉంగరం తన చేతికి ఉన్నందుకే అని గ్రహించిన భార్య భర్తతో ఇది మాములు ఉంగరం కాదని ఏదో మహిమ గలది అని చెప్పింది.ఆ రోజు నుండి ఆ ఉంగరం చేతికి పెట్టుకోవడం మానేసి పూజించడం మొదలు పెట్టారు. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి సీతారాములు వాళ్ళ వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకి వచ్చి రాజ్యపాలన చేస్తున్నారు.మళ్ళీ ఇంతలో సీతాదేవి గర్భవతి అవ్వడం అన్ని చక చక జరిగిపోయాయి.ఇటు వైపు జాలరి తన వృతి మానకుండా రోజు చేపల వేటకు వెళ్తూ ఉన్నాడు.కొద్ది రోజుల్లోనే పెద్ద విషాదం అలుముకుంది.సీతాదేవిని రజకుడు ఏదో అనడం రాముడి చెవిన పడటం మళ్ళీ సీతదేవీ అడవికి వెళ్ళటం జరిగిపోయాయి.ఇటు జాలరి తన ఇంటినీ శుభ్రం చేద్దామని అన్ని వస్తువులు బయటకు తీసుకుని వెళ్ళి ఆక్కడ ఉంచి మిగతా వస్తువులు తీసుకొని వస్తున్నప్పుడు గమనించక ఆ ఉంగరాన్ని కూడా బయట పెట్టాడు. అప్పుడు ఒక పక్షి మిలా మిలా మెరుస్తూ ఉన్న ఆ ఉంగరాన్ని ఆహారం అనుకోని తీసుకొని వెళ్ళింది.అటు రాముడు ఆశ్వమేధా యాగం జరిపించాలని అనుకున్నాడు.రాజ్య ప్రజలు వారికి తోచిన బంగారం తీసుకుని వెళ్ళి రామునికి సమర్పించడం జరిగే సమయంలో ఒక ఇంట్లోని ముసలావిడ బాధతో తన దగ్గర రామునికి ఇవ్వడానికి ఏమి లేదని విచారిస్తోంది.తన మనవరాలు నీళ్ళకోసం వెళ్ళి కుండ నెత్తిన పెట్టుకోని వస్తూ ఉంది.ఉంగరం నోటితో కరచుకొని ఆ పక్షి కూడా ఆటు వైపే వెళ్ళింది.ఇంతలో నోటిలోని ఉంగరం కాస్త జారి ఆ కుండలో పడింది. ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ మనవరాలు నీళ్లలో ఏదో మెరుస్తూ ఉంది అని అవ్వకు చూడమని చెప్పింది.ఆ ఉంగరాన్ని చూసిన అవ్వకి నోట్లోంచి మాట రాక మూగబోయింది.తరువాత ఆ అవ్వ ఇది రాముని యాగంలోకి ఇవ్వడానికి ఆ పరమేశుడు నాకు ఇచ్చాడు అన్నది.వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకుని రాముని దగ్గరకు వెళ్ళి ఇచ్చింది.ఆ ఉంగరాన్ని చూసి రాముడు ఇది నీకు ఎక్కడిది అని అడిగాడు.నాకు మా నీళ్ళ కుండలో దొరికింది అని అవ్వ చెప్పింది.రాముడు అప్పుడు ఆ ఉంగరాన్ని చూస్తూ ఈ యాగానికి సీతను లేకుండా చేస్తున్న అన్న బాధ ఇప్పుడు లేదు ఎందుకంటే సీతే తన ఉంగరం అనుమతిగా పంపించింది. ఈ ఉంగరం మన సీతాదేవిదే అని కౌసల్య మాతతో అన్నాడు."

ఆ కథ వింటున్న చింటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు....

శంఖచూడుడి వధ

          శంఖచూడుడి వధ 

శంఖచూడుడు యక్షుడు. కుబేరుడి అనుచరుడు, గదాయుద్దంలో ఆరితేరినవాడు. ఈ భూమండలంలో తనవంటి బలశాలి, గదాయుద్ధంలో తనను ఓడించగల పరాక్రమవంతుడు లేడంటూ విర్రవీగేవాడు.

ఒకనాడు నారద మహర్షి శంఖచూడుని వద్దకు వచ్చాడు. నారదునికి శంఖచూడుడు స్వాగత సత్కారాలు చేశాడు. కలహభోజనుడైన నారదుడు కంసుడి పరాక్రమాన్ని పొగుడుతూ శంఖచూడుణ్ణి రెచ్చగొట్టాడు.

'కంసుడు నన్ను మించిన పరాక్రమవంతుడా?" ఉక్రోషంగా అడిగాడు శంఖచూడుడు.

'అది నేనెలా చెప్పగలను? నువ్వే తేలుకోవాలి' బదులిచ్చాడు నారదుడు.

నారదుడి మాటలకు రెచ్చిపోయిన శంఖచూడుడు వేలాది గదాయుధాలతో మధురా నగరం చేరుకున్నాడు. రాజసభకు వెళ్లాడు. కంసుడికి అభివాదం చేసి, 'రాజా! సువ్వు త్రిభువన విజయుడవని విన్నాను. నీతో గదాయుద్ధం చేయాలని నా కోరిక, నువ్వు గెలిస్తే, నీకు దాసుడిగా ఉంటాను. నేను గెలిస్తే నువ్వు నా దాసుడివి కావాలి' అన్నాడు.

శంఖచూడుని ఉబలాటం చూసి, 'సరే'నంటూ పెద్ద గద తీసుకుని, యుద్ధానికి సిద్ధపడ్డాడు కంసుడు. ఇద్దరూ గదలతో గోదాలోకి దిగి పోరాడసాగారు. ఒక గద పగిలిపోతే మరో గద తీసుకుని పోరాదారు. వారి వద్ద ఉన్న గదలన్నీ తునాతునకలై

పోయాక, చివరకు ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. అదే సమయానికి గర్గ మహర్షి అక్కడకు చేరుకున్నాడు.

'కంసా! ఇక యుద్ధం చేయకు. ఈ శంఖ చూదుడు నీతో సమానమైన బలసంపన్నుడు.. నిన్ను చంపబోయే పరమాత్ముడు ఇతడిని కూడా హతమారుస్తాడు. ఇక నుంచి ఈ యక్షుడితో అభిమానంగా ఉండు' అని చెప్పాడు.

'శంఖచూడా! నువ్వు కూడా ఇకపై కంసుడితో మైత్రితో మెలగుతూ ఉండు' అని సూచించాడు.

గర్గుని మాటలతో ఇద్దరూ యుద్ధం విరమించుకున్నారు. సవినయంగా గద్ద. మహర్షికి నమస్కరించారు. ఆయన ఆశీస్సులు పొంది, పరస్పరం అలింగనం చేసుకున్నారు. శంఖచూడుడు కొన్నాళ్లు కంసుడి వద్ద ఉండి, అతడి ఆతిథ్యం స్వీకరించాడు.

ఒకనాడు శంఖచూడుడు కంసుడి వద్ద సెలవు తీసుకుని ఆకాశమార్గాన తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో బృందావనం కనిపించింది.

బృందావనంలో గోపకాంతల మధ్య రాధామాధవులు కనిపించారు. కృష్ణుడు తన మోచేతిని రాధ భుజంపై ఉంచి, మురళి వాయిస్తుండగా, రాధ తన్మయత్వంతో ఆలకిస్తోంది. గోపకాంతలు ఆనంద పరవశులై నాట్యమాడుతున్నారు.

కృష్ణుడిని సామాన్య బాలకుడిలాగానే తలచాడు శంఖచూడుడు. ఒక సామాన్య బాలుడి చుట్టూ అందగత్తెలైన అంతమంది. గోపికలు నాట్యం చేస్తుండటం చూసి అతడికి మతిపోయింది.

ఈ బాలకుడేంటి, ఇతగాడి గొప్పేంటి. ఇంతమంది అందగత్తెలూ ఇతడి చుట్టూనే చేరి ఎందుకు ఆడుతున్నారు, ఇతడికి ప్రత్యేకతేంటి? ఇతడి సంగతేదో చూడాల్సిందే అనుకున్నాడు.

వెంటనే బృందావనంలో దిగాడు. నల్లని దేహం, ఎర్రని కళ్లతో నేల దద్దరిల్లేలా అడుగులు వేస్తూ వస్తున్న భీకరాకారాన్ని చూసి గోపికలు భీతిల్లిపోయారు. అప్పటి వరకు నృత్యగానాలతో ఆహ్లాదభరితంగా గడిపిన రాసమండలమంతా గోపికల ఆర్తనాదాలతో, హాహాకారాలతో హోరెత్తిపోయింది.

అందగత్తెలయిన గోపికలందరినీ ఒకేసారి చూసేసరికి శంఖచూడుడికి మతిచలించింది. గోపికల వైపు ముందుకు రాసాగాడు. భయంతో గోపికలు పరుగులు తీశారు. శతచంద్రానన అనే గోపిక శంఖచూడుడి చేతికి చిక్కింది. అతడు ఆమెను పట్టుకుని, ఉత్తరదిశ వైపు శరవేగంగా వెళ్లసాగాడు.

భయకంపితురాలైన శతచంద్రానన 'కృష్ణా! కృష్ణా!' అంటూ రక్షణ కోసం కేకలు వేయసాగింది. గోపికల కలకలానికి కృష్ణుడు లేచి వచ్చాడు. శతచంద్రానన కేకలు విన్నాడు. అటువైపుగా పరుగున ముందుకు సాగాడు. భీకరాకారుడైన శంఖచూడుడు శతచంద్రానను ఎత్తుకుపోతుండటాన్ని గమనించాడు. 'నిలువురా మాయావి! నిలువు. అబలను విడిచిపెట్టు' అంటూ హెచ్చరించాడు. అతడు నిలవకుండా, ముందుకు పరుగున పోతుండటంతో, కృష్ణుడు దగ్గరే ఉన్న సాలవృక్షాన్ని పెకలించి, అతణ్ణి వెంబడించసాగాడు.

సాలవృక్షంతో తరుముకొస్తున్న కృష్ణుణ్ణి చూసి, శంఖచూడుడు భయపడ్డాడు. ఎత్తుకుపోతున్న గోపికను అక్కడికక్కడే విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా పరుగు తీశాడు. అయినా కృష్ణుడు అతణ్ణి విడిచి పెట్టలేదు. యోజనాల కొద్ది దూరం తరుముకుంటూ వెళ్లాడు. చివరకు హిమాలయ సానువుల చెంత అతణ్ణి అడ్డగించాడు. ఇక తప్పించుకుపోవడానికి ఎటూ మార్గం

కనిపించక, తప్పనిసరిగా కృష్ణుడితో యుద్ధానికి దిగాడు శంఖచూడుడు. ఇద్దరూ ఒకరిపై మరొకరు చెట్లతో దాడి చేసుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. చివరకు ముష్టియుద్ధానికి దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఒకళ్లనొకళ్లు నేల మీదకు నెట్టుకుని కలబడ్డారు. కృష్ణుడు ఒడుపుగా శంఖచూడుడి మెడ దొరకబుచ్చు కున్నాడు. అతడి నెత్తి మీద, మెడ మీద పిడిగుద్దులు కురిపించి, మెడ నుంచి తలను వేరుచేశాడు. అతడి తలలో ఉన్న చూడామణిని పెకలించి తీశాడు. శంఖచూడుడి నుంచి ఒక దివ్యతేజస్సు వచ్చి, కృష్ణుడి మిత్రుడైన శ్రీదాముడిలో చేరింది. శ్రీదాముడి అంశే కాలవశాన యక్షుడిగా జన్మించి, శ్రీకృష్ణుడి వల్ల

తిరిగి శ్రీదాముడిలోనే విలీనమైంది.

శల్యుని ఆతిథ్యం

            శల్యుని ఆతిథ్యం 


మాయద్యూతంలో ఓడిపోయిన పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకున్నాక, కౌరవ పాండవుల మధ్య సయోధ్య కోసం జరిపిన శ్రీకృష్ణ రాయబారం విఫలమైంది. పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వనని దుర్యోధనుడు మొండికేయడంతో యుద్ధం అనివార్యమైంది. రణానికి ముందు సైనిక సమీకరణల కోసం కౌరవ పాండవులు ఎవరి ప్రయత్నాలను వారు ప్రారంభించారు. కృష్ణుడు ఒంటరిగా పాండవుల పక్షాన నిలుస్తానన్నాడు. బలరాముడు ఏ వక్షానా చేరబోనంటూ తీర్ధయాత్రలకు సిద్ధమయ్యాడు. కృతవర్మ తదితర యదువీరులంతా కౌరవుల పక్షాన చేరాడు.


నకుల సహదేవుల మేనమామ అయిన మద్ర సరేంద్రుడిని తమ పక్షాన యుద్ధంలో పాల్గొనాల్సిందిగా ఉపప్లావ్యంలో విడిది చేసిన ధర్మరాజు ఆహ్వానం పంపాడు. ధర్మరాజు నుంచి కబురు అందగానే శల్యుడు తన బలగాలతో ఉపప్లావ్యానికి బయలుదేరాడు. అమిత బలాఢ్యుడైన శల్యుడిని తమవైపు తిప్పుకుంటే యుద్ధంలో తేలికగా విజయం


సాధించవచ్చని, ముఖస్తుతికి ప్రీతిచెందే శల్యుడిని మర్యాదలతో లొంగదీసుకోవాలని దుర్యోధనుడికి శకుని సలహా ఇచ్చాడు. కల్యుడు. మద్రదేశం నుంచి ఉపషావ్యం వైపు బయలుదేరినట్లు వేగుల ద్వారా వర్తమానం తెలుసుకున్న దుర్యోధనుడు ఆ దారి పొడవునా తన బలగాలను, సేవకులను రంగంలోకి దించాడు. దుర్గమమైన ఆటవీ మార్గంలో శల్యుడు, అతడి పరివారం డేరాలు వేసుకుని బస చేసిన చోటల్లా దుర్యోధనుడి భృత్యులు వెళ్లి, వారికి ఏ లోటూ లేకుండా అతిథి మర్యాదలు చేశారు. కందమూలాదులు తప్ప దొరకని అడవిలో శల్యుడికి, అతడి పరివారానికి ఘుమఘుమలాడే వంటకాలతో భోజనానికి లోటు లేకపోయింది. దుర్యోధనుడి సిబ్బంది శల్యుడి ఇష్టాయిష్టాలను కనుక్కొని మరీ మర్యాదలు చేయడంతో శ్రమదమాదులు తప్పవసుకున్న ఉపప్లావ్య యాత్ర శల్యుడికి,అతడి పరివారానికి వినోదయాత్రలా మారింది.


ఆడుగడుగునా షడ్రసోపేతమైన విందుభోజనాలతో దొరుకుతున్న మర్యాదలన్నీ ధర్మరాజు భృత్యులే తనకు చేస్తున్నారని తలచాడు శల్యుడు. మనసుకు సంతోషు కలిగేలా అతిథి సత్కారాలకు ఏర్పాట్లు చేస్తున్న ధర్మజుడి అమాత్యులెవరో కనుక్కొని తన. వద్దకు తీసుకొస్తే, వారికి స్వయంగా కృతజ్ఙతలు చెబుతానని, వారెవరో కనుక్కొని తన ముందుకు తీసుకు రమ్మని తన భృత్యులను ఆజ్ఞాపించాడు.


శల్యుడి ఆజ్ఞ మేరకు అతడి భృత్యులు వెదుకులాటలో పడ్డారు. ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారో నెమ్మదిగా ఆరా తీశారు. సమాచారం తెలిసిన వెంటనే వచ్చి, శల్యుడి ఎదుట వాలారు.


'మద్ర మహారాజా! తమరి రాక తెలుసుకుని సుయోధన సార్వభౌములు ఈ దుర్గమ అరణ్యమార్గాన్ని తమరి ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దారు. తమకు మార్గాయాసం కలగకుండా అడుగడుగునా ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సుయోధన సార్వభౌముల వారి ఆజ్ఞ మేరకు ఆయన అమాత్యుల పర్యవేక్షణలో తమరి మర్యాదకు లోటు లేకుండా చూసుకున్నారు' అని చెప్పారు భృత్యులు.


భృత్యులు చెప్పిన సమాచారంతో శల్యుడు ఆశ్చర్యచకితుడయ్యాడు.


ఆనందభరితుడయ్యాడు. తన పట్ల ఇంతటి ఆదరణ, మన్నన కనబరచిన దుర్యోధనుడిపై శల్యుడికి అభిమానం ఉప్పొంగింది.


తనకు మర్యాదలు చేసినదెవరో శల్యుడు ఆరా తీస్తున్న సంగతి తెలిసి, దుర్యోధనుడు స్వయంగా బయలుదేరాడు. కొద్దిమంది పరివారంతో శల్యుడు విడిది చేస్తున్న మందిరానికి చేరుకున్నాడు. తనను తాను పరిచయం చేసుకుని, వినయంగా నమస్కరించాడు. శల్యుడు తన ఆసనం నుంచి లేచి వచ్చి, దుర్యోధనుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తన ఎదుటనున్న మరో ఆసనంపై దుర్యోధనుణ్ణి కూర్చోబెట్టాడు.


'కురుకులాగ్రణీ! మేము కోరకుండానే మాకు మార్గాయాసం తెలియనివ్వకుండా అడుగడుగునా అతిథి మర్యాదలు చేశావు. ఇదంతా నీ పెద్దమనసుకు నిదర్శనం. నిన్నెంత పొగిడినా నువ్వు మాకు చేసిన సహాయానికి సాటి రావు. నేను తీర్చగలిగే కోరిక ఏదైనా ఉంటే కోరుకో! తప్పక తీర్చి నీ రుణం తీర్చుకుంటాను' అన్నాడు శల్యుడు.


'మద్ర మహీపతీ! నువ్వు సత్యవాక్పరిపాలకుడవు. ఉచితానుచితాలను ఎరిగిన వివేకవంతుడివి. అమిత బలశాలివి. పరాక్రమవంతుడవు. సర్వసమర్థుడవు. నాకు సదా హితుడవై, సమయం వచ్చినప్పుడు నాకు సైన్యాధిపతివై నా బలగాలను ముందుకు నడిపించాలి. ఇదే నా కోరిక. పాండవులూ కౌరవులూ ఉభయులూ నీకు సమానులే! అయినా నీవంటి శక్తిసంపన్నుడి అండ ఉంటే నాకు అదే మహద్భాగ్యం' అని వినయంగా వేడుకున్నాడు దుర్యోధనుడు.


'తప్పక నీ కోరిక తీరుస్తాను. నువ్వు నిశ్చింతగా హస్తినకు మరలి వెళ్లు. ఉపప్లావ్యంలో ధర్మరాజును కలుసుకుని, నా సేనలతో వచ్చి నిన్ను చేరుకుంటాను. యుద్ధంలో నీ పక్షాన నిలిచి పోరాడతాను' అని మాట ఇచ్చాడు శల్యుడు. తన ప్రయోజనం నెరవేరడంతో దుర్యోధనుడు సంతృప్తిగా పరివారంతో హస్తినకు వెనుదిరిగాడు.

మాయలేడి

              మాయలేడి


ఒకప్పుడు ఫిన్లాండ్ అనే మాజికల్ భూమిలో, ఎలారా అనే యువ మంత్రగత్తె ఉండేది. ఎలరాకు ప్రకృతిలోని అంశాలను తన మేజిక్తో కంట్రోల్ చేసే శక్తి ఉంది. ఆమె మేజిక్ ఫారెస్ట్‌లో చివరగా ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండేది.
అక్కడ చాలా చెట్లు ఇంకా ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి.

ఒకానొక టైంలో ఫిన్లాండ్ ఒక మనిషి వచ్చాడు. వాడే మలాకర్.వాడు ఒక మాంత్రికుడు ఇంకా అసూయ 
  మరియు దురాశతో కలిగి ఉన్నాడు. ఎలారా యొక్క శక్తులను తన కోసం దొంగిలించడానికి ప్రయత్నించాడు. అతను ఆమెను తిస్కురమ్మని తన చీకటి కోటకు తీసుకురావడానికి నీడ జీవులను గుంపుగా వదిలాడు.

రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఎలారా, ఆమె వేగంగా పనిచేయాలని తెలిసింది. తన నమ్మకమైన సహచరుడు, ఓరియన్ అనే తెలివైన ముసలి గుడ్లగూబతో, ఆమె చిన్నప్పటి గార్డియన్ల మార్గదర్శకత్వం కోసం ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది - ప్రపంచంలోని అంశాలను బ్యాలన్స్ కలిగి ఉండాలని ఇంకా ఎన్నో పురాతన జీవులను కలవడానికి తనకు సహాయం చేయమని కోరడానికి వెళ్తుంది.

ప్రమాదకరమైన పర్వతాలు మరియు హాంటెడ్ లోయల ద్వారా, ఎలరా మరియు ఓరియన్ చివరకు చిన్నప్పటి పెద్ద అడవి, అపారమైన శక్తి మరియు జ్ఞానం ఉన్న ప్రదేశంకు చేరుకున్నారు. అక్కడ, వారికి సంరక్షకులు స్వాగతం పలికారు - భూమి, గాలి, అగ్ని మరియు నీరు - ప్రతి ఒక్కటి వారి మూలకం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది.

ఫిన్లాండ్కు తిరిగి వెలుగుని తెచ్చి, దానిని బెదిరింపులను పారద్రోలేందుకు ఎంపిక చేసుకున్న వ్యక్తి యొక్క ఎదుగుదలను ముందే చెప్పే ప్రవచనాన్ని సంరక్షకులు ఎలారాకు వెల్లడించారు. మాలకర్‌ను ఎదుర్కోవడానికి మరియు భూమికి శాంతిని పునరుద్ధరించడానికి ఉద్దేశించినది ఆమె ఎంపిక చేయబడిందని ఎలారా గ్రహించింది.

చిన్నప్పటి గార్డియన్ల ఆశీర్వాదంతో, ఎలారా తన నీడల కోటలో మలాకర్‌ను ఎదుర్కోవడానికి బయలుదేరింది. ఆఖరి యుద్ధం ఉరుములు మరియు మెరుపులు, మంటలు మరియు మంచుతో ఒక అద్భుతమైన ఇంద్రజాల ప్రదర్శనతో చెలరేగింది.

స్వచ్ఛమైన ధైర్యం మరియు సంకల్పం యొక్క క్షణంలో, ఎలరా తన శక్తులను పూర్తి స్థాయిలో ఆవిష్కరించింది, చీకటిని ఒక్కసారిగా పారద్రోలే కాంతి యొక్క అద్భుతమైన ప్రదర్శనలో అంశాలను ప్రసారం చేసింది. మలాకర్, ఓడిపోయి, అణకువగా,ఫిన్లాండ్ను మళ్లీ బెదిరించకుండా వదిలి వెళ్లిపోయాడు.

మాయ ఫారెస్ట్‌పై సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, ఫిన్లాండ్ బంగారు కాంతితో కనబడింది, భూమి పునరుజ్జీవింపబడి మరోసారి ఆశతో నిండిపోయింది. ఇప్పుడు దేవతగా కీర్తించబడుతున్న ఎలారా, ఆమె ప్రజల మధ్య ఉన్నతంగా నిలిచారు, ధైర్యం, స్నేహం మరియు ఆమెలో ఉన్న మాయాజాలం యొక్క నిజమైన శక్తిని కనుగొనడానికి దారితీసిన ప్రయాణానికి ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. కాబట్టి, ఎలరా కథ, రాబోయే తరాలకు స్పూర్తినిస్తూ పురాణగాథగా మారింది.

మాయామహల్

             మాయామహల్


చుట్టూ అడవులు మరియు నిర్మలమైన సరస్సు మధ్య ఉన్న విచిత్రమైన పట్టణంలోని ఎడ్జ్‌వాటర్లో వినీత్ అనే అబ్బాయి మరియు అతని స్నేహితులు నివసించే వారు. వారు సాహసం కోసం వారి తీరని దాహానికి ప్రసిద్ధి చెందారు, ఎల్లప్పుడూ తెలియని వాటి యొక్క థ్రిల్‌ను కోరుకుంటారు.


ఒక చీకటి సాయంత్రం, చెట్ల మధ్య గాలి వీచినప్పుడు, వినీత్ పట్టణం చివరన ఉన్న పాడుబడిన భవనాన్ని అన్వేషించడానికి వెళదాం అని చెప్పాడు. చీకటి కథలతో కప్పబడిన ఈ భవనం ఎడ్జ్‌వాటర్ యొక్క అత్యంత చిలిపిగా ఉండే పురాణానికి నిశ్శబ్ద సెంటినెల్‌గా నిలిచింది-దాని హాళ్లలో తిరిగే స్పెక్ట్రల్ వితంతువు కథ.


గుండెలు బాదుకుంటూ, చేతిలో ఫ్లాష్‌లైట్‌లతో, వారు క్రీక్ చేస్తున్న ముందు తలుపు గుండా చొచ్చుకు పోయరు. ఆ మందిరం వారి ఉనికిని మింగేసింది, వారిని వింత నిశ్శబ్దం ఆవరించింది. వారు అన్వేషించేటప్పుడు, గాలి చల్లగా పెరిగింది మరియు నీడలు వారి లైట్లకు అందకుండా నృత్యం చేస్తున్నాయి.


గ్రాండ్ బాల్‌రూమ్‌లో, వినీత్ స్నేహితురాలు మాయకి పాత పియానో దొరికింది. దాని కీలు మురికిగా ఉన్నాయి, కానీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ధైర్యంగా, ఆమె ఇంటి ఆత్మతో ప్రతిధ్వనించేలా వెంటాడే మెలోడీని ప్లే చేసింది. నోట్లు గాలిలో తేలాయి, ఒక్క క్షణం అంతా నిశ్చలమైపోయింది.


అప్పుడు అనూహ్యమైనది జరిగింది. ఒక చల్లని గాలులు గదిని చుట్టుముట్టాయి, వారి లైట్లను ఆర్పివేసాయి. చీకటిలో, వారు ఒక దుస్తులు యొక్క మృదువైన శబ్దం మరియు సమీపించే అడుగుజాడల ప్రతిధ్వని విన్నారు. వారు తమ ఫ్లాష్‌లైట్‌లను వెలిగించటానికి తడబడుతున్నప్పుడు భయాందోళనలకు గురయ్యారు, కానీ కాంతి తిరిగి వచ్చినప్పుడు, వారు ఒంటరిగా ఉన్నారు-లేదా అలా అనిపించింది.


సాహసాలు కొనసాగాయి, ప్రతి గది మరిన్ని రహస్యాలను, గతంలోని మరిన్ని గుసగుసలను వెల్లడిస్తుంది. వారు ఒక సైనికుడి ప్రేమ లేఖలను కనుగొన్నారు, ఎప్పుడూ వాటిని పంపలేదు; ఇప్పటికీ ఆట కోసం వేచి ఉన్న బొమ్మలతో కూడిన ఆట స్థలం; వారి శీర్షికలను గుసగుసలాడేలా అనిపించే పుస్తకాలతో కూడిన లైబ్రరీ.


కానీ అటకపై నిజమైన భయానకం వేచి ఉంది. అక్కడ, చాలా కాలం గడిచిన జీవితపు అవశేషాల మధ్య, వారు వితంతువు యొక్క చిత్రపటాన్ని కనుగొన్నారు. అటువంటి వివరాలతో చిత్రించబడిన ఆమె కళ్ళు, దుఃఖం మరియు ఆవేశంతో నిండిన వాటిని అనుసరిస్తున్నట్లు అనిపించింది. వినీత్ ఫ్రేమ్‌ను తాకడానికి చేరుకున్నప్పుడు, ఉష్ణోగ్రత బాగా పడిపోయింది, మరియు ఒక స్వరం, మృదువుగా మరియు దుఃఖంతో నిండిపోయింది, "ఈ స్థలం నుండి వెళ్ళిపో..."


హెచ్చరికను విస్మరించి, వారు తమను తాము తిరిగి వక్రీకరించే హాలుల చిక్కైనలో కోల్పోయారని మాత్రమే కనుగొన్నారు. తలుపులు మాయమయ్యాయి, గదులు మారాయి, అడుగడుగునా వీక్షిస్తున్న అనుభూతి మరింత బలపడింది.


వారు దాచిన గదిపై పొరపాటు పడినప్పుడే, దాని గోడలు పురాతన బొమ్మలతో కప్పబడి, ఒకే నల్ల కొవ్వొత్తిని కాల్చివేసినప్పుడు, వారి పరిస్థితి యొక్క గురుత్వాకర్షణ వారికి అర్థమైంది. ఆ గది వితంతువుకి చెందినది, మరియు వారు ఆమె అభయారణ్యంలోకి చొరబడ్డారు.


చెవిటి అరుపుతో, కొవ్వొత్తి ఆరిపోయింది, వారిని చీకటిలోకి నెట్టింది. గులాబీల సువాసనతో గాలి దట్టంగా ఉంది, వితంతువుల పరిమళం. ఆమె ఉనికిని చుట్టుముట్టినట్లు వారు భావించారు, ఆమె దుఃఖం మరియు కోపం స్పష్టంగా కనిపించాయి.


తప్పించుకోవడానికి తీరని ప్రయత్నంలో, వారు పరుగెత్తారు, దృష్టి కంటే ప్రవృత్తి ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఇల్లు వారి నిష్క్రమణతో పోరాడుతున్నట్లు అనిపించింది, కానీ చివరికి, వారు రాత్రి గాలి యొక్క భద్రత కోసం ఊపిరి పీల్చుకుంటూ ముందు తలుపు ద్వారా పారిపోయారు.


తమ ఇళ్ళలో సుఖంగా చేరుకున్నారు, ఆ రాత్రి గురించి ఇంకెప్పుడూ మాట్లాడబోమని ప్రమాణం చేశారు. కానీ కొన్నిసార్లు, గాలి సరిగ్గా వీచినప్పుడు, వారు పియానో కీల యొక్క మందమైన శబ్దం మరియు దుస్తులు యొక్క మృదువైన శబ్దం వింటారు, కొన్ని సాహసాలను అన్వేషించకుండానే ఉంచారని వారికి గుర్తుచేస్తుంది.

తపతి పరిణయం

            తపతి పరిణయం 


చంద్రవంశానికి చెందిన ఋక్లుడి కొడుకు సంవరణుడు తండ్రి తదనంతరం ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. మహారాజులు అందరిలాగానే సంవరణుడికి కూడా వేట అంటే ఇష్టం. ఇష్టం చేత తరచుగా అరణ్యాలకు వెళ్లేవాడు.

అలవాటు కొద్ది సంవరణుడు ఒకసారి దట్టమైన కీకారణ్యంలోకి వెళ్లాడు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, క్రూరమృగాలను వేటాడుతూ అడవిలో సంచరించసాగాడు. అలా అడవిలో తిరుగుతున్న సమయంలో ఉన్నట్లుండి అతడి కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయింది. అడవి అడవంతా పరిమళభరితమై తోచింది. సంవరణుడు తల పైకెత్తి ఎదురుగా దృష్టి సాదించాడు. కళ్ల ముందు అద్భుత సౌందర్యరాశి నిలిచి ఉంది.

రెప్ప వాల్చకుండా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఎటువైపుగా వెళితే అటువైపు వెళుతూ ఆమెనే అనుసరిస్తూ అడవిలో తిరుగాడాడు. జరుగుతున్నది కలో నిజమో అర్ధం కాలేదతనికి, ముగ్ధ మోహనమైన ఆమె రూపలావణ్యాలు మానవకాంతలకు అసాధ్యమనుకున్నాడు. వనదేవతే ఇలా వచ్చిందేమో, తన పుణ్యఫలం వల్లనే ఆమె తనకు కనిపించిందేమో అనుకున్నాడు. ఇలా పరిపరి విధాలుగా తలపోస్తూ ఆమెను అనుసరిస్తూనే, నెమ్మదిగా మాటలు కూడదీసుకుని ఆమెను పలకరించాడు.

'ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ కీకారణ్యంలో ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నావు ?..."

సంవరణుడి గొంతు వినబడటంతో ఆమె వెనుదిరిగి చూసింది.

ఆయుధాలు ధరించిన ఆజానుబాహుడిని తేరిపార చూసింది. వీరుడిలాగే ఉన్నాడు. అనుకుంది.

భూలోక విహారానికి వచ్చిన తనను ఇంతగా ఆకర్షిస్తున్నాడేమిటా అని విస్తుపోయింది. సంవరణుడు ఆమె నుంచి చూపు మరల్చుకోలేక అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆమె చిరునవ్వు సవ్వింది. బదులుగా ఒక్క మాటైనా పలకలేదు. తృటిలో మాయమై పోయింది.

అనూహ్య పరిణామానికి సంవరణుడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయేసరికి దుఃఖంలో మునిగిపోయాడు. బిగ్గరగా రోదిస్తూ, మూర్ఛిల్లాడు.

తన కోసం విలపిస్తున్న సంవరణుడిని గగనతలం నుంచి తిలకించిందామె. దర్శనమాత్రం చేతనే తన కోసం విలపిస్తున్న అతడిపై ఆమెకు గాలి ప్రేమ ఒక్కసారిగా కలిగాయి.

మళ్లీ నేలకు దిగి, సంవరణుడి ఎదుట. నిలిచింది. మూర్ఛ నుంచి తేరుకున్న సంవరణుడికి కళ్లెదుట చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.

ఎందుకు ఆవేదన చెందుతున్నావు?' అడిగిందామె. 'నేను సంవరణుడిని, మహారాజును, ఎందరో స్త్రీలను చూసినా, ఎన్నడూ నా మనసు చలించలేదు. నిన్ను చూడగానే నా మనసు నా అధీనం తప్పింది. పూర్తిగా నీకే వశమైపోయింది.

నువ్వు అదృశ్యం కాగానే అంతా శూన్యమైపోయినట్లనిపించింది. నువ్వు లేకుండా జీవించలేను. ప్రకృతి సాక్షిగా మనం గాంధర్వ వివాహం చేసుకుందాం' అన్నాడు.

'నేను సూర్యభగవానుడి పుత్రికను. తపతిని. నేను స్వతంత్రను కాను. నా తండ్రి అనుమతి కావాలి. తపస్సుతో నా తండ్రిని ప్రసన్నుణ్ణి చేసుకో అని చెప్పి, సౌరమండలానికి ఎగసి పోయింది.

తపతీ వియోగాన్ని తట్టుకోలేక సంవరుణుడు అక్కడికక్కడే తపస్సు ప్రారంభించాడు. కాలం గడిచే కొద్ది ఉపవాస దీక్షతో కృశించిపోసాగాడు. అయినా చలించకుండా తపస్సు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా, ఒకనాడు వశిష్టుడు తన శిష్యుడైన సంవరణుడిని చూడాలనుకున్నాడు. రాజ్యాన్ని విడిచి, అడవిలో తపోనిష్టతో కృశించిపోయిన శిష్యుడిని చూసి సహించలేకపోయాడు. శిష్యుడి బాధకు కారణం తెలుసుకుని, తపోబలంతో నేరుగా సౌరమండలానికి వెళ్లారు.

సూర్యుడు ఎదురేగి వశిష్ఠుడిని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి మర్యాదలు చేశాడు.

'మహర్షీ! మీ రాకకు కారణం' వినయంగా అడిగాడు సూర్యుడు.

"సంవరణుడు నా శిష్యుడు. సకల సద్గుణ సంపన్నుడు. నీ కూతురు తపతిపై మరులుగొన్నాడు. ఆమెకు అతడు అన్నివిధాలా తగినవాడు తపతీ సంవరణుల వివాహం జరిపించు. నీకు కన్యాదాన ఫలం దక్కుతుంది' అని చెప్పాడు.

వశిష్టుడంతటి వాడు స్వయంగా అడగడంతో సూర్యుడు కాదనలేకపోయాడు. అతడి మాటనే ఆజ్ఞలా తలదాల్సి తపతీ సంవరణుల పరిణయాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు. సంవరణుడి ప్రేమగాథ అలా సుఖాంతమైంది.

వ్యాసుని జన్మ

              వ్యాసుని జన్మ


పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి "నీ వర్ణాశ్రమధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకొంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనం చేస్తూ ఉండు" అని పలికి అతనికి దివ్యత్వాన్నీ, మణి సువర్ణమయమైన దివ్యవిమానాన్నీ, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సమర్ధమైన వేణుయష్టినీ ఇచ్చాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది.


వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా "శుక్తిమతి" అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న "కోలహలుడు" అనే పర్వతము "శుక్తిమతి" మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా, ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. శుక్తిమతికి, కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె "వసుపదుడు" అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు.


ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది.


పూర్వం బ్రహ్మ శాపం వలన "అద్రిక" అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. పదినెలల తరువాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజు నకు ఇస్తారు. అద్రిక అనే పేరుకల ఆ చేపరూపంలో ఉన్న అప్సర; మనుష్యులను కంటే తనకు శాపవిమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది.


ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది.


ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.


అక్కడ కనిపించిన మత్స్యగంధిని (ఆమెనే సత్యవతి కూడా అంటారు) చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినదని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు అతడే వ్యాసుడు.వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. తల్లి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు వ్యాసుడు.

నరసింహ అవతారం

         నరసింహ అవతారం       

ఒకప్పుడు రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం , భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే వరం తనకు ఉంది కనుక ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక దహనం అవుతుంది ప్రహ్లాదుడికి చిన్న గాయం కూడా కాదు అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి , సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) , తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా).

అమ్మ కోసం

                  అమ్మ కోసం


ఒకప్పుడు, వినయ్ అనే అబ్బాయి తన తల్లితో కలిసి ఊరి చివర ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు. వినయ్ తల్లి ఎంతో దయతో,ప్రేమతో ఉండేవారు.ఆమె భర్త మరణించిన తరువాత తన కొడుకును పోషించడానికి చాలా కష్టపడింది.

వారి నిరాడంబరమైన జీవనం సాగిస్తూ,వినయ్ మరియు అతని తల్లి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు.వారు ఉన్న దానితో సంతృప్తి చెందేవారు. వారు తమ చిన్న తోటను చూసుకుంటూ, కలిసి భోజనం చేస్తూ, రాత్రి పొయ్యి దగ్గర కథలు పంచుకుంటూ తమ రోజులు గడిపారు.

ఒకరోజు వినయ్ తల్లి అనారోగ్యంతో పని చేయలేక పోయింది. వినయ్ తన తల్లి గురించి ఆందోళన చెందాడు మరియు ఆమె సంరక్షణ కోసం తాను చేయగలిగినదంతా చేశాడు. అతను భోజనం వండాడు, ఇల్లు శుభ్రం చేశాడు మరియు తన తల్లికి కావలసినవన్నీ ఉండేలా చూసుకున్నాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ వినయ్ తల్లి మరింత బలహీనపడింది. ఆమె బాగుపడాలంటే ఏదో ఒకటి చేయాలని వినయ్‌కి తెలుసు. ఎలాంటి జబ్బునైనా నయం చేసే అద్భుత మూలిక గురించి తన తల్లి చెప్పిన కథ అతనికి గుర్తుకు వచ్చింది.

వనమూలికను కనుగొనాలని నిశ్చయించుకున్న వినయ్, దారిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అడవిలో ప్రయాణానికి బయలుదేరాడు. రోజుల తరబడి వెతికిన తర్వాత, అతను చివరకు మాయా మూలికను కనుగొని తన తల్లికి తిరిగి తీసుకువచ్చాడు.

మూలికల సహాయంతో, వినయ్ తల్లి త్వరగా కోలుకుంది మరియు తన పాత స్థితికి తిరిగి వచ్చింది. తన కుమారుడి ధైర్యం మరియు సంకల్పం చూసి ఆమె చాలా గర్వపడింది. ఆ రోజు నుండి, వినయ్ మరియు అతని తల్లి ఎప్పటికీ సంతోషంగా జీవించారు.వారు పంచుకున్న ప్రేమ మరియు బంధానికి ఎంతో విలువ ఇచ్చేవారు.

వారి కథ గ్రామంలో ఒక పురాణ కథగా మారింది, ప్రతి ఒక్కరికి ప్రేమ యొక్క శక్తిని మరియు తల్లీ కొడుకుల బంధం యొక్క బలాన్ని గుర్తు చేస్తుంది. వినయ్ మరియు అతని తల్లి ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉంటారు. వారు కలిసి తమ దారికి వచ్చిన ఏదైనా అడ్డంకిని అధిగమించగలరని తెలుసు.

కుబేరుడు

                కుబేరుడు 


కుబేరుడు బ్రహ్మ కుమారుడైన పులస్త్యుని మనుమడు. విశ్రవసు ఇలిబిలకు జన్మించాడు. రావణ, కుంభకర్ణ, విభీషణులు విశ్రవసుడికి మరో భార్యవల్ల జన్మించారు. 


కుబేరుని ప్రాముఖ్యత : ఒకసారి దేవతలు కుబేరుడి తరఫున వరుణుడు యాగంచేసి సముద్రుడికి నదులకు అధిపతిని చేయగా అవి ఇతనికి ఎంతో సంపదని చ్చాయి. శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడయ్యాడు.


లంకానగర రాజు : కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరు కొమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు దిక్పాలకుడ్ని(అన్ని దిక్కులను పాలించేవాడిని) కావాలని, సంపదకు అధిపతిని కావాలని కోరుకుంటాడు. అపుడు బ్రహ్మ కుబేరుడికి ఆ వరాలను ప్రసాదిస్తాడు. కుబేరుడు తన తండ్రికి తానుపొందిన వరాలను గూర్చి చెప్పి తనకో నగరం నిర్మించమని అడుగుతాడు. అప్పుడు విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకానగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో నివసించాడు. బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు.


రావణుని లంక : విశ్రవసువుకు మరో భార్య వల్ల జన్మించిన రావణుడు. బ్రహ్మనుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు. అప్పుడు కుబేరుడు గంధమాదనం పైకి వెళ్లి అలకాపురిని నిర్మించుకుని అక్కడే నివసిస్తూ ఉంటాడు.  


రావణ కుబేరుల యుద్ధం : రావణుడు దేవతల్ని బ్రహ్మణుల్ని హింసిస్తుండగా వారు మహావిష్ణువును ఆశ్రయిస్తారు. ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని తన మనిషితో కబురు పంపుతాడు. అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం చేసుకున్న రావణుడు అతడిని నరికివేయడమేకాక ముందుగా కుబేరునిపై దండెత్తి కుబేరుడిని ఓడిస్తారు. అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానంలో కుబేరుడ్ని తీసుకెళ్లిపోయి కాపాడుతారు. 


కుబేరుడు ఊసరవెల్లిగా మారిన సంఘటన పురాణాల్లో ఉంది. మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర, కుబేర, వరుణ, యముల్ని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకొని ఈ యాగానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న ఇంద్ర, కుబేర, వరుణ, యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మరిపోతారు. కుబేరుడు ఊసరవెల్లిగా మారతాడు. 


 కుబేరుని శాపాలు :


ఒకసారి పార్వతి శివుని తొడపై కూర్చొని వుండగా కుబేరుడు ఈర్ష్యతో చూస్తాడు. అప్పుడు అది గమనించిన పార్వతి ఇతడి కన్నుపోయేటట్లు శపించింది. కుబేరుడు శాపవిమోచన కోరగా ఆ కన్ను గవ్వకన్నుగా మారుతుందని శాపవి మోచన కల్గిస్తుంది.


అలాగే ఇంకొకసారి కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్త్యుని తలపై ఉమ్మివేయగా ఇతడు ఇతడి సైన్యము ఓ మానవునిచే చంపబడతారని అందుకు నీవు దుఃఖిస్తావని శపిస్తాడు. భీమసేనుడు సౌగంధిక పుష్పాలకొరకు గంధమాదనం వెళ్లినపుడు మణిమానుడిని అతడి సైన్యాన్ని సంహరిస్తాడు. భీముడు కుబేరుడిని చూసినపుడు ఆ పాప పరిహారం జరుగుతుంది.


కుబేరుడి భార్య పేరు భద్ర. ఇతడు నరవాహనుడు. ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు.

వజ్రాయుధం

               వజ్రాయుధం 

      
పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు. ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికీ బలపడసాగాడు. ఆయనలో రాక్షసుల అంశ ఉండటంతో... ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రునిలో మొదలైంది. దాంతో విశ్వరూపుని హతమార్చి పారేశాడు. విశ్వరూపుని మరణవార్త అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది. తన కుమారుడి మరణవార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు. అందుకు కారణమైన ఇంద్రుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు.

ఇంద్రుని హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఓ గొప్ప హోమాన్ని చేయసాగాడు. ఆ అగ్నిగుండంలోంచి వృత్రాసురుడనే రాక్షసుడు వెలువడ్డాడు. అసలే అమిత బలవంతుడు. ఆపై ఓ చిత్రమైన వరం కూడా వృత్రాసురునికి ఉండేది. పగలు కానీ రాత్రి కానీ, లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ, ఇప్పటివరకూ ఉన్న ఆయుధాలతో కానీ, తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ... తనకు మరణం సంభవించకూడదన్నదే ఆయనకి ఉన్న వరం.

కష్టసాధ్యమైన వరాన్ని పొందిన వృత్రాసురునికి ఇక అంతులేకుండా పోయింది. ముల్లోకాల మీదా దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు. వృత్రాసురుని జయించే ఉపాయం తోచక దేవతలంతా, విష్ణువు చెంతకి చేరారు. వృత్రాసురుని సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి. అది చెక్కతోనూ, లోహంతోనూ, రాతితోనూ చేయబడి ఉండకూడదు. కాబట్టి దధీచి అనే రుషి వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి సూచించాడు.

దేవతల కోరికను విన్న దధీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు. అలా ఆయన వెన్నెముకతో రూపొందించినదే ‘వజ్రాయుధం’. ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్రాసురుని వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురుచూడసాగాడు. ఒకసారి వృత్రాసురుడు సముద్రతీరాన ఇంద్రుని కంటపడ్డాడు. అది పగలూ, రాత్రీ కాని సూర్యాస్తమ సమయం. తన చేతిలో వజ్రాయుధం ఉంది. దానికి సమద్రపు అలల మీద ఉన్న నురగను తాటించాడు ఇంద్రడు. దాంతో అది అటు తడీపొడీ కానీ ఆయుధంగా మారింది. ఆ వజ్రాయుధంతో వృత్రాసురుని వధించాడు ఇంద్రడు.

జాలకన్య

 ఒకరోజు మత్స్యకారుడికి సముద్రంలో ఒక జలకన్య దొరికింది.ఆ జాలకన్య మనిషిగా కూడా మరగలదు. 

ఆ మత్స్యకారుడు,అతని భార్య మరియు కొడుకు ఒక అందమైన యువతిగా మారిన జలకన్యను చూసి ఎంతో సంతోషించారు. వారు ఆమెకు రమాణి అని పేరు పెట్టి, వారి ఇంట్లోకి ఆహ్వానించారు.


రమాణి దయగల మంచి జలకన్య. ఆమె త్వరగానే ఆ కుటుంబంలో ముఖ్యమైన సభ్యురాలిగా మారింది. ఇంటి పనుల్లో సహాయం చేసి, ఆ కొడుకును తన కొడుకులా చూసుకుంది.


అయితే,  మత్స్యకారుడు  తన ఇంట్లో మాయా జీవి ఉండటం పట్ల ఇబ్బందిగా భావించాడు. అలాంటి జీవిని మిగతా లోకం నుండి దాచి ఉంచడం వల్ల వచ్చే పరిణామాల గురించి అతను ఆందోళన చెందాడు.


ఒక రోజు, ఎక్కడి నుంచో వచ్చిన అద్భుతమైన స్త్రీని చూసేందుకు కొందరు గ్రామస్థులు   మత్స్యకారుడు  ఇంటికి వచ్చారు. రమాణిని దాచేందుకు మత్స్యకారుడు ప్రయత్నించాడు, కానీ ఆమె సూర్యకాంతిని తట్టుకోలేకపోయి, అందరి ముందుకు జలకన్యగా మారిపోయింది.


గ్రామస్థులు ఆశ్చర్యపడి భయపడ్డారు.    మత్స్యకారుడు      తన ఇంట్లో జలకన్యను దాచి ఉంచడం వల్ల అతన్ని మంత్రగాడు అని నిందించారు. రమాణిని వెంటనే ఊరి నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.


అపరాధభావంతో, సిగ్గుతో, మత్స్యకారుడు           రమాణిని తిరిగి సముద్రంలోకి వదిలేయడం తప్ప మరే విధానం లేకుండా పోయింది. ఆమె ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా, ఆమెను దాచేందుకు ప్రయత్నించడంలో తాను చేసిన తప్పును అతను గ్రహించాడు. సముద్రపు మాయాజాలంలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదని అతను మనసులో నిర్ణయించుకున్నాడు.


అప్పటి నుండి,    మత్స్యకారుడు      మరియు అతని కుటుంబం నిశ్శబ్ద జీవితాన్ని గడిపారు. వారి ఇంటిని కొద్దికాలం అలంకరించిన అందమైన జలకన్య జ్ఞాపకాలు వారిని వెంటాడాయి. మరియు రమాణి, జలకన్య-మనిషిగా మారిన ఆమె, సముద్రంలో ఈదుతూనే ఉంది,  ఆమెను ఒకప్పుడు తెలుసుకున్న వారికి ఎప్పటికీ ఓ రహస్యంగానే ఉండిపోయింది.

Murder Part-3

 అర్జున్ మనసు చలించి పోయింది. పువ్వు పుప్పొడి ఆధారాలు ప్రొఫెసర్ వైపు చూపించాయి, కానీ ముసుగు వేసుకున్న వ్యక్తి గురించి చెప్పిన వివరణ సరిపోలేదు. అతను మళ్లీ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తిని అడిగాడు. ఈసారి, ఒక భయంకరమైన విషయాన్ని తెలుసుకున్నాడు: ఆ వ్యక్తి వేగంగా వెళ్లిపోతూ, తొందరపాటులో స్కార్ఫ్‌ను పడేశాడు. ఆ స్కార్ఫ్‌కి సుపరిచితమైన వాసన వచ్చింది - రియా పర్ఫ్యూమ్‌ల అనిపించింది.

అర్జున్ రియాని కలిశాడు. ఆమె ఒప్పుకుంది, ఆమె మొదటి కోపం అర్థం చేసుకోవాలని బతిమిలాడింది. ఆమె సుహాన్‌ను ప్రేమించింది, ఆ ప్రేమ గుడ్డితనంతో, అతనికీ అతని స్నేహితులకు సహాయం చేయడానికి ప్రాజెక్ట్‌ను దొంగిలించింది. కానీ సహస్ర పరిశోధన మరియు ప్రొఫెసర్ పాత్ర గురించి తెలుసుకున్న తర్వాత, భయం మరియు నిరాశ ఆమెను ఆవహించాయి.

రియ, ఆందోళనలో ఉన్న సమయంలో, సహస్రను కలిసి, ఆమె పరిశోధనను ఆపివేయమని డిమాండ్ చేసింది. చాలా వాదన తర్వాత, కోపం అదుపులేకుండా పోయిన సమయంలో, రియ అనుకోకుండా సహస్రను నెట్టివేసింది, దాని వల్ల ఆమె పడి, టేబుల్ అంచుకు తల కొట్టుకుని మరణించింది.

నిజం, విషాదకరమైనది అయినప్పటికీ, అర్జున్ మొదట అనుకున్న కుట్రలకు చాలా దూరంగా ఉంది. రియ, నేరభారం మరియు భయంతో, ఆమె ఆనవాళ్లను దాచేందుకు ప్రయత్నించింది, సుహాన్ మరియు ఆమెను తాను కాపాడుకోవడానికి ప్రొఫెసర్ మరియు హరిని ఇరికించింది.

కేసు ముగిసినప్పుడు, అర్జున్‌పై విషాదపు అలలు అలుముకున్నాయి. సహస్ర యొక్క దాచిన జీవితం ప్రేమ, గొప్ప చిక్కు, మరియు చివరికి, ఒక ఘోరమైన తప్పును తెలియజేసింది. నిందలు తొలగిపోయాయి, నిజం బయటపడింది.

Murder Part-2

 అర్జున్ ఆధారాలు వెంబడించడంతో పగలు రాత్రులు అని తేడా లేకుండా వెతుకుతూ ఉన్నాడు, ప్రతి ఒక ఆధారం సహస్ర యొక్క దాగి ఉన్న జీవితంలోని కొత్త కోణాన్ని వెల్లడిస్తుంది. ఆమె ఫోన్, చివరకు అన్‌లాక్ చేయబడి, "ఒరాకిల్" అనే పేరులేని వినియోగదారుతో మార్పిడి చేసుకున్న రహస్య సందేశాలను అందించింది. ఈ సందేశాలు సహస్ర రహస్యాన్ని బహిర్గతం చేయబోతున్నాయని సూచించాయి, ఆమెను ప్రమాదంలో పడేసేంత శక్తివంతమైన ఆధారాలవి.

బాగా లోతుగా పరిశీలనలో హరి సకర్యం కృంగిపోయాడు. ఆమె మరణించిన రాత్రి సహస్ర భవనం సమీపంలో CCTV ఫుటేజీ అతనిని సూచించింది. అతని దుఃఖం ఉక్కిరిబిక్కిరి చేసే కోపంగా మారింది, అతని అమాయకత్వం యొక్క వాదనలు బోలుగా ఉన్నాయి. కానీ అతను తనను తాను రక్షించుకున్నాడా లేదా మరొకరినా?

రియా, మొదట్లో శత్రుత్వంతో, ప్రాజెక్ట్‌ను దొంగిలించినట్లు ఒప్పుకుంది, అయితే సహస్రకు ఎటువంటి హాని చేయలేదు. సుహాన్ మరియు అతని బృందాన్ని అనుమానిస్తూ సహస్ర కళాశాలలో దోపిడీపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఇది దాచిన ప్రాజెక్ట్ ఫైల్‌తో సమలేఖనం చేయబడింది, అయితే దొంగిలించబడిన ఆలోచన హత్యకు తగినంత ప్రేరణగా ఉందా?

సుహాన్ పరిశీలనలోనే ఉండిపోయింది. ఒత్తిడికి గురైన అతని స్నేహితులు, అతను హ్యాకింగ్ టూల్స్ మరియు అస్థిర నిగ్రహాన్ని కలిగి ఉన్నాడని వెల్లడించారు. సుహాన్ ల్యాప్‌టాప్‌లో తొలగించబడిన ఫైల్‌ను అర్జున్ కనుగొన్నాడు - సహస్ర దోపిడీ గురించి అతనిని ఎదుర్కొన్న రికార్డింగ్, ఇది తీవ్ర వాదనతో ముగిసింది. తప్పిపోయిన ముక్క ఇదేనా?

ఫోరెన్సిక్ రిపోర్టుతో పురోగతి వచ్చింది. సహస్ర దుస్తులపై అరుదైన పూల పుప్పొడి జాడలు కనిపించాయి, కళాశాల సమీపంలోని ఏకాంత తోటకు దారితీసింది. అక్కడ, ఒక పొద కింద దాగి, విస్మరించబడిన ఫోన్ - "ఒరాకిల్". ఇది ఒక ప్రొఫెసర్‌కు చెందినది, అతని కఠినమైన గ్రేడింగ్ మరియు విద్యార్థులతో ఆరోపించిన వ్యవహారాలకు పేరుగాంచింది.

సాక్ష్యాధారాలను ఎదుర్కొన్న ప్రొఫెసర్ కుప్పకూలిపోయాడు. అతను సహస్రతో ఎఫైర్ కలిగి ఉన్నాడని అంగీకరించాడు, అతను సుహాన్ మరియు అతని స్నేహితుల కోసం సులభతరం చేసిన దోపిడీ గురించి మౌనంగా ఉండటానికి బదులుగా డబ్బు ఇచ్చాడు. ఆమె నిరాకరించడంతో, అతను ఆమెను బెదిరించాడు, కానీ ఎటువంటి శారీరక హానిని చేయలేదని తీవ్రంగా ఖండించాడు.

అయోమయానికి గురైన అర్జున్ నేరం జరిగిన ప్రదేశాన్ని మళ్లీ సందర్శించాడు. ఈసారి, తాజా కళ్ళతో, అతను ఏదో గమనించాడు: కిటికీ దగ్గర అదే పువ్వు పుప్పొడి యొక్క మందమైన సువాసన. అతను హుడ్ ఫిగర్ గురించి పొరుగువారి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు - అది ఒక స్త్రీ, పురుషుడు కాదు అని కనిపెట్టాడు.

Murder part-1

 హాంటెడ్ కళ్లతో అనుభవజ్ఞుడైన ఇన్వెస్టిగేటర్ అర్జున్, సహస్ర ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు. నిర్మలమైన నిశ్శబ్దం జీవితం యొక్క బరువును అకస్మాత్తుగా ముగించింది. పోరాట సంకేతాలు లేవు, బలవంతంగా ప్రవేశం లేదు, సహస్ర, ప్రశాంతంగా తన మంచం మీద పడుకుని, నిద్రపోతున్నట్లుగా ఉంది, ఎప్పటికీ.


ఫస్ట్ లీడ్: ఆమె ఫోన్. పాస్‌వర్డ్ ఉంది, రహస్యాలను నిరోధించే డిజిటల్ రూపంలో. ఆమె ల్యాప్‌టాప్, వింతగా తెరిచి, "H" అని చిరునామాతో సగం వ్రాసిన ఇమెయిల్‌తో ఉంది. అర్జున్ పేరును గుర్తించాడు - హరి, సహస్ర లైవ్-ఇన్ బాయ్‌ఫ్రెండ్. అతని ముఖంలో దుఃఖం పొంగిపొర్లింది, ముందు రోజు రాత్రి తమ మధ్య గొడవ జరిగినట్లు హరి పేర్కొన్నాడు, అయితే తాను ఆమెకు ఎలాంటి హాని చేయలేదు అని క్షేమంగా వదలనాని ప్రమాణం చేశాడు.


సహస్ర తల్లిదండ్రులు, వారి ప్రపంచం ఛిన్నాభిన్నమైంది, వారు చూడని సమస్యాత్మక కోణాన్ని వెల్లడించారు. సహస్ర దూరంగా ఉండి, రహస్యమైన కాల్‌లను మాట్లాడేది పైగా వారి ప్రశ్నలకు దూరంగా ఉండేది. దొంగిలించబడిన ప్రాజెక్ట్ ఆలోచనపై ఆమె బెస్ట్ ఫ్రెండ్ రియాతో జరిగిన వాదన ఒకటి ఆమెను చాలా ఇబ్బంది పడింది .


సహస్ర పట్ల అనాలోచిత భావాలతో సహవిద్యార్థి అయిన సుహాన్ నిజంగానే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అతని అలీబి చెక్ అవుట్ అయింది, కానీ అతని కళ్లలో దాగిన ఏదో ఒక చిన్న వణుకు అర్జున్‌కి వణుకు పుట్టించలేకపోయింది. సుహాన్ స్నేహితులు, అల్లరి చేసే సమూహం, చిన్న సహాయం అందించారు, వారి కథలు అసమానతలతో నిండి ఉన్నాయి.


రోజు గడిచేకొద్దీ, నిశ్శబ్దంలో గుసగుసలాగా ఆధారాలు వెలువడ్డాయి. ఒక పొరుగువారు తెల్లవారుజామున భవనం నుండి బయలుదేరిన ఒక హుడ్ ఫిగర్ చూసినట్లు గుర్తు చేసుకున్నారు. "H"కి సంబంధించిన ఇమెయిల్ డ్రాఫ్ట్ "నిజాన్ని బయట చేయడం" గురించిన ముప్పు గురించి సూచించింది. రియా ల్యాప్‌టాప్ నుండి దొంగిలించబడిన ప్రాజెక్ట్ ఫైల్ సహస్ర ఫ్లాట్‌లో దాచిన దానితో సరిపోలింది.


కొన్ని ఆధారాలు సరిపోలేదు, అర్జున్‌కి కీలకమైన భాగాలు మిస్సయ్యాయి. సహస్ర జీవితం, ఒకప్పుడు శక్తివంతమైనది, ఇప్పుడు మౌనంగా ఉంది, ఆమె చివరి క్షణాల రహస్యాన్ని మరింత లోతుగా చేస్తుంది. ఆమెను ఎవరు హత్య చేసారు మరియు ఎందుకు?

Youtube link:https://youtu.be/HjHwnpcHDVI

సంధి

                    సంధి 

మంత్రి చెప్పే మాటలు రాజుకి రుచించే మాటలు కాదు. అయినా మంత్రి సలహా వినక యిదివరకెన్నో సార్లు చిక్కుల్లో పడ్డాడు రాజు. అందుచేత అతని సలహా పెడచెవిని పెట్టడం మంచిది కాదని రాజుకి తెలుసు. కొంచెం ఆలోచించిన తర్వాత యిలా అన్నాడు: “నువ్విప్పుడు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ, శత్రువు మన రాజధాని పొలిమేర దాక వచ్చేసి ఉన్నప్పుడు, నిదానంగా ఆలోచిస్తూ కూర్చోవటం ఎలా కుదురుతుంది? మన ఆలోచన పూర్తయ్యేటప్పటికి వాడు మన రాజ్యం కొల్లగొట్టుకుపోతాడు. ముందు శత్రువును పారదోలే ప్రయత్నం చెయ్యాలి. దానికి, మన సైన్యాన్ని కూడగట్టుకొని యుద్ధం చెయ్యటం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నది నాకు. నీకు తోచిందీ చెప్పు. అందరికీ అంగీకారమయినదే చేద్దాం".

"మనం హిరణ్యగర్భుడితో గెలిచామంటే అదొక గెలుపు కాదు. ఎందుకంటే ఆ యుద్ధంలో మన వీరులు చాలామంది చనిపోయారు, మిగిలినవాళ్ళు చాలామంది బాగా గాయపడి ఉన్నారు. ప్రస్తుతం యుద్ధం చెయ్యలేదు. మిగిలిన కొద్దిమందితో మనం యుద్ధానికి దిగితే ఓడిపోవటం ఖాయం. అసలు ఈ సింహళరాజు ఇప్పుడు మనమీదికి యుద్ధానికి తన స్వబుద్ధితో రాలేదు. హిరణ్యగర్భుడి మంత్రి సర్వజ్ఞుడు చాలా తెలివిగా అతన్ని ప్రేరేపించాడు. మనతో పాత విరోధం ఉన్నా, ఇప్పుడు హిరణ్యగర్భుడి మాట మీదే మనతో యుద్ధానికి దిగాడు. మనం ఒక దూతను పంపించి హిరణ్యగర్భుడితో సంధి చేసుకొంటే మహాబలుడు యుద్ధం మాని వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే, అతని దగ్గరికి కూడా ఇప్పుడే మన దూతను పంపి ఈ విషయం తెలియపరచటం అవసరం" అన్నాడు మంత్రి.

రాజు దానికి అనుమతించాడు.

వెంటనే అరుణముఖుడు దూతగా మహాబలుడి దగ్గరకు వెళ్ళాడు. "రాజా! మనమంతా ఇరుగుపొరుగు దేశాలవాళ్ళం. తరచుగా మనలో మనం యిలా యుద్ధాలకు దిగటం మంచిది కాదు. మనమంతా స్నేహ భావంతో ఉంటే, ఇతర శత్రువులు మనల్నెవర్నీ కన్నెత్తి చూడలేరు. పూర్వం పంతాలకు పోయి పోట్లాడుకున్నాం. దానివల్ల రెండు పక్షాలూ నష్టపోయాయి. ఇకముందు మనమందరం స్నేహంగా ఉండటమే మనందరికీ మేలు. అందుకే మనకి మిత్రుడిగా ఉండదగ్గ హిరణ్యగర్భుడికి కూడా అతని రాజ్యం తిరిగి యిచ్చేసి, అతనితో స్నేహ సంబంధం పెట్టుకొంటామని ఈరోజే దూత ద్వారా తెలిపాం. అందుకని ఈ యుద్ధ ప్రయత్నం విరమించి వెనక్కి వెళ్ళండి" అని తన రాజు మాటగా మహాబలుడికి చెప్పాడు.

ఈ సందేశం గురించి మహాబలుడు కూడా లోతుగా ఆలోచించాడు. తను కోరిన ఫలితం, హిరణ్యగర్భుడి రాజ్యం అతనికి యిప్పించటం లభించింది. తన సైనికులు కూడా చాలా అలసిపోయి ఉన్నారు. యుద్ధంచేసి, ప్రాణనష్టం కలిగించుకోవటం కంటే సంధి చేసుకోవడమే అతనికీ సబబుగా కనిపించింది. చిత్రవర్ణుడు దూతద్వారా చెప్పిన మాటలన్నీ యథార్ధమే కదా!

అందువల్ల మహాబలుడు చిత్రవర్ణుడితో సంధికి
ఒప్పుకొన్నాడు.

తరువాత చిత్రపర్ణుడు మంత్రితో సంప్రదించి, హిరణ్యగర్భుడికి ఒక లేఖ రాశాడు. దాన్ని కూడా అరుణముఖుడి ద్వారానే హిరణ్యగర్భుడికి పంపాడు. ఆరుణముఖుడు హుటాహుటిన కర్పూరద్వీపానికి వెళ్ళి హిరణ్యగర్భుడిని కలిసి అతనికి చిత్రవర్ణుడి సందేశం వినిపించాడు. "రాజా! మా రాజు చిత్రవర్ణుడు మీ గొప్పతనాన్ని గురించి అనేకుల నోట విన్నారు. వాళ్ళ మాటమీద ఆయన మీతో స్నేహాన్ని కోరుతున్నాడు. మీరు ఇవాల్టినించి, మీ కర్పూరద్వీప రాజ్యాన్ని నిరాటంకంగా పరిపాలించుకొండి. మా దేశంతో, మా రాజుతో స్నేహసంబంధాలు పెట్టుకొని, మన రెండు దేశాల ప్రజలూ క్షేమంగా ఉండేలాగా, శాంతిసుఖాలతో తులతూగేలా చేసుకొందాం. పోరు అందరికీ నష్టం. పొందు అందరికీ

హిరణ్యగర్భుడు ఆ సందేశం విన్నాడు. చిత్రవర్ణుడి లేఖ కూడా చదివాడు. తన మంత్రితో సంప్రదించి, ఆ లేఖకు జవాబు వ్రాయించి, దాన్ని తన దూత ధవళాంగుడిచేత చిత్రవర్ణుడికి వెంటనే పంపే ఏర్పాటు చేశాడు. అరుణముఖుడికి యథోచితంగా బహుమానాలిచ్చాడు.

అరుణముఖుడితో కలిసే జంబూద్వీపానికి దూతగా వెళ్ళి, ధవళాంగుడు తన రాజు సమాధానాన్ని, చిత్రవర్ణుడికి అందజేశాడు. సంధికి తమ సుముఖత తెలియజేశాడు.

దీనితో మహాబలుడు అనుకొన్న పని కూడా పూర్తయింది. అతను కూడా చిత్రవర్ణుడి అతిథి సత్కారం పొంది, పరమానందంతో, తన సైన్యంతో సహా, తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత చిత్రవర్ణుడూ, హిరణ్యగర్భుడూ, మహాబలుడూ ఎటువంటి పొరపొచ్చాలూ, తగాదాలూ లేకుండా తమ తమ రాజ్యాలు హాయిగా పాలించుకొన్నారు. వాళ్ళ రాజ్యాల్లో ప్రజలు కూడా సుఖసంతోషాలతో జీవించారు.

అని చెప్పి విష్ణుశర్మ 'సంధి' కథ ముగించాడు. 'మీరు గూడా వీలయినంత వరకు పొరుగురాజ్యాలతో సఖ్యతగా ఉండండి. యుద్ధాల వల్ల రెండుపక్షాలకూ నష్టమే. శాంతివల్ల అందరికీ లాభమే. పంతాలకూ, పట్టింపులకూ పోయి, చిన్నవిషయాల మీద పెద్ద తగాదాలు పెట్టుకోవడం వివేకం కాదు” అని బోధించాడు.

ఇలా ఈ జంతువుల కథల ద్వారా, విష్ణుశర్మ ఆ రాజకుమారులకు రాజధర్మం, రాజనీతి చక్కగా బోధించి, బోధన పూర్తయిన తర్వాత వారిని తిరిగి సుదర్శన మహారాజుకు అప్పగించాడు. రాజు విష్ణుశర్మని ఘనంగా సన్మానించి అతనికొక అగ్రహారం బహుమానంగా యిచ్చాడు.

బ్రాహ్మణుడు - ముంగిస

         బ్రాహ్మణుడు - ముంగిస

వెనకటికి గౌడ దేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికి చాలాకాలం సంతానం కలగలేదు. అతని భార్య సంతానం కోసం ఎన్నో పూజలు చేసింది. నోములూ, వ్రతాలూ పట్టింది. రాయి కనిపిస్తే రాతికీ, గుడి కనిపిస్తే గుడికి మొక్కింది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకో కొడుకు పుట్టాడు.

ఆ కొడుకుని వాళ్ళు చాలా గారాబంగా పెంచుకొన్నారు. ఓ రోజు తల్లి ఆ కొడుకును ఉయ్యాలలో పడుకోబెట్టి, నిద్రబుచ్చి, జాగ్రత్తగా చూస్తూ ఉండమని భర్తకి చెప్పి, అవతలి వీధిలో ఉన్న పుట్టింటికి ఏదో పూజ కోసం వెళ్ళింది.

ఆమె అటు వెళ్ళగానే, రాజభవనం నించీ బ్రాహ్మణుడికి పిలుపు వచ్చింది, వెంటనే వచ్చి పండగ సంభావన పుచ్చుకొని పెళ్ళమని, బ్రాహ్మడు యిరకాటంలో పడ్డాడు. భార్యకోసం ఆగుదామా అంటే ఆమె పూజ పూర్తి చేసుకొని వచ్చేప్పటికి చీకటి పడిపోతుంది. పోనీ రాజుగారి దగ్గరికి వెళ్ళటం అంటే, రాక రాక వచ్చిన పిలుపు, బోలెడంత సంభావన నష్టమవుతుంది. పైగా రాజుకేం కోపం వస్తుందో? వెళదామంటే పిల్లవాడికి కాపలా ఎవరు? ఆలోచించి, ఆలోచించి, పిల్లవాడికి తను చాలాకాలం నించీ ముద్దుగా పెంచుకొంటున్న ముంగిసను కాపలా ఉంచి, తను దానం స్వీకరించేందుకు వెళ్లాడు. వెళ్ళటం వెళ్ళాడు కానీ ఆ గంటసేపూ అతని మనసంతా ఉయ్యాల్లో పిల్లాడి మీదే. వాడికేం ఆపద వస్తుందో అని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాడు.

నిజంగానే యిక్కడ పిల్లాడికి ఓ ఆపద వచ్చింది. ఇంటిపై కప్పునించీ ఓ నల్లతాచు జారిపడి పిల్లాడి ఉయ్యాలవైపు పాకింది. ముంగిస వెంటనే దానిమీదపడి దాని మెడకొరికి, ముక్కలు ముక్కలు చేసి చంపి పడేసింది కాబట్టి పెద్ద గండం గడిచింది.

బ్రాహ్మడు సంభావన తీసుకొని పరుగులు పెడుతూ తిరిగివచ్చాడు. అతనింటికి రాగానే తలుపు చప్పుడుకు ముంగిస ఎదురెళ్ళింది. దానిమూతినిండా, వంటినిండా, పామును చంపిన రక్తం. అసలే అన్నిరకాల కీడు శంకిస్తూ వస్తున్న బ్రాహ్మడికి ఆ ముంగిసను చూడగానే మతిపోయింది. తన బిడ్డను ముంగిస కొరికి గాయపరిచిందో లేక అసలు చంపేసే ఉంటుందోనని భయం వేసింది. పిచ్చికోపంతో దగ్గర్లో ఉన్న ఓ కర్ర తీసుకొని ముంగిస తలమీద మోది దాన్ని చంపేశాడు.

లోపలికి వెళ్లి చూస్తే పిల్లవాడు ఉయ్యాలలో సురక్షితంగా హాయిగా పడుకొని ఉన్నాడు. పక్కనే ముక్కలు ముక్కలయిన నల్లతాచును చూస్తే, జరిగిందేమిటో స్పష్టంగా తెలిసిపోయింది. తను చేసిన పాపానికీ, తన తొందరపాటుకూ ఎంతో విచారించి, నెత్తీ నోరు కొట్టుకొంటూ రోదించాడు ఆ కోపిష్టి బ్రాహ్మడు. ఏం లాభం? కనక, కేవలం కోపంలో ఏదో నిర్ణయం తీసేసుకొంటే చాలా నష్టం కలగచ్చు. తొందరపడకుండా, అన్ని విషయాలూ ఆలోచించి, కార్యంలోకి దిగాలి, అంటూ రాజు చిత్రవర్ణుణ్ణి మంత్రి దూరదర్శి గట్టిగా హెచ్చరించాడు.

పాము - కప్పలు

           పాము - కప్పలు


కాంచీపురం సమీపంలో ఒక ముసలి పాములరాజు ఉండేవాడు. వాడి పేరు మందవిషుడు. అతను ఒకరోజు ఆహారం కోసం తిరుగుతుంటే కప్పలతో నిండి ఉన్న ఒక చెరువు కనిపించింది. వాటినన్నింటినీ నిదానంగా తినేయటానికి మందవిషుడు ఒక పథకం ఆలోచించాడు.

ఆ చెరువు ఒడ్డునే తలవాల్చేసి, ఏదో వ్యాధితో బాధపడుతున్న వాడిలాగా మూలుగుతూ పడుకొన్నాడు. అది చూసి జలపాదుడనే ఆ కప్పలరాజు పాము దగ్గిరకి వచ్చాడు. “నువ్వు తలచుకొంటే మహాబలవంతులనే ఒక్క కాటుతో చంపగలవు. ఇక్కడ ఇన్ని కప్పలున్నా, వాటిని తినే ప్రయత్నం చేయకుండా, ఇలా పస్తులుంటూ బాధపడుతున్నావు. కారణం ఏమిటి?" అని అడిగాడు.

"ఏం చెప్పమంటారు? ఇది నా కర్మ. నేనెప్పుడూ ఎవర్నీ దేహి అని బిచ్చం అడగలేదు. ఇన్నాళ్ళకు ఆ అవస్థ వచ్చింది. మీలాంటివాళ్ళు దయతలిచి ఆహారం యిస్తే తప్పా నాకు పస్తులే గతి. నిన్నరాత్రి నేను పొరపాటున ఒక బ్రాహ్మణకుమారుడిని కరిచాను. ఆ బ్రాహ్మణుడు కొడుకును విషవైద్యుడి దగ్గిరకి తీసుకెళ్ళి చికిత్స చేయించి బతికించుకొన్నాడు. కానీ, ఇక ముందు నా ఆహారమయిన కప్పలను తలమీద మోస్తూ తిరగమనీ, లేకపోతే నాకు ఆహారం దొరకదనీ నాకు శాపం యిచ్చాడు. దాంతో మెల్లిగా పాకుతూ మీ దగ్గరికి వచ్చాను.

మిమ్మల్ని యికనించీ నా నెత్తిన పెట్టుకొని మోస్తాను. నాకింత ఆహారం మీరే యిప్పించాలి" అన్నాడు మందవిషుడు.

పాము పడగమీద ఎక్కి ఊరేగడమంటే జలపాదుడికి చాలా ఉత్సాహం కలిగింది. పాము జలపాదుణ్ణి తన పడగమీద మోసి కొంతదూరం తిప్పింది. తరువాత అలసిపోయినట్టుగా, ఆయాసం నటిస్తూ తల వేలాడేసి పడిపోయింది. 'కటిక ఉపవాసం చేస్తూ ఉండటం వల్ల నేను నీరసించిపోయాను. ఆహారం లేకపోతే యిక నేను మిమ్మల్ని ఎలా మోయగలను?” అంది. జలపాదుడి మనసు కరిగి, 'అయ్యో, నా మాట విను. నీకు బాగా ఆకలివేసినప్పుడల్లా, నన్ను అడగకుండానే, నా రాజ్యంలో కప్పల్ని నీకు కావలసినంత వరకూ తిని, తరువాతే నన్ను మోస్తూ తిరుగుతుండు' అన్నాడు. పాము వెళ్ళి కొన్ని కప్పల్ని తిని వచ్చి రాజును తలమీద ఎక్కించుకొని తిప్పింది. ఇలా రోజూ కొన్ని కప్పల్ని తింటూ, కొన్నాళ్ళకు చెరువులో కప్పలన్నిటినీ తినేసింది. చివరికి ఓరోజు జలపాదుణ్ణి తినేసింది!

ఆ పాములాగా, నేను కూడా హిరణ్యగర్భుడిని నమ్మించి, చివరికి యుద్ధంలో అతని కోట తగలబెట్టి అతని నాశనానికి కారణమయ్యాను. అడవిలో పుట్టే దావాగ్ని చెట్లను కాల్చేస్తుంది. కానీ సమూలంగా నాశనం చెయ్యదు. అదే నది నీరు, చల్లగా ఉండికూడా, నది ఒడ్డున ఉన్న చెట్లను సమూలంగా నాశనం చేస్తుంది. అలాగే బలంతో చెయ్యలేని పనిని ఒక్కక్కప్పుడు తియ్యటి మాటలతో సాధించచ్చు" అన్నాడు మేఘవర్ణుడు.

ఇంతలో మంత్రి దీర్ఘదర్శి మరోసారి సంధి విషయం. ఎత్తాడు, "రాజా, హిరణ్యగర్భుడు తన దూతను సింహళరాజు మహాబలుడి దగ్గిరకి పంపాడని మన గూఢచారులు కబురుతెచ్చారు. ఆ సింహళరాజు కూడా పూర్వం ఓసారి మనతో ఓడినవాడే, ఇప్పుడు హిరణ్యగర్భుడూ, మహాబలుడూ కలిసి మనమీద దాడిచేస్తే, మనం వాళ్ళని గెలవటం అసంభవం. అందుకే మనం హిరణ్యగర్భుడితో సంధి చేసుకోవటమే నయం!"

అతనామాట అంటుండగానే ఒక చిలుక కొలువులో ప్రవేశించింది. "రాజా! సింహళరాజు మహాబలుడు పెద్ద సైన్యంతో వచ్చి, మన రాజధానిని చుట్టుముట్టాడు" అంది. రాజు ఆ వార్త విని ఉలిక్కిపడ్డాడు, వివరాలు అడిగాడు.

"ఓరాజా! ఏ కారణమూ లేకుండా సింహళరాజు. మనమీదికి దండెత్తి వచ్చాడు. పెద్దసేనతో మన రాజధాని పొలిమేర దాకా చేరాడు. మనకెవ్వరికీ అతను దండెత్తుతున్న విషయం ఇప్పటి వరకు తెలియలేదు. ఇందాక నేను పళ్ళకోసం తిరుగుతుంటే మన నగరం పొలిమేరలలో మన కావలివాళ్ళ హడావిడి చూశాను. ఏమయిందోనని చెట్టు చిటారుకొమ్మ కెక్కి చూశాను. నగరం బయట మన్నూ మిన్నూ ఏకంచేస్తూ ఒకటే దుమ్ము లేచిపోతున్నది. భయపడి చూస్తూ ఉండగానే కూతవేటు దూరంలో సింహళరాజు సేనలు బారులు తీర్చి కనబడ్డాయి. ఆ పక్కనించీ మన పక్షులన్నీ బెదిరిపోయి మన రాజధాని వైపు వచ్చేస్తున్నాయి. వాటిలో ఒక కొంగని అడిగితే వాళ్ళు మన రాజ్యాన్ని ఆక్రమించటానికి వచ్చారని చెప్పింది. ఆ సమాచారం మీకు చెప్పాలని పరుగు పరుగున వచ్చాను" అన్నది చిలుక..

రాజు శౌద్రమూర్తి అయ్యాడు. 'మండ్రి నిన్నవో మొన్ననోనే కదా, ఆ దుర్మార్గుడు మనమీద దాడి చేయబోయి, చిత్తుగా ఓడిపోయి, బోలెడంత సైన్యం నష్టం చేసుకొని, కష్టం మీద తను మాత్రం పారిపోయాడు? మళ్లీ ఏ మొహం పెట్టుకొని మనమీదికి దండెత్తి పదండి. మనం యిప్పుడే బయల్దేరి, వాడినీ వాడి సైన్యాన్ని మట్టుపెడదాం. మన బలం ముందు వీడెంత, వీడి సైన్యమంత? ముందు మనమీదికి దండెత్తిన వీడి సైన్యాన్ని నాశనంచేసి, తరువాత మనమే సింహళ దేశాన్ని దాడిచేసి నేలమట్టం చేసి వద్దాం" అన్నాడు. మంత్రి అతన్ని వారించాడు.

"రాజా! తొందరపడొద్దు. ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రస్తుతం మన పరిస్థితి పూర్వంలా లేదు. మొన్న జరిగిన యుద్ధంలో మన సైన్యం చాలావరకు నాశనమయింది. పెద్దపెద్ద వీరులందరూ యుద్ధంలో చనిపోయారు. మంచి ధైర్యశాలీ, పరాక్రమవంతుడూ అయిన మన సేనాపతి తామ్రచూడుడు. చనిపోయిన తరువాత మన సైన్యానికి సరయిన నాయకుడు: లేడు. అవసరం కలిగినపుడు, ప్రాణాలొడ్డి వీరోచితంగా పోరాడగలిగినవాళ్ళు మన పక్షంలో ఇప్పుడెవ్వరూ కనబడటం లేదు. ఎప్పుడూ సాహసమే పనిచేయదు. సింహళ దేశాన్ని మనం ఇదివరకు ఓడించిన మాట నిజమే. కానీ, యివాళ వాళ్ళని ఓడించగల శక్తి మనకు లేదు. నిప్పుతో కాగిన నీళ్ళే. ఒక సమయంలో పొంగి ఆ నిప్పునే ఆర్పేయగలవు, మర్చిపోవద్దు. పరిస్థితులు మారాయి. బండిచక్రంలాగా కాలగతి బట్టి ఒకనాడు పైన ఉన్నవాళ్ళం మరోనాడు కిందికి చేరతాం. ఇదంతా నేను నా ప్రాణాల మీద ఆశకొద్దీ చెప్పటం లేదు. మన బలాబలాల సంగతి తెలియకుండా, కేవలం మేఘంలాగా ఉరిమితే ఎప్పుడూ పని జరుగుతుందా? ఆలోచించి నిర్ణయం చేయండి.

ఒకరాజు ఎంత బలవంతుడయినా, పదిమంది రాజులతో తగవు పెట్టుకోకూడదు. ఒకసారే నలుగురితో తగవు ' పెట్టుకొంటే మట్టి కరుస్తాం. బలవంతమయిన సర్పం చలిచీమలచేత చిక్కి చావటం ఎరగమా?

ప్రయోజనం లేని యుద్ధంలోకి యిప్పుడు దిగద్దు. నా మాట విని యుద్ధం ఆలోచన మానండి. వివేచన లేకుండా ఊరికే, కేవలం కోపంతో ఏదయినా పని చేపడితే నష్టం తప్పదు. మునుపు కోపంతో ముంగిసను చంపుకొన్న బ్రాహ్మడి కథ మరోసారి గుర్తు చేస్తాను. వినండి" అంటూ మరో కథ మొదలుపెట్టాడు మంత్రి.

తాబేలు - నక్క

              తాబేలు - నక్క 

అనగనగా ఒక ఊళ్ళో ఒక నది ఉంది. ఆ నదిలో ఓ తాబేలు ఉంది. ఓరోజు మధ్యాహ్నం తాబేలు తీరానికి వచ్చి, ఓ చెట్టు కింద కాసేపు పడుకొంది. ఆ నదిలో నీళ్ళు తాగడానికి వచ్చిన ఒక నక్క ఒడ్డున పడుకొని ఉన్న తాబేలును చూసింది. "ఆహా! ఇవాళ మంచి ఆహారం దొరికింది" అనుకొంటూ తాబేలు మీద కాలు వేసింది. ఆ ఒత్తిడికి తాబేలుకు మెలకువ వచ్చింది. తాబేలు కాళ్ళూ, చేతులూ, తలా వగైరా భాగాలు మెత్తగా ఉంటాయి గాని, వీపు రాతి చిప్పలా ఉంటుంది. ప్రమాదం తోచినప్పుడు తాబేలు తన శరీరాన్నంతా ఆ చిప్ప లోపలికి లాక్కుని కూర్చొంటుంది. ఆ స్థితిలో ఆ చిప్ప బద్దలుకొట్టి వీలుకాదు. లోపల . మెత్తటి మాసం తినటం ఏ జంతువుకూ

నక్క కాలు తన మీద పడగానే తాబేలు శరీరాన్నంతా లోపలికి లాక్కుంది. నక్క ఎంతసేపు తిప్పలు వద్దా, తాబేలు కవచాన్ని ఛేదించలేకపోయింది. కొంతసేపయింతర్వాత తాబేలే నక్కతో యిలా అంది. "నువ్వు నన్ను పట్టుకొన్నప్పుడే నాకు ప్రాణాల మీద ఆశపోయింది. నీలాంటి మహానుభావుడికి ఆహారం అవటం నాకూ యిష్టమే. కానీ, నువ్వు యిలా వృధాగా శ్రమపడుతుంటే నాకు బాధగా వుంది. నా వీపు రాయి లాంటిది. నువ్వెంత శ్రమపడ్డా నీకు స్వాధీనంలోకి రాదు. ఒక ఉపాయం చెప్తాను, విను. నన్ను ఆ నీళ్ళలో కాసేపు ఉంచావంటే, నా శరీరం నాని, మెత్తపడుతుంది. అప్పుడు నన్ను నువ్వు తేలిగ్గా చంపొచ్చు!”

ఉపాయం బాగానే ఉంది కాని నక్కకు అనుమానం. అసలే తాబేలు నీటి జంతువు. నీళ్ళలోకి జారిపోతే మళ్ళీ తనకు దొరుకుతుందా? మరి, నీళ్ళలో ముంచకపోతే దాని శరీరం మెత్తబడేదెలా? మధ్యే మార్గంగా, నక్క తాబేలును నీళ్ళలోకి లాగి, కదలకుండా తన కాళ్ళు దాని వీపుమీదే వేసి అదిమిపెట్టింది.

అలా రెండుగంటలు గడిచినా తాబేలు మెత్తబడలేదు. "నానితే మెత్తపడతానన్నావు, ఎంతకూ మెత్తపడవేం?" అని అడిగింది నక్క.

"అయ్యో రాత! నువ్వు అలా కాళ్ళు వేసి కూర్చొంటే. నా వీపుకు నీళ్ళెక్కడ తగులుతున్నయ్ నానటానికి. కాసేపు ఆ కాళ్ళు తీసెయ్. పదినిమిషాల్లో మెత్తబడతాను" అంది తాజేలు. "అలాగా!" అని నక్కకాలు తీయగానే, తాబేలు నీళ్ళలో ఈదుకుంటూ పారిపోయి, ప్రాణం కాపాడుకొంది.

ఇలా ఆ ముసలిదొంగ కథలు చెపుతూ, "మోసంతో ఏ పనయినా చేయచ్చు. ఈ మేకని దొంగిలించడం పెద్ద ఘనకార్యం కాదు. నేను తేలిగ్గా సాధిస్తాను. అయితే మీరందరూ నాకో చిన్న సహాయం చేసి పెట్టండి. మీరు ఈ బ్రాహ్మడి దోవలోనే వెళ్ళి కొంచెం దూరం, దూరంగా అక్కడక్కడా కావు వెయ్యండి. బ్రాహ్మడు మీ దగ్గరికి రాంగానే 'ఏమయ్యా బ్రాహ్మడా! నల్లకుక్కనిలా తీసికెళ్తున్నావేమిటి?' అని అడగండి. చాలు, మిగిలింది నేను చూసుకొంటాను" అన్నాడు.

అలాగే బ్రాహ్మణుడు మేకని తీసుకుపోతూ కొంతదూరం వెళ్ళిన తర్వాత ఒక దొంగ అతన్ని పలకరించి. "అయ్యో! నువ్వు చూడబోతే బ్రాహ్మడివి. యిలా కుక్కను           తోలుకుపోతున్నావేమిటి?” అన్నాడు.

బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. "ఛీ తాగుబోతా! నేను యజ్ఞానికని పవిత్రంగా నల్లమేకను తీసుకెళ్తుంటే, నీ తాగుడు మైకంలో అది నీకు కుక్కగా కనిపిస్తున్నదా? పక్కకి ఫో, నా దోవకు అడ్డు రాకు!” అంటూ తిట్టి ముందుకుసాగాడు.

మరోమైలు నడిచిన తర్వాత, మరొక దొంగ ఆయన్ని పలకరించాడు. "స్వామీ, అన్నీ తెలిసిన బ్రాహ్మలై యుండి నల్లకుక్కని తాకటమే కాక మీతో తీసుకెళుతున్నారేమండీ?” అన్నాడు. బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది, ఏమిటి ఇద్దరు బాటసారులు యిదే పిచ్చిప్రశ్న వేశారని, జవాబేమీ చెప్పకుండా తన దోవన తను నడిచాడు.

మరో మైలు గడచిన తర్వాత మరో దొంగ ఎదురయ్యాడు “ఇదేం పనయ్యా బాపడా! ఛీఛీ నల్లకుక్కని తీసుకెళుతున్నావు. అదీ నిర్భయంగా, పట్టపగలు! ఎవరయినా చూస్తారని కూడా భయం లేదా? ఆచారాలన్నీ యిలా మంటగలుపుతావేమయ్యా?" అన్నాడు.

ఒకరికి యిద్దరు, యిద్దరికి ముగ్గురూ ఇలా అడిగేసరికి బ్రాహ్మణుడికి నిజంగానే అనుమానం వచ్చింది, మతిచెదిరి, భ్రాంతి వల్ల తను మేక అనుకొని కుక్కను గానీ కొనలేదు గదా అని.

మరో అరమైలు నడిచిన తర్వాత, అతనికి మరో యిద్దరు దొంగలు ఎదురయ్యారు. వాళ్ళల్లో ముసలిదొంగ, రెండోవాడితో "చూశావురా! ఈయనెంత పిచ్చి బ్రాహ్మడో. ఈయన్ని అమాయకుణ్ణి చేసి, సంతలో ఎవడో గడుసువాడు. ఈయనకు నల్ల కుక్కని అమ్మేశాడు. అదే మేక అనుకుని ఈయన ఇంటికి తీసుకెళుతున్నాడు. ఆయన అవస్థ చూడు. తీరా తన ఊరు చేరితే అందరూ పాపం ఈయన అమాయకత్వం చూసి నవ్విపోవటమే గాక ఈయన్ని వెలివేస్తారో ఏం పాడో!” అన్నాడు.

దాంతో బ్రాహ్మణుడికి తను పొరపాటుపడి మేక బదులు కుక్కని కొని తెచ్చుకొన్నానని రూఢి అయిపోయింది. మేకని వదిలేసి, దగ్గర్లో ఉన్న చెరువులో దిగి స్నానం చేసి, తడిబట్టలతోనే ఇంటికిపోయి పాప పరిహారం కోసం గాయత్రీమంత్రం జపించుకొంటూ కూర్చొన్నాడు.

దొంగలు మాత్రం నవ్వుకుంటూ, మేకను తీసుకెళ్ళి హాయిగా వండుకుని తినేశారు.

“అందువల్ల నమ్మినవాళ్ళనూ, అమాయకులనూ, మోసగించటం అంత కష్టంకాదు. హిరణ్యగర్భుడు అలాగే నావల్ల మోసపోయాడు కానీ, అతను చాలా బలవంతుడూ, బుద్ధిమంతుడూ, సమర్థుడూ అనటానికి సందేహం లేదు. అతని మంత్రి సర్వజ్ఞుడు కూడా అంతే” అన్నాడు మేఘవర్ణుడు.

"అవును, శత్రువుల మధ్య కొన్ని నిముషాలూ, గంటలూ ఉండటమే చాలాకష్టం. నువ్వు అన్ని రోజులు శత్రువుల మధ్య ఎలాగ ఉండగలిగావు, మేఘవర్ణా?” అని చిత్రవర్ణుడు మరో ప్రశ్నవేశాడు.

"కార్యార్థి అయిన సమర్థుడు ఎన్ని కష్టాలొచ్చినా, శత్రువుని తన నెత్తిన పెట్టుకొని మోసి కూడా, చివరికి తన పని సాధించుకొంటాడు. దీనికి దృష్టాంతంగా లోకంలో 'పాము కప్పలు' కథ చెప్తారు" అంటూ మేఘవర్ణుడు ఆ కథ చెప్పటం ప్రారంభించాడు.


కోతి - మొసలి

              కోతి - మొసలి


పశ్చిమదేశంలో సముద్రతీరాన ఉన్న ఒక అడవిలో ఓ కోతి, పేరు బలవర్ధనుడు. బలవర్ధనుడు ముసలివాడయి ఒంటి సత్తువ తగ్గిపోవటంతో, వాడి ఆస్తినంతా వాడి దాయాదులు దోచుకొని యింట్లోంచి వెళ్ళగొట్టారు. వాడు తపతి నది ఒడ్డునే ఉన్న ఒక మేడిచెట్టుమీద ఒంటరిగా కాలక్షేపం చేసేవాడు. ఓరోజు వాడు కోతి చేష్టగా మేడిపళ్లు కొన్ని కోసి ఒక్కొక్కటే చెట్టుమీంచి నదిలోకి విసరసాగాడు. అవి టప్పుటప్పుమంటూ నదిలో పడుతూంటే ఆ మోత వాడికి తమాషాగా అనిపించింది. ఆ శబ్దం విని ఆ నదిలో తిరుగుతున్న క్రకచుడు అనే మొసలి వచ్చి కోతి పడేసిన పళ్ళు అందుకొని తినసాగింది. ఆ రుచి దానికి బాగా నచ్చింది. క్రమంగా ఆ మొసలికీ, ముసలికోతికీ స్నేహం కుదిరింది.

రోజూ మేడిపళ్ళు తింటూ, కోతితో కబుర్లు చెబుతూ క్రకచుడు తన యింటికి వెళ్ళడం మానేసి, పెళ్లాం బిడ్డల్ని కూడా మర్చిపోయి ఆ మేడిచెట్టు దగ్గరే కాలం గడపడం మొదలెట్టాడు. నది అవతలి తీరంలో దూరంగా ఉన్న మొసలిభార్య, తన భర్త ఎన్నాళ్ళకూ కనబడకపోవటంతో భయంవేసి అతన్ని వెతుక్కురమ్మని మరొక మొసలిని పంపింది. అది వెళ్ళి క్రకచుడూ, బలవర్ధనుడూ కలిసి కబుర్లాడుకుంటూ, పళ్ళు తింటూ కాలం గడపడం చూసి, తిరిగి వచ్చి క్రకచుడి భార్యతో "మీ ఆయన నది అవతలి ఒడ్డున ఓ కోతిని కట్టుకొని హాయిగా కాపురం చేస్తున్నాడు. నీ సంగతి పూర్తిగా మర్చిపోయాడు" అని ఉన్నదానికి కాస్త చిలవలూ, పలవలూ చేర్చి చెప్పింది. క్రకచుడి భార్య ఏడుస్తూ కూర్చొంది.

క్రకచుడు అవతలి ఒడ్డునించీ మొసలి వచ్చి, తనని దూరం నించే గమనించి వెళ్ళడం చూశాడు. అది వెనక్కివెళ్ళి తన భార్యకు ఏమి చాడీలు చెప్తుందోనని భయపడి, బోలెడు మేడిపళ్ళు కానుకగా తీసుకొని భార్య దగ్గరికి వెళ్లాడు.

క్రకచుడి భార్య కళ్ళు మూసుకొని, రోగం వచ్చినట్లు నటిస్తూ, మూలుగుతూ పడుకొంది. నోటి మాటలేదు. చుట్టూ ఉన్న మొసలి ముత్తయిదువులు, క్రకచుడితో, “ఏమయ్యా పెద్దమనిషీ! భార్యని వదిలి అలా వెళ్ళిపోవడమేనా? నువ్వెళ్ళిన మర్నాటి నుంచీ నీ భార్య యిలా మాయదారి రోగంతో మంచమెక్కింది. మాట కూడా పడిపోయింది. మేమంతా ఎన్ని తిప్పలుపడి ఎన్ని మందులిప్పించినా రోగం లేదు. ఆమె బతకాలంటే ఒకటే మార్గం అని వైద్యులు చెబుతున్నారు. ఎక్కడయిన ఒక కోతి గుండెకాయ సంపాదించి, దాన్ని కోసి, పాలతో నాలుగు రోజులపాటు పుచ్చుకొంటే రోగం నయమవుతుందట. లేకపోతో ఈమె మరి బతకదు. ఎలాగయినా నీ భార్యను బతికించుకో!" అన్నారు.

క్రకచుడికి మతిపోయింది. అతనికి కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది? అది లేకపోతే భార్య ప్రాణాలు పోతాయంటున్నారు. ఏం చేసేటట్టు? ఆలోచించగా. ఆలోచించగా, అతనికి ఒకే ఉపాయం తోచింది. ఎలాగయినా బలవర్ధనుణ్ణి మోసం చేసి, తన యింటికి తెచ్చి, చంపి, అతని గుండెకాయతో భార్యకు వైద్యం చేయించాలని నిశ్చయించుకొన్నాడు. మిత్రద్రోహం చేసేందుకు అతనికి మనసొప్పలేదు కానీ మరో మార్గమేదీ కనిపించలేదు.

వెంటనే అవతలి ఒడ్డుకు వెళ్ళి బలవర్ధనుణ్ణి కలిశాడు. "ఇదేమిటి, మీ యింటికి వెళ్ళి కొన్ని రోజులు గడిపి వస్తానని వెళ్ళి, వెంటనే తిరిగొచ్చావేం?" అన్నాడు బలవర్ధనుడు.

క్రకచుడు నవ్వుతూనే అబద్ధం చెప్పాడు. "మిత్రమా, నువ్విచ్చిన పళ్ళు తీసుకెళ్ళి నా భార్యకిచ్చాను. అవి రుచి చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత మంచి పళ్ళు నీకెక్కడివి అంది. నేను నీ విషయం చెప్పాను. మనిద్దరి స్నేహం గురించి చెప్పాను. అంత మంచి స్నేహితుణ్ణి ఒంటరిగా ఎలా వదిలివచ్చావు? ఇప్పుడే వెళ్ళి అతన్ని మన యింటికి విందుకు తీసుకురా. లేకపోతే నేను నీతో మాట్లాడను అంటూ నన్ను పంపేసింది. నువ్వు నాతో వస్తేనే ఆమె నాతో మాట్లాడుతుంది. పద” అన్నాడు.

ఆమె అభిమానానికి బలవర్ధనుడు చాలా సంతోషించాడు. కానీ ఒకటే చిక్కు, “మీరు నీళ్ళలో ఉంటారు, నేను చెట్టుమీద ఉంటాను. ఈ నీళ్ళలో ఈదుకొంటూ నీ యింటికి రావటం నాకెలా వీలవుతుంది?" అన్నాడు.

"అది నేను ముందే ఆలోచించాను. మా యింటి పక్కనే ఓ దిబ్బ వుంది, దానిమీద పెద్ద చెట్లున్నాయి. నువ్వు వాటి మీద ఉండొచ్చు. ఇంక నదిలో ప్రయాణం మాటంటావా? నువ్వు నావీపు మీద ఎక్కు ఏ ప్రమాదం లేకుండా నేను తీసుకెళ్తాను” అంటూ తొందరపెట్టి క్రకచుడు కోతిని వీపుమీద ఎక్కించుకొని తన యింటి వైపుకు ఈదసాగాడు.

అయితే క్రకచుడికి మనసులో మిత్రద్రోహం చేస్తున్నాననే బాధ ఉండిపోయింది. ఎప్పటిలా కబుర్లు చెప్పలేక, మౌనంగా ప్రయాణం సాగించాడు. బలవర్ధనుడు "ఏమిటి మిత్రమా, ఇవాళ అదోలా ఉన్నావు. ఇంటిదగ్గర అందరూ క్షేమంగా లేరా?" అని అడిగాడు.

"ఫరవాలేదు, కానీ నీ చెల్లెలు, అదే నా భార్యకు కొంచెం సుస్తీ చేసింది” అన్నాడు క్రకచుడు.

"అంత చిన్న విషయానికి, యింతలా మనసు పాడు చేసుకోవటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ధైర్యంగా ఉండు” అన్నాడు బలవర్ధనుడు.

“మరీ చిన్నజబ్బు కాదు, ఒక పాళన తగ్గేట్టు లేదు”

"అయితే మరి మంచి వైద్యం చేయించావా? వైద్యుడేమంటాడు?”

"బతకటం కష్టం అంటున్నాడు. ఆమె మాత్రం యమయాతన పడుతున్నది" అన్నాడు క్రకచుడు. బలవర్ధనుడు నిర్ఘాంతపోయాడు.

"అలాంటి పరిస్థితిలో యిప్పుడు నాకు విందేమిటి? నీకు మతిగానీ పోయిందా?” అన్నాడు. క్రకచుడు చావు కబురు చల్లగా చెప్పాడు. "మిత్రమా నేను నిన్ను తీసుకెళుతున్నది విందు కోసం కాదు. వైద్యానికి కోతి గుండెకాయ కావాలన్నారు. ..దానికోసం!"

బలవర్ధనుడికి గుండె ఆగినంత పనయింది. క్రకచుడి మోసం అర్ధమయింది. అయితే తెలివయినవాడు కనుక, వెంటనే మంచి ఉపాయం ఆలోచించుకోగలిగాడు.

"అయ్యో, క్రకచా! ఆ మాట నాకు ముందు చెప్పద్దా? నీకు నా గుండెకాయ కావాలని నాకేం తెలుసు? వెళ్తున్నది. విందుకే గదా! బరువెందుకని నేను నా గుండెకాయ మన మేడిచెట్టుకు తగిలించి వచ్చాను. మిత్రుడి దగ్గిర యిలా విషయం దాచకూడదు. పోనీలే, అయిందేదో అయింది, వెనక్కెళ్ళి గుండెకాయ తీసుకొచ్చుకుందాం పద" అన్నాడు.

క్రకచుడు వెనక్కి తిరిగి మళ్ళీ ఒడ్డుదాకా వచ్చాడు. బలవర్ధనుడు చటుక్కున అతని వీపుమీదినుంచీ దూకి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్నాడు. "నీచుడా! యింక నువ్వు పోవచ్చు. నీతో నేస్తం కట్టిన నేరానికి నా ప్రాణాలే తీద్దామనుకొన్నావు. నీలాంటి తుచ్చుడితో స్నేహం చేసి పెద్ద పొరపాటు చేశాను. అదృష్టం బాగుండి బయటపడ్డాను. నేటితో మన స్నేహం ఖతం. ఇక్కణ్ణించి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడూ రాకు" అని క్రకచుణ్ణి తిట్టి పంపేశాడు. పంపే ముందు, తనను చంపబోయిన నక్కను మోసగించి తప్పించుకొన్న తాబేలు కథొకటి చెప్పి పంపాడు.

బ్రాహ్మణుడు - దొంగలు

      ‌ బ్రాహ్మణుడు - దొంగలు


ఓ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతను అమాయకుడు. అతనికి యజ్ఞం చేసుకొనేందుకు ఒక నల్లమేక కావల్సి వచ్చింది. తిరిగి, తిరిగి నాలుగు డబ్బులు పోగు చేసుకుని, పక్క ఊరి సంతలో అమ్మకానికి వచ్చిన నల్లమేకను కొనుక్కొన్నాడు. దాని మెడకో తాడు కట్టి, ఆ తాడు సహాయంతో దాన్ని తన ఊరుకు నడిపించుకుపోతున్నాడు.

దోవలో ఓ చెరువు దగ్గర కొందరు దొంగలు కూర్చొని ఉన్నారు. నిగనిగలాడే నల్లమేకని చూసి వాళ్ళకు నోరూరింది. "ఆహా! ఏం బాగా బలిసిందీ మేక! ఇలాంటిది డబ్బిచ్చి కొందామన్నా అంత తేలిగ్గా దొరకదు. దొరికితే, మజాగా, వారం రోజులపాటు మేకమాంసం తినొచ్చు. ఈ మేకని మనం దొంగిలించి తీసుకెళ్తే ఎలా ఉంటుంది?" అన్నాడు ఆ దుర్మార్గుల్లో ఒకడు.

“ఎలా దొంగిలిస్తావు పట్టపగలు? పైగా ఆ బ్రాహ్మడు. పిశాచం లాగా, జాగ్రత్తగా తాడు కట్టి లాక్కెడుతున్న మేకను విడిపించటమెలా? మనం ఏదయినా పిచ్చివేషం వేస్తే, రాజభటులు మనల్ని పట్టుకు లాక్కెళ్ళి చావగొట్టి, జైల్లో పెడతారు" అన్నాడు మరొకడు.

వాళ్ళలో ఒక ముసలిదొంగ ఉన్నాడు “దేనికయినా అనుభవం కావాలి, నేను తల్చుకొంటే అయిదు నిమిషాల్లో ఆ బ్రాహ్మణ్ణి మోసంచేసి ఆ మేకను తీసుకురాగలను. దొంగిలించాల్సిన పని కూడా లేదు. వంచించడం ఒక కళ. కోతి-మొసలి కథలో కోతి, మొసల్ని ఎలా వంచించిందో తెలుసు కదా? తెలియదా, అయితే వినండి, చెప్తాను" అంటూ ఓ కథ చెప్పాడు.

గాలిమేడలు

               గాలిమేడలు

అయోధ్యానగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణు డుండేవాడు. అతను పౌరోహిత్యం చేసేవాడు. ఓరోజు ఎవరింటికో శ్రాద్దకర్మ చేయించటానికి వెళితే అక్కడ ఒక కుండెడు పేలపిండి అతనికి దానంగా లభించింది. ఆ యింట్లోనే మంచి పద్రషోపేతంగా భోజనం దొరికింది. భోజనం చేసి, కుండ చంకన పెట్టుకొని తనింటి దోవ పట్టాడు. భుక్తాయాసం వల్ల నడవలేక దోవలో ఒక యింటి అరుగు మీద కూలబడ్డాడు. తన అంగ వస్త్రాన్ని చుట్టకుదురుగా చేసి దానిమీద కుండను భద్రంగా ఉంచాడు. కుడిచేత్తో ఒక కర్ర పెట్టుకొన్నాడు, కుండనెవరయినా ఎత్తుకుపోవటానికి వస్తే బెదిరించేందుకు. ఎడమచేయి తలకింద దిండుగా పెట్టుకొని ఆ యింటి అరుగుమీదే నిద్రలోకి జారుకున్నాడు. ఆ యిల్లు ఒక కుమ్మరిది. ఆ కుమ్మరి తను తయారు చేసిన కుండలు అదే అరుగు మీద ఒక మూల పేర్చుకొన్నాడు. వాటికి పక్కగా దేవశర్మ పడుకొన్నాడు.

నిద్రలోకి జారుతుండగా అతనికి బోలెడు ఆలోచనలు! "ఈ పిండిని బాగా ధరలు పెరిగిన సమయంలో అమ్మి ఆ డబ్బుతో ఓ మేకపిల్లను కొనాలి. కొన్నేళ్ళకది పిల్లలు పెడుతుంది. మరి కొన్నేళ్ళకు ఆ పిల్లలు కూడా పిల్లల్ని పెడతాయి. ఇలా కొంతకాలానికి నా దగ్గర కొన్ని వందల మేకలు చేరతాయి. వాటినన్నిటినీ అమ్మేసి ఓ వంద మంచి అవులని కొంటాను. మెల్లిమెల్లిగా ఆ నూరు ఆవులు పెద్దమందగా వృద్ధి పొందుతాయి. బాగా కొని వ్యవసాయం చేస్తాను. కొన్ని సంవత్సరాలలో నేను కోటీశ్వరుణ్ణవుతాను. అప్పుడు ఊళ్ళో ధనవంతులంతా 'మేము పిల్లనిస్తాం, మేము పిల్లనిస్తాం' అంటూ నా చుట్టూ తిరుగుతారు. మంచి అందగత్తెనూ, గుణవంతురాల్నీ చూసి మాకు మన్మథుడి లాంటి అందమైన కొడుకు పుడతాడు. వాడికి 'సోమశర్మ' అని మా నాన్న పేరే పెడతాను. వాడు యిల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తుంటాడు. నా భార్య వాడిని పట్టుకోకుండా, యితర పనుల్లో మునిగిఉంటుంది. నాకు కోపం వచ్చి ఈ చేతికర్రతో నాలుగు తగిలిస్తాను" అని అలా కల కంటూనే తన కుడిచేతిలో పట్టుకొన్న కర్రతో తన పిండికుండను కొట్టాడు. అది బద్దలయిపోయి, పిండి మట్టిపాలయింది. కర్ర దెబ్బలు అరుగుమీద కుమ్మరి పేర్చుకొన్న కుండలకు కూడా తగిలి వాటిలో కూడా కొన్ని కుండలు పగిలిపోయాయి.

ఆ చప్పుడుకు లోపలినుంచీ కుమ్మరివాడు వచ్చి, కుండలు పగలగొట్టిన, బ్రాహ్మణ్ణి లేపి తిట్టి, కొట్టీ అక్కణ్ణించి గెంటేశాడు.

కనక, ముందెప్పుడో జరగబోయే వాటి గురించి పగటి

కలలు కంటూ కూర్చొంటే, ఇప్పుడు చేసుకోవాల్సిన పనులు

చెడగొట్టుకుంటాం, అన్నాడు దీర్ఘదర్శి,

రాజు దీర్ఘదర్శి మాట కాదనటానికి సందేహించాడు. మునుపొకసారి అలాచేసి భంగపడ్డాడు కదా! "మంత్రీ! నువ్వు చెప్పింది బాగానే ఉంది. మేఘవర్ణుడిని కర్పూరద్వీప రాజ్యానికి రాజుగా చేసే ఆలోచన విరమించుకొందాం. కానీ కర్పూరద్వీపం పరిపాలించేందుకు సరయినవాళ్ళు మన వాళ్ళలో ఎవరున్నారో నువ్వే చెప్పు" అన్నాడు.

“రాజా, మనం హిరణ్యగర్భుడిని నిజంగా మన బలంతో గెలవలేదు. అతన్ని మోసం చేసి గెలిచాం. అతను చాలా బలవంతుడు. అతని ప్రజలు అతనికోసం ప్రాణాలిస్తారు. తాత్కాలికంగా, యుద్ధంలో ఒక్కసారి ఓడినంత మాత్రాన అతను. చేతులకు గాజులు తొడుక్కుని ఊరితే కూర్చోడు. మళ్ళీ బలం కూడగట్టుకొని, సైన్యాన్ని పెంచుకొని, నేడో రేపో అవకాశం చూసి మనమీద దాడిచేసి, తన రాజ్యం తను గెలుచుకొనే ప్రయత్నం ఈసారి మన మోసాలేవీ పనిచెయ్యకపోవచ్చు. హిరణ్యగర్భుడి మంత్రి సామాన్యుడు కాదు, గొప్ప సమర్ధుడు. క్రితంసారి రాజుకూ, మంత్రికీ కలిగిన అభిప్రాయభేదాల వల్ల వాళ్ళు ఓడిపోయారు. కానీ, ఈసారి ద్దరూ ఒక తాటిమీద నడిచి, మనతో యుద్ధానికి వస్తే మనం గెలవటం చాలాకష్టం. రాబోతున్నది వర్షాకాలం. నీటిపక్షులు కాబట్టి వాళ్ళకు వానాకాలం యుద్ధానికి అనుకూలం.

నేలపక్షులం గాబట్టి మనకు ప్రతికూలం. మళ్ళీ యుద్ధంచేసి, నానాకష్టాలు, నష్టాలూ పడటం కంటే, ఎలాగూ మనం ఓసారి గెలిచిన కీర్తి సంపాదించుకొన్నాం కాబట్టి హిరణ్యగర్భుడితో యిక సంధి చేసుకొని అతని రాజ్యం అతనికే అప్పజెప్పటం మంచిది. లేకపోతే, ఆ రాజు తన మంత్రి సహాయంతో మనమీదికి మళ్లీ యుద్ధానికి రావటం ఖాయం. ఈసారి, మన మోసాలు పనిచేయకపోతే, వాళ్ళు నిజానికి మనకంటే బలవంతులు కాబట్టి మనల్ని ఓడించవచ్చు. అంచేత వాళ్ళతో ముందే సంధి చేసుకొని, స్నేహంగా మసలుకోవటమే నయం” అన్నాడు మంత్రి.

రాజుకు యివి పిరికిమాటలుగా తోచాయి. ఇంక ఆగలేకపోయాడు.

"మంత్రీ! నువ్వు చెప్పేది లోకవిరుద్ధంగా ఉంది. ఏదేదో ఊహించుకొని, భయపడి, గెలుచుకొన్న రాజ్యాన్ని మళ్ళీ శత్రువు చేతిలో ఎలా పెడతాం? యుద్ధంలో ఓడి, పారిపోయి, కొన ఊపిరితో ఎలాగో, ఎక్కడో బతుకుతున్న హిరణ్యగర్భుడు నన్నేం చేస్తాడు? నామీద యింకేం యుద్ధం చేస్తాడు? వాడి పని అయిపోయింది. గెలుచుకొన్న రాజ్యం వదలిపెట్టే ప్రశ్నే లేదు. ఇంక నువ్వు ఈ విషయం మాట్లాడొద్దు" అంటూ కోపంగా వెళ్లిపోయాడు.

"ఈ సమాచారాలన్నీ మీకు చెప్పటానికి నేను తిరిగివచ్చాను” అని ముగించాడు ధవళాంగుడు.

రాజు హిరణ్యగర్భుడూ, మంత్రి సర్వజ్ఞుడూ అతన్ని పంపేసి మళ్ళీ ఆలోచనల్లో పడ్డారు.

మంత్రి, “రాజా! ఇప్పటికే మనం యుద్ధంలో బాగా దెబ్బతిని ఉన్నాం. మనం ఒంటరిగా మరోసారి యుద్ధం చేయగల పరిస్థితిలో లేము. ఇలాంటి పరిస్థితిలో మనం ఎవరయినా బలవంతుడైన రాజుతో స్నేహం పెంచుకొంటే అతని సహాయంతో శత్రువును దెబ్బతీయవచ్చు. ఏనుగు ఊబిలో ఇరుక్కుంటే, దాన్ని ఆ ఊబిలోంచి బయటికి లాగేందుకు మరో బలవంతమయిన ఏనుగు సహాయం కావాలి. సింహళరాజు మహాబలుడి సహాయం మనం కోరవచ్చు. అతను మనతో చాలాకాలం నుండి స్నేహంగా ఉన్నాడు. మనం వెంటనే అతని సహాయం కోరుతూ, అతని దగ్గరికి దూతను పంపుదాం". అన్నాడు. దీనికి రాజు సమ్మతించాడు.

ఓ ఉత్తరం రాసి, దూతద్వారా, సింహళరాజు మహాబలుడికి పంపారు.

ఇక్కడ ఇలా జరుగుతుండగా, అక్కడ చిత్రవర్ణుడు ఒకనాడు తన కొలువులో సన్నిహితులతో మాట్లాడుతూ, “మేఘవర్ణా, నువ్వు చాలారోజులు కర్పూరద్వీపంలో ఉండొచ్చావు కదా, అక్కడి రాజు గురించీ, మంత్రి గురించీ నీ అభిప్రాయమేమిటి?” అని అడిగాడు.

“ఆ రాజు మహానుభావుడు, సజ్జనుడు, సత్యసంధుడు. అతని మంత్రి చాల సమర్థుడు, అనుభవజ్ఞుడు" అన్నాడు. మేఘవర్ణుడు.

"అంత సమర్థుడు కావటం వల్లనేనా నీ చేతిలో అంత

తేలిగ్గా మోసపోయాడు?” అన్నాడు రాజు హేళనగా.

“వాళ్ళు నన్ను నమ్మారు. నేను వాళ్ళను మోసగించాను. మనల్ని పూర్తిగా నమ్మినవాళ్ళను వంచించటం కష్టం కాదు. నమ్మి నా ఒళ్ళో తలపెట్టుకు పడుకొన్న స్నేహితుడిని, కత్తితో పొడిచి చంపడం కష్టం కాదు. చంపినవాడు బలవంతుడు కానక్కరలేదు, చచ్చినవాడు బలహీనుడూ, అసమర్థుడూ అనటానికి లేదు. పూర్వం ఒక అమాయకపు బ్రాహ్మణి, దొంగలు వంచించిన కథ మీకు గుర్తుందో, లేదో, చెప్తాను వినండి”.

పిల్లి తీర్పు

                పిల్లి తీర్పు

వింధ్యపర్వతం మీద ఒక చెట్టు తొర్రలో కపింజలం అనే ఓ పక్షి కాపురం ఉంటూ ఉండేది. ఓరోజు సాయంత్రం తిండి వెతుక్కొంటూ వెళ్ళిన పక్షి గూటికి చేరకముందే కుండపోతగా వానపడింది. పక్షి బాగా తడిసిపోయింది. మామూలు వేళకు గూటికి చేరలేకపోయింది.

చెట్టు తొర్ర ఖాళీగా ఉండటంతో, దీర్ఘకర్ణుడనే ఒక కుందేలు వాననించీ తప్పించుకొనేందుకు ఆ చెట్టు తొర్రలో దూరి, అక్కడ వెచ్చగా ఉండటంతో హాయిగా పడుకొంది.

బాగా తడిసిపోయి, ఆలస్యంగా, చిమ్మచీకట్లో గూడు చేరుకొన్నది కపింజలం. తన తొర్రలో హాయిగా పడుకొని ఉన్న కుందేల్ని చూసింది. దానికి పిచ్చికోపం వచ్చింది. కుందేల్ని కుదిపి లేపేసింది. "ఏమిటిది? ఇదేమన్నా నీ తాతగారిల్లనుకొన్నావా, తేరగా వచ్చి యిక్కడ పడుకొన్నావు.. పో ఇక్కణ్ణించి, లేకపోతే చంపేస్తాను" అని అరిచింది.

"ఏడిశావ్, నీ బెదిరింపులు కట్టిపెట్టు. ఈ చెట్టు నీ తాత సొమ్ము కూడా కాదులే. బావులూ, చెరువులూ, చెట్టుతొర్రలూ ఎవరు ముందు ఆక్రమించుకుంటే వాళ్ళకే చెందుతాయి. నేనికృర్ణించి కదిలేది లేదు. నీకు దిక్కున్నచోట చెప్పుకో, ఫో!" అంది కుందేలు,

"సరే, ఈ చీకట్లో ఎక్కడికీ పోలేము. తెల్లారనీ మన తగవు తీర్చుకొందాం" అని పక్షి తెల్లారేదాకా ఎలాగో కాలక్షేపం చేసి, తెల్లారగానే కుందేలును లేపింది. "పద, మన తగవు తీర్చుకొందాం!" అంది.

"ఎవరు తీరుస్తారు ఈ తగవు?" అంది కుందేలు. 'నర్మదా నది ఒడ్డున దధి కర్ణుడనే ముసలి పిల్లి ఉంది. దానికున్న వ్యవహార జ్ఞానం, అనుభవం ఎవరికీ లేవు. అదే చెప్తుంది ధర్మమైన తీర్పు. అక్కడికి పోదాం" అంది పక్షి.

పక్షి, కుందేలూ కలిసి పిల్లి దగ్గరికి వెళ్ళాయి. "చెట్టుతొర్ర ఎవరిది అన్న విషయంలో మా యిద్దరికీ తగాదా వచ్చింది. నువ్వు తీరుస్తావని వచ్చాం" అని చెప్పాయి.

వాళ్ళు అనుకొన్నట్టు పిల్లిది ధర్మబుద్ధి కాదు. అది ఎలాగో వాటి రెండింటినీ చంపి, తినాలని ఒక పథకం వేసింది.

"నేను ముసలిదాన్ని, నాకు చెముడు. మీరు చెప్పేది. సరిగా వినబడటం లేదు. మీరిద్దరూ నాకు బాగా దగ్గిరగా వచ్చి, నా చెవులో బిగ్గరగా చెపితే తప్పా మీ తగాదా ఏమిటో నాకు అర్ధం కాదు. నాకు అవతల చాలా పనులు కూడా ఉన్నాయి. అందుచేత గబగబా వచ్చి, మీ గొడవేమిటో చెప్పండి" అంది.

పక్షి, కుందేలు చకచకా వెళ్ళి పిల్లి రెండు పక్కలా కూర్చొని, దాని చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడ బోయాయి. పిల్లి ఆ రెంటినీ చటుక్కున తన కాళ్ళతో పట్టేసుకొని మెడలు కొరికి చంపేసింది. ఆ తర్వాత రెండు మూడు రోజులు ఆహారం వెతుక్కొనే శ్రమ లేకుండా, వాటిని తృప్తిగా తినేసింది.

"అలాగే ఈ మేఘవర్ణుడికి కూడా అర్హతకు మించి సత్కారం చేస్తే, మనకే కీడు జరగవచ్చు" అన్నాడు దూరదర్శి.

చిత్రవర్ణుడు, యిదంతా విని, "మంత్రీ! నువ్వు చెప్పినట్టే చేద్దాంలే. మేఘవర్ణుడికి మరో బహుమానం ఏదన్నా ఇద్దాం. కానీ దానికి ముందొక పనిచేద్దాం. కర్పూరద్వీపానికి మేఘవర్ణుణ్ణి మరోసారి పంపుదాం. అక్కడి అపూర్వమయిన - వస్తువులు ఇక్కడికి తెప్పించుకొందాం. వాటిలో కొన్ని ఏరి, అవే అతనికి బహుమానంగా యిద్దాం. మిగిలినవాటిలో కొన్ని మన యితర సేవకులకి బహుమతి యిద్దాం. అన్నిటికంటే మంచివి మాత్రం మనం అట్టిపెట్టుకొని, ఆనక రెండు రాజ్యాలూ హాయిగా పరిపాలించుకొందాం” అన్నాడు.

మంత్రి చిరునవ్వు నవ్వాడు. "రాజా, జరగబోయే వాటి గురించి, మరీ అంత రంగులకలలు కనటం మంచిది కాదంటారు. పెద్దలు. దానికి దృష్టాంతంగా కుండలు పగలగొట్టుకున్న వెర్రి బ్రాహ్మడి కథ చెప్తారు. అది వినండి చెప్తాను" అని వెర్రి బ్రాహ్మడి కథ చెప్పుకొచ్చాడు.

పాము - వర్తకుడు

             పాము - వర్తకుడు


హిమాలయ పర్వతాల ప్రాంతంలో ఒకప్పుడు ఒక వర్తకుడు కాలినడకన తన ఊరినించీ పక్కఊరికి వ్యాపారం పనిమీద నడుస్తున్నాడు. దోవలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఆరోజు పెద్ద దావాగ్ని బయల్దేరి, దానివల్ల అడవిలో చెట్లు కాలిపోతున్నయ్. వ్యాపారి వెళుతున్న దోవలో ఒక చెట్ల పొద తగలబడుతూ కనిపించింది. పొద మధ్యలో ఒక పాము ఇరుక్కుపోయి ఉంది. మంటలు తప్పించుకొని బయటపడటానికి దానికే మార్గమూ కనిపించలేదు.

ఆ దోవన వెళుతున్న వ్యాపారిని చూసి, కేకపెట్టింది : “ఓ సజ్జనుడా, నా ప్రాణాలు దక్కించటానికి దేవుడిలాగా వచ్చావు. ఎలాగయినా నన్ను ఈ మంటల్లోంచి. బయటపడెయ్యవా?” అని దీనంగా బ్రతిమాలింది.

పాపం ఎంత పామయినా అలా మంటల్లోపడి కాలిపోతూ, ప్రాణభయంతో వణుకుతూ, బతిమాలే సరికి వర్తకుడికి జాలివేసింది. అతని చేతిలో పొడుగుపాటి చేతికర్ర వుంది. దానికొక చివర ఒక తాడుగట్టి, తాడు రెండోకొనకు ఒక సంచీ కట్టాడు. నేర్పుగా ఆ సంచీని పొదమధ్యకు అందించాడు. పాము సంచీలో దూరంగానే, కర్రతో సంచీని మంటలు ఇవతలి పక్కకి లాగేసి, పామును రక్షించాడు.

పాము చాలా ప్రమాదకరమయిన జంతువు కదా! సంచీలో దాన్ని తీసుకెళ్ళి త్రోవ పక్కగా వదిలేసి 'ఇక నీ దారిన నువ్వు పో!' అన్నాడు.

“నేనెక్కడికి పోతాను? పాము కనిపిస్తే చాలు మనుషులు దాన్ని కొట్టి చంపుతారు. అలాంటి మనిషి జాతివాడివి నువ్వు నాకు దొరికావు. నిన్ను చంపకుండా వదిలితే మా కులానికే ద్రోహం. అందుకే నిన్ను నేను వదలను” అంటూ అతని మీదికి వచ్చింది.

భయంతో పరిగెత్తసాగాడు వర్తకుడు. కానీ పాము కంటే వేగంగా ఎలా పరుగెత్తుతాడు? అతని అదృష్టం కొద్దీ, అక్కడే ఒక నక్క కనిపించింది. నక్క పాముకూ, మనిషికీ మధ్య నిలబడి 'విషయం ఏమిటి?' అని అడిగింది. పాము జరిగినదంతా చెప్పి, మనిషిని చంపటం కోసం అతని వెనకబడ్డానని చెప్పింది. పాము బుద్ధీ, కృతఘ్నత నక్కకు తెలిసిపోయింది. ఎలాగయినా దానికి పాఠం నేర్పాలనుకొంది.

అందువల్ల ఏమీ తెలియనట్లు నటించింది. “ఎలా, ఎలా? నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. వర్తకుడు విసిరిన సంచీలో దూరి, మంటల్లోంచి బయటపడ్డానంటున్నావు. నువ్వు ఇంత పెద్ద ఆరడుగుల పామువి. ఈ చిన్నసంచీలో ఎలా పడతావు? నాకు నమ్మశక్యంగా లేదు!" అంది.

"తెలివిగా సంచీలో దూరి, చుట్టగా పడుకొంటే నేను సంచీలో పట్టేస్తాను. కావాలంటే నీకు మళ్ళీ చూపిస్తాను చూడు” అంటూ పాము మళ్ళీ ఒకసారి సంచీలోకి దూరింది. వెంటనే నక్క వర్తకుడికి సైగ చేసింది, సంచీ మూతి బిగించి తాడుతో కట్టేయమని. అతను అదే చేశాడు. పాము సంచీలో చిక్కిపోయింది.

ఈసారి వర్తకుడు పామును వదల్లేదు. తన చేతిలో కర్రతో సంచీని మోది, మోది పామును చంపేశాడు. తన ప్రాణం కాపాడిన నక్కకు ధన్యవాదాలు చెప్పి తన దోవన తను వెళ్ళాడు.

“కనుక అల్పులకు పెద్ద ఉపకారం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి” అంటూ దూరదర్శి మరో కథ కూడా చెప్పాడు.

ఓటమికి కారణం

             ఓటమికి కారణం

యుద్ధం అయిపోయి చిత్రవర్ణుడు తన జంబూద్వీపానికి, మిగిలి ఉన్న కొద్దిమంది పరివారంతో చేరి తన పాలన సాగించాడు. ఇటు కర్పూరద్వీపంలో హిరణ్యగర్భుడూ, మంత్రి సర్వజ్ఞుడూ, యుద్ధంలో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకొన్న కొద్దిమంది సైనికులూ ఒక చోట చేరారు.

ఒకరోజు హిరణ్యగర్భుడు తన మంత్రితో యిలా అన్నాడు. "సర్వజ్ఞ! యుద్ధంలో మనవాళ్ళనంతమందిని చంపుకొని, ఘోరంగా ఓడిపోయాం. అసలు యింతకీ మన కోటలో నిప్పుపెట్టి మనమంత తేలిగ్గా ఓడిపోయేట్లు చేసిన పాపాత్ముడెవడయి ఉంటాడో? నీ ఊహ ఏమిటి?”

జవాబిచ్చాడు సర్వజ్ఞుడు : "మహారాజా! కొన్నాళ్ళపాటు నీతో అంత సన్నిహితంగా ఉన్న నీ మిత్రుడు నీలవర్ణుడు, యుద్ధం అయిపోయిన తర్వాత కనబడడమే లేదు, చూశారా? నాకయితే వాడే మన కోటకు నిప్పు పెట్టాడని అనుమానం. నువ్వు వాణ్ణి పూర్తిగా నమ్మినందుకు ఫలం యిప్పుడు మనం అనుభవిస్తున్నాం”.

రాజు, “ఇదంతా మన దురదృష్టం. దేవుడు మనకు ప్రతికూలమయితే, మనం ఏం చేయగలం? మన ప్రయత్నం ఏదీ ఫలించదు కదా!” అన్నాడు.

"రాజా, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టుకొంటాం, కానీ ఇది మనం స్వయంగా తెచ్చిపెట్టుకొన్న దురవస్థ. మాలాంటి మంత్రులు ఎంతమంది, ఎన్నిసార్లు, ఎన్ని విధాలా చెప్పినా అప్పుడు నువ్వు వినలేదు. దానికిప్పుడు దేవుణ్ణి నిందించటమెందుకు? రానున్న అపాయాలు ముందే ఆలోచించి జాగ్రత్తపడే జాగ్రత్త పరులు సుఖపడతారు. ఏది జరిగితే అది జరుగుతుంది, దేవుడి దయ ఉంటే తప్పించుకొంటాం అనుకొన్న వాడు ఎప్పుడూ అదృష్టం మీద ఆధారపడాల్సిందే. అలాంటివాడు చెడు జరిగితే దేవుణ్ణి నిందిస్తాడు, తనను తను నిందించుకోకుండా”,

ఇలా సర్వజ్ఞుడు చెప్తుండగా, జంబూద్వీపానికి గూఢచారిగా వెళ్లి తిరిగొచ్చిన ధవళాంగుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. "రాజా, కోటను సరిగా రక్షించుకోవాలని నేను చాలాసార్లు చెప్పినా, అలా జరగలేదు. మన కోట తగలబెట్టింది. మరెవరో కాదు మీ స్నేహితుడు నీలవర్ణుడే. వాడి అసలు పేరు మేఘవర్ణుడు, చిత్రవర్ణుడు పంపగా గూఢచారిగా మీ దగ్గరికి వచ్చాడు. మనం యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, మేఘవర్ణుడు తనరాజు దగ్గరికి వెళ్ళాడు. చిత్రవర్ణుడు అతన్ని సంతోషంతో కావలించుకొని, బహుమానాలిచ్చి సత్కరించాడు. 'కేవలం ఈ మేఘవర్ణుడి సహాయం వల్లనే మనం గెలిచాం. కాబట్టి మనం గెలిచిన కర్పూరద్వీపానికి, ఇతనినే రాజుగా పట్టాభిషేకం చేయాలనుకొంటున్నాను' అన్నాడు తన మంత్రితో. మంత్రి దూరదర్శి అలా చేయవద్దని సలహా యిచ్చాడు. 'ఇతను చేసిన మేలుకు తగ్గ మరేదయినా గొప్ప బహుమానం ఇవ్వండి. కాళ్ళకు వేసుకొనే చెప్పులు నెత్తిమీద పెట్టుకొంటే నలుగురూ నవ్వుతారు. ఎవరికివ్వాల్సిన బహుమతి వాళ్ళకిస్తే బాగుంటుంది. లేకపోతే అల్పులయిన వాళ్ళు మేలు చేసినవాళ్ళకే కీడు చేసే ప్రమాదం ఉంది. పాము-వ్యాపారి కథ మీకు గుర్తుందో లేదో మరోసారి చెప్తాను వినండి' అంటూ కథ అందుకొన్నాడు.

సంధి

                    సంధి

మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం కథలు చాలా ఆసక్తితో విన్నారు రాజకుమారులు. “గురువుగారూ, మీరు చెప్పిన మూడు కథలూ చాలా బావున్నాయి. 'సంధి' అని నాలుగో కథ కూడా ఉందన్నారు. అది కూడా చెప్పరా?” అన్నారు. విష్ణుశర్మ వాళ్ళకు 'సంధి' కథ కూడా చెప్పాడు.

విగ్రహం కథలో కర్పూరద్వీపంలో నీటిపక్షుల హంసరాజు హిరణ్యగర్భుడికీ, ఎక్కడో జంబూద్వీపంలో నేలపక్షుల నెమలిరాజు. చిత్రవర్ణుడికీ ఉత్తపుణ్యానికి జరిగిన భయంకరమయిన యుద్ధం గురించి చెప్పుకొన్నాం. రెండు పక్షాలలోనూ ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఎన్నో పిట్టలు చచ్చిపోయాయి. ఓ పక్కన హిరణ్యగర్భుడూ, యుద్ధంలో ఓడిపోయి, అటూయిటూ పారిపోయిన అతని సైనికులు కొందరూ మిగిలారు. మరో పక్కన చిత్రవర్ణుడూ అతని పక్షాన చచ్చినవారు చావగా మిగిలిన సైనికులూ ఉండిపోయారు. కొంతకాలం గడిచిన తర్వాత, ఈ రెండు పక్షాలకూ సంధి కుదిరి మళ్ళీ స్నేహితులయ్యారు. ఇప్పుడు చెప్పబోయే కథంతా ఆ సంధి గురించి.

యుద్ధ పర్వం

                యుద్ధ పర్వం

యుద్ధం మొదలయింది. భయంకరంగా సాగింది. నడిచి నడిచి అలసిపోయి ఉన్న చిత్రవరుడి సేనని, హిరణ్యగర్భుడి సైనికులు చీల్చి చెండాడారు. రక్తం వరదలుగా పారింది. మొదట్లోనే చిత్రవర్ణుడి పక్షాన్ని కర్పూరద్వీప సైనికులు బాగా దెబ్బ తీశారు. చచ్చిపడిన తన సైనికులను చూసి చిత్రవర్ణుడు చాలా బాధపడ్డాడు, నిరుత్సాహపడ్డాడు.

అప్పటివరకూ యుద్ధం విషయంలో తలదూర్చకుండా, పట్టించుకోకుండా అలిగి, దూరంగా కూర్చొన్న తన మంత్రి దీర్ఘదర్శిని పిలిపించాడు. "మంత్రీ! మన సేన యిలా పాతమయిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకోవటం భావ్యంకాదు. ముందే నువ్వు చెప్పిన మంచి సలహా విననందుకు ఫలితం ఇవాళ నేను అనుభవిస్తూనే వున్నాను. ఏదేమయినా, ఈ సైనికులు మనవాళ్ళు, మనిద్దరం ఒక చెట్టుకు పుట్టినవాళ్ళం. నేను నీ మాట వినక, నిన్ను నిందించి పనికిమాలిన మంత్రివని తిట్టి అవమానించాను, నిజమే. అది నా పొరపాటే, నన్ను క్షమించి, నా పొరపాటు మర్చిపో. యుద్ధంలో నీ సహాయం లేకపోతే, మన సైన్యమంతా నాశనమయిపోతుంది. మనం ఓడిపోయి, వెనక్కి తిరిగి మన వింధ్య పర్వతానికి పారిపోవాల్సిందే. వచ్చి మన సేనకు నాయకుడివిగా ఉండి దాన్ని గెలిపించు" అని బ్రతిమాలాడు.

రాజు స్వయంగా అంత దీనంగా బతిమాలడంతో దీర్ఘదర్శి కోపం పోయింది. "రాజా, దిగులుపడకు. జరిగిన నష్టం గురించి నిరుత్సాహపడొద్దు. ఈ మిగిలిన సైన్యంతోనే మనం గెలుస్తాం. చూస్తూ ఉండు. ఇలాంటి యుద్ధాలు యింతకు ముందు మనం ఎన్నో గెలిచాం. యిప్పుడూ గెలుస్తాం. నాశక్తీ, నీశక్తి, మన సైనికుల శక్తి తక్కువగా అంచనా వేయకు!" అని ధైర్యం చెప్పి తనూ రంగంలోకి దిగాడు. శత్రువుల కోట ముట్టడించడానికి సైన్యాన్ని సిద్ధం చేయటం మొదలెట్టాడు.

ఈ విషయం హిరణ్యగర్భుడికి తన గూఢచారి ధవళాంగుడి ద్వారా తెలిసింది. తన మంత్రిని తను పిలిచి, "సర్వక్షా! ఇప్పుడేం చేద్దాం?" అని సలహా అడిగాడు.

"భయంలేదు రాజా! మన సైనికుల్లో మహావీరుల్నందర్నీ పిలిచి, మీరు స్వయంగా వాళ్ళ భుజం తట్టి ప్రోత్సాహం ఇవ్వండి. వీరులకు, జీతబత్తేల కంటే, రాజుగారి మెప్పు విలువ వెయ్యిరెట్లు ఎక్కువ. అందువల్ల వాళ్ళు ప్రాణాలొడ్డి యుద్ధంచేసి విజయం సాధిస్తారు!" అన్నాడు సర్వజ్ఞుడు.

ఇంతలో నీలవర్ణుడు అక్కడికి హడావిడిగా వచ్చాడు. రాజుకు నమస్కారం చేసి, "రాజా! నాదొక చిన్న విన్నపం. శత్రువులు మనకోట దగ్గిరికి వచ్చేశారు. మనం కోటలో కూర్చొని ఉన్నాం. వాళ్ళు గనక కోట ద్వారాల దగ్గిర అడ్డుపడి, మనం బయటకు వెళ్ళటానికి వీలు లేకుండా నిరోధిస్తే, మనం చాలా ప్రమాదంలో పడతాం. సందేహించకుండా, నన్ను పంపండి. నేను వెళ్ళి శత్రుసైన్యం పని పడతాను" అన్నాడు.

రాజు జవాబిచ్చేముందే, మంత్రి మాట్లాడాడు. "ఔనౌను, నువ్వెంతో నీ బలమెంతో అందరికీ తెలుసు, పిచ్చి, పిచ్చి వాగుడు మాని, పక్కన కూర్చో. అసలు యుద్ధం, యుద్ధం అంటూ తెగ పలవరించిన వాడివి నువ్వే. అది రానే వచ్చింది. నీతోబాటు మాకూ ముప్పు దాపురించింది. నీబోటివాళ్ళు మాటలు చాలా చెప్తారు. కానీ చేతలలో ఎందుకూ కొరగారు. నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది”.

“రాజా! వీడి మాటలు వింటే మనం బాగా నష్టపోతాం. వీడు కొవ్వెక్కి, నోటికొచ్చిన మాటలు వాగుతాడు తప్పా, నలుసంత పనికిరాడు. అసలు వీడు మనకి మిత్రుడిలా కనిపిస్తున్న శత్రువే. ఎంత చెప్పినా, వినకుండా నువ్వు వీడిని నమ్మేస్తున్నావు. ఇది చాలా ప్రమాదం. వీడు మాయగాడు. వీడు చెప్పినట్టు మన సైనికులు కోట వదలిపెట్టి, బయటికి వెళ్ళి పోట్లాడాలంటే, ఇంక మనం యింత కష్టపడి కోట కట్టుకొని ఏం ప్రయోజనం? నీళ్ళలో మొసలి ఏనుగునయినా చంపగలదు. బయటికొస్తే కుక్కతో కూడా గెలవలేదు. యుద్ధం చేసేప్పుడు స్థానబలం చూసుకోవాలి. ఈ నీలవర్ణుడి మాట నువ్వు విన్నావంటే మన సైన్యం నాశనమైపోతుంది. అసలు వాడికి కావలిసిందదే" అంటూ మంత్రి ఇంకా చెప్పబోతుండగా, నీలవర్ణుడు అడ్డుపడ్డాడు.

రాజు వైపు తిరిగి "రాజా, ఈ సర్వజ్ఞుడే మేకవన్నె పులి వీడితో మీరు జాగ్రత్తగా ఉండాలి. మాయమాటలు నావి. కాదు, అతనివి. మనం ఓడిపోయి ఎంత అవమానం. పాలయినా, తన ప్రాణం దక్కితే చాలని ఇతను ఆలోచిస్తున్నాడు.. ఇలాంటి మంత్రిని ఎంత తొందరగా వెళ్ళగొడితే అంత లాభం మీకు, ఇతనొక్కడూ లేకపోతే మనకేం కొదవలేదు. అసలు ఈ యుద్ధం గెలిపించడానికి నీకు నేను ఒక్కణ్ణి చాలు. వీళ్ళంతా దండగ. నేను అంత బలవంతుణ్ణి కాబట్టే ఇతనికి నామీద అసూయ. ఎంతలేసి మాటలన్నాడు నన్ను! మీకు ఆప్తుణ్ణయిన నన్ను తిడితే మిమ్మల్ని తిట్టినట్టే కదా, రాజా! దాక్కొని ప్రాణం దక్కించుకోవటం ఏం గొప్ప? వీరులకి ప్రాణం కంటే మానం, మర్యాదా ముఖ్యం. ఈ పిరికి మంత్రి యుద్ధం వచ్చినప్పుడు దాక్కుని, పరువు పోగొట్టుకొని, ఆ తర్వాత మానమర్యాదలు లేకుండా నూరేళ్ళు బతికితే చాలనుకొంటున్నాడు. అదిగాక కోట బయటికి వెళితే మన సైనికులు ఎందుకూ కొరగారని ఈయన అనటం ఎంత అవమానకరంగా ఉంది! ఈయన సలహా వినొద్దు. ఇప్పటికే సగం చచ్చి ఉన్న చిత్రవర్ణుడి సైన్యం మీదికి దూకి ఎదిరించి మట్టుపెడదాం. అదే మనకు అనుకూలం" అన్నాడు.

ఇతన యిలాగా, మంత్రి అలాగా మాట్లాడుతుంటే, ఏం చేయాలో రాజుకు పాలుపోలేదు. కాసేపు ఆలోచించాడు. ఏమీ అనలేదు.

నీలవర్ణుడు, "రాజా! మీ మౌనమే మీ అంగీకారంగా భావిస్తున్నాను. శలవివ్వండి" అంటూ కొంతమంది సైనికులను తీసుకొని కోట బయటికి వెళ్ళి శత్రుబలాల మీద దాడి మొదలెట్టాడు. రాజు అతన్ని ఆపలేదు.

మంత్రి సర్వజ్ఞుడికీ, సేనాపతి వీరవరుడికీ చాలా బాధ కలిగింది. కానీ ఏం చేయటం, చెప్పాల్సిందంతా నిర్మొహమాటంగా చెప్పారు. కానీ రాజు వినడు. రాజుకు నీలవర్ణుడి మీద ఉన్న నమ్మకం తన మంత్రి, సేనాపతులు మీద లేదు. చేసేది లేక మంత్రి, సేనాపతీ కూడా నీలవర్ణుడి సలహా ప్రకారమే యుద్ధ ప్రయత్నాల్లో మునిగిపోయారు.

యుద్ధం కొనసాగింది. చాలామంది సైనికులను పోగొట్టుకొన్న చిత్రవర్ణుడూ అతని మిగిలిన సేనలూ పగతో, కసితో, వీరోచితంగా పోరాడారు. ఒక్కరోజు యుద్ధం పూర్తయ్యేసరికి రెండువైపులా వేలకు వేల పక్షులు యుద్ధంలో చచ్చిపోయాయి. చీకటిపడ్డ తర్వాత రెండు పక్షాలూ ఆ రోజుకు యుద్ధం ఆపి విశ్రాంతి తీసుకొన్నాయి.

మర్నాడు పొద్దున తెల్లవారకముందే నీలవర్ణుడు లేచి, తనతోపాటు ఒక వెయ్యి కాకుల్ని తోడు తీసుకొని, ముక్కున ఒక మండే కట్టె తీసుకొని, భయపడి పారిపోతున్నట్లుగా యుద్ధభూమి నించీ, కోటలోకి దూసుకువెళ్లాడు. కోటలో అందరూ నిద్రలో ఉన్నారు. వీరవరుడు ఎంతో కష్టపడి, సురక్షితంగా కట్టిన కోటంతా నీలవర్ణుడు తగలబెట్టేశాడు. కోట లోపల ఉన్న పక్షుల్లో చాలాభాగం ఆ మంటల్లో కాలి . చచ్చిపోయాయి.

"కోట మా వశమయింది. మేం గెలిచాం" అని అరుస్తున్న కాకుల గోలతో, ఆ కాలిపోతున్న కోటలో చావక మిగిలిన పక్షులకు ఏం చేయాలో తెలియలేదు. కొన్ని భయపడి ఎటు వీలయితే అటు పారిపోయినయ్. కొన్ని పారిపోయే ప్రయత్నంలో మంటల్లో చిక్కుకొని చచ్చిపోయినాయి. కొన్నింటిని ఆ నీలవర్ణుడి కాకులసేన పొడిచి చంపేసింది.

అలా ఒక గంటలోపే హిరణ్యగర్భుడు రక్షణ కోసం కట్టించుకొన్న చోట కుప్ప కూలిపోయింది. కోటను రక్షించేందుకు ఎవరూ మిగలలేదు. కోట లోపల రాజు హిరణ్యగర్భుడూ, సేనాని వీరవరుడూ, కొద్దిపాటి సైన్యం తప్పా.

తనకళ్ళముందే తన సైనికులు అన్నివేల సంఖ్యలో కాలి చచ్చిపోవటం, కాకుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడం, పారిపోవటం చూసిన హిరణ్యగర్భుడికి చెప్పలేనంత దుఃఖం కలిగింది. పశ్చాత్తాపం కలిగింది. "వీరవరా! చూశావా, నా పొరపాటు వల్ల ఎంత నష్టం జరిగిపోయిందో, మనవాళ్ళు ఎన్నివేలమంది ప్రాణాలు పోగొట్టుకొన్నారో, నీలవర్ణుడిని సమ్మి సర్వనాశనం కొని తెచ్చుకొన్నాను. మీరందరూ ఏకమై ఎంత చెప్పినా వినకుండా, ఈ నీచుణ్ణి చేరదీసి రాజ్యాన్ని చేజేతులా 'నాశనం చేశాను. దైవసంకల్పం అలా బుర్ర కూడా పనిచేయదు. ఇప్పుడు బ్రతికి ఉన్నాడో లేదో, ఎక్కడ ఉన్నప్పుడూ, మన బర్రకూడా పనిచేయదు! ఇప్పుడు బ్రతికి ఉన్నాడో లేదో, ఎక్కడ ఉన్నాడో మన మంత్రి సర్వజ్ఞుడు! అతను చెప్పిందంతా ఇప్పుడు నిజమయింది. మూర్ఖుడినయి అతని మాట పెడచెవిన పెట్టాను. మన పక్షాన నువ్వూ నేనూ తప్పా మిగిలిన ముఖ్యులంతా ఈ యుద్ధంలో చచ్చిపోయి ఉంటారు. నువ్వు కూడా నా కోసం ఇక్కడ ఉంటే ప్రాణానికి ప్రమాదం. నా మాట విని నువ్వు కూడా పారిపో” అన్నాడు.

రాజును ఆ పరిస్థితిలో వదిలి, మహావీరుడు వీరవరుడు అలా పారిపోతాడా?

"లేదు రాజా! నేను నిన్ను వదిలి వెళ్లే ప్రశ్నే లేదు. నా బొందిలో ప్రాణం ఉన్నంతదాకా నేను నీతోపాటు ఉండి, నిన్ను రక్షించేందుకు యుద్ధం చేస్తాను. ప్రాణాలు పోతాయని నాకు భయమేమీ లేదు, అవి ఎలాగూ ఎప్పుడో ఒకప్పుడు పోకతప్పదు. నా ధర్మాన్ని వదిలిపెట్టి ఎలాగయినా ప్రాణం కాపాడుకోవాలని నాకు లేదు” అన్నాడు.

ఇంతలో చిత్రవర్ణుడి సేనాపతి తామ్రచూడుడు తన

సేనలతో కలిసి వాళ్ళమీద పడనే పడ్డాడు.

రాజూ, సేనాపతి చాలాసేపు వీరోచితంగా యుద్ధం చేశారు. కానీ, తమ చిన్నసేనతో శత్రువుల ధాటికి చివరికి, వీరవరుడు తామ్రచూడుడిని చంపి, తన రాజు తప్పించుకొనేందుకు దోప ఏర్పరచి, రాజును అక్కణ్ణించి పంపేశాడు. రాజు పారిపోయి నీళ్ళలో దూరి ప్రాణాలు దక్కించుకున్నాడు. వీరవరుడు మాత్రం అద్భుతంగా యుద్ధం చేసి, కొన్నివందల శత్రు సైనికుల్ని చంపేసి, చివరికి యుద్ధంలో తనూ నేలకొరిగాడు.
 
దాంతో యుద్దం పూర్తయిపోయింది. విజయోత్సాహంతో చిత్రవర్ణుడు కోటలో ప్రవేశించి, దాన్ని తన వశం చేసుకొన్నాడు. ఆ తర్వాత విజయగర్వంతో యుద్ధంలో చచ్చినవారు చావగా మిగిలిన తన కొద్ది సైన్యంతో రాజధానికి వెళ్ళిపోయాడు.

'అని విష్ణుశర్మ రాజకుమారులకు 'విగ్రహం' కథ చెప్పటం పూర్తి చేశాడు. "చూశారా! పిల్లలూ, యుద్ధం వల్ల అన్ని పక్షాలకీ నష్టమే. ఊరికే, పెద్ద కారణమేమీ లేకుండా, పొగతో యుద్ధం యుద్ధం అంటూ అయినదానికీ, కానిదానికీ కయ్యానికి కాలుదువ్వితే, రాజు తరువాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. పోరునష్టం, పొందు లాభం అని ఎప్పుడూ మర్చిపోవద్దు" అని కథ నీతి మరోసారి చెప్పాడు.

పిల్లి - ఎలుక

                పిల్లి - ఎలుక 


పంచవటి ప్రాంతంలో ఓ మర్రిచెట్టు తొర్రలో రోమశుడు అనే పేరుగల పిల్లి ఉంటూ ఉండేది. ఆ చెట్టు కింద ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఎలుక పేరు పలితుడు.

ఒకరోజు రాత్రి ఒక బోయవాడు వచ్చి, ఆ చెట్టు చుట్టూ వలలు పన్ని వెళ్లాడు. పిల్లి తెల్లారిలేచి చీకట్లో సరిగా కనపడక ఆ వలలో ఇరుక్కుపోయింది. అది చూసి ఎలుకకు ప్రాణం లేచివచ్చింది. 'అమ్మయ్యా, పీడ విరగడయింది' అనుకొంటూ నిశ్చింతగా తిరగసాగింది. ఇంతలో ఓ గుడ్లగూబ వచ్చింది. దాన్ని చూడగానే ఎలుకకు భయంతో ముచ్చెమటలు పోసి, వణుకు మొదలయింది.

" ఆహా, ఈ దేవుడికెంత దయలేదు! నిమిషం క్రితమే పిల్లి పీడ పోయిందని సంతోషించాను. ఇప్పుడీ గుడ్లగూబ వల్ల చావు దాపురించింది. ఇప్పుడెలా బయటపడటం?" అని ఆలోచించింది. ఏదో ఉపాయంతో పిల్లితో స్నేహం కలపగలిగితే గుడ్లగూబ తననేమీ చేయలేదు, అనుకొంటూ ఎలుక పిల్లి దగ్గరకు చేరింది. "పిల్లిబావా, నమస్కారం. ఇన్నాళ్ళు మనం యిదే చెట్టుకింద అన్నదమ్ముల్లాగా బతికాం. నీవల్ల నాకు గానీ, నా వల్ల నీకుగానీ ఎప్పుడూ ఏ యిబ్బందీ రాలేదు. ఇవాళ ఈ వలలో యిరుక్కొన్న నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కు పోతున్నది. నిన్ను విడిపిస్తే తప్పా నా మనసు కుదుటపడదు అని అనుకొంటుండగానే, నన్ను చంపేందుకు ఈ గుడ్లగూబ దాపురించింది. నిన్ను చూసి భయపడి ఆగింది కానీ, లేకపోతే ఈపాటికి నన్ను మింగేసేదే. నాతో స్నేహం చేసి, నాకూ సహాయం చేస్తానంటే చెప్పు. నిన్ను నీ ఆపదలోనించి నేను బయటపడేస్తాను, నన్ను నువ్వు రక్షించుదువు గాని” అంది.

“ఎంత మాటన్నావు, మిత్రమా! నాకు ఉపకారం చేస్తే నీలాంటి ఉత్తముణ్ణి రక్షించక, పొట్టను పెట్టుకొనే పాపిష్ఠివాణ్ణి కాదు నేను. కాటికి కాళ్ళు చాచిన ముసలిని నేను, ధర్మం తప్పను. అసలు నేనెప్పుడూ నీతో స్నేహం చెయ్యాలనే ఆలోచిస్తుంటాను. నిన్ను చూస్తే వెయ్యిమంది దగ్గర బంధువుల్ని చూసినట్టుగా ఉంటుంది నాకు. నాకు ధర్మకార్యాలంటే చాలా యిష్టం. కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే ధర్మం చేయగలం. రేపు ముసలితనంతో జవసత్వాలు ఉడిగిపోయిన తర్వాత ఇంక ధర్మమెలా చేస్తాం? 'ధర్మస్య త్వరితాగతిః' బ్రతికినన్నాళ్ళూ మంచి పనులు చేస్తూ ఉండడమే నా ధ్యేయం. ఆపదలో ఉన్న నాకు దేవుడిలా ఎదురొచ్చావు. ఇక ఈ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నా ప్రాణం రక్షించావంటే, నిన్ను నేను కాపాడతాను. వచ్చి ఈ వల కొరికి నన్ను రక్షించు" అన్నది పిల్లి.

సరేనని ఎలుక పిల్లి దగ్గరికి చేరింది. అది చూడగానే గుడ్లగూబ ఇంక ఎలుక తనకు చిక్కదని తెలుసుకొని నిరాశగా ఎగిరిపోయింది. గుడ్లగూబకు పిల్లి అంటే చచ్చే భయం.

ఇంతలో వలపన్నిన బోయవాడు యముడిలాగా అక్కడికి నడిచివస్తూ కనిపించాడు. వాడిని చూడగానే పిల్లికి వణుకు పుట్టింది. "ఎలుక బావా! ఆ బోయవాణ్ణి చూస్తేనే నాకు వళ్ళు జలదరిస్తున్నది. నన్ను తొందరగా ఈ వలలోంచి బయటపడేయవా!" అంటూ ప్రాధేయపడింది.

ఎలుక గబగబా వల కొరికేసి, ఎందుకయినా మంచిదని వెంబడే తన కలుగులోకి పారిపోయింది. పిల్లి వల విదిలించుకొని చటుక్కున చెట్టేక్కేసింది. బోయవాడు దాన్ని పట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయాడు.

వాడు అక్కడినించీ దూరంగా వెళ్ళిపోయిన తరువాత, పిల్లి చెట్టు దిగి ఎలుక దాగి ఉన్న కలుగు దగ్గరికి వచ్చింది. "మిత్రమా! నాలాంటి స్నేహితుడితో నిశ్చింతగా కాలక్షేపం చెయ్యక, అలాగ నీ కలుగులో దాక్కున్నావెందుకు? నువ్వు లేకుండా నేనేమీ తినలేను. నీ మాటలు వినకపోతే నాకు వెలితిగా ఉంది. నా యిల్లే, నీ యిల్లు. నేను నీవాణ్ణి. ఈ రోజూ రేపూ నువ్వు నా యింట్లోనే నాతోపాటు భోజనం చేద్దుగాని. రా, నిన్ను కౌగలించుకొని కృతజ్ఞత చెప్పుకోకపోతే నాకు తోచట్లేదు" అంది.

ఈ మాయ మాటలన్నీ నమ్మేందుకు ఎలుక పిచ్చిదేమీ కాదు. "పిల్లి మహాశయా! ఏదో యిబ్బంది కలిగి, గతిలేక శత్రువుతో స్నేహం చేయాల్సి వచ్చినా, నా జాగ్రత్తలో నేనుండకపోతే ఏమవుతుందో నాకు తెలుసు. నీ మాటల మాయలో పడితే నాకు చావు తప్పదు. అసలే నువ్వు యింతసేపూ వలలో చిక్కిపోయి, తిండిలేక మంచి ఆకలితో ఆవురావురుమంటున్నావు. దగ్గిరికొస్తే నన్ను వదిలిపెడతావా? నీకూ,నీ స్నేహానికి వెయ్యి నమస్కారాలు. నీ దోవన నువ్వు పో!" అంది. కలుగులో నుంచి బయటికి మాత్రం రాలేదు.

"ఈ కథ వల్ల నేను చెప్పదలిచిందేమిటంటే, అప్పుడప్పుడూ మనం శత్రువుతో స్నేహం చెయ్యాల్సి వస్తుంది. అందుకని నువ్వు ఈ నీలవర్ణుణ్ణి గురించి చర్చ చాలించు. శత్రువు మనకి చాలా దగ్గర్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ఊరికే వాదోపవాదాలతో కాలం వృథా చేయకూడదు. జరగాల్సిందేమిటో ఆలోచించాలి" అన్నాడు హిరణ్యగర్భుడు.

ఏం చేస్తాడు మంత్రి? తను చెప్పాల్సింది చెప్పాడు. "అయితే సరే రాజా, నీ యిష్టం. మనకి ఒక ఉపాయం ఉంది. చిత్రవర్ణుడికీ, అతని మంత్రికీ సరిపడటల్లేదని విన్నాం గదా. పైగా ఆ రాజుకు మన బలం గురించి సరిగా తెలిసినట్టు లేదు. అదీగాక అతనూ, అతని సైన్యం అంతదూరం ప్రయాణం చేసిపచ్చి బాగా అలిసిపోయి ఉన్నారు. శత్రువు తన వీరులని తనే అవమానించటమూ, అలసిపోయి ఉండటమూ, మన పక్షం బలం తెలుసుకోక అజాగ్రత్తగా ఉండటము. ఈ మూడు కారణాల వల్ల ఇప్పుడే యుద్ధం మొదలుపెడితే మనం గెలవటం సులభమవుతుంది" అన్నాడు. ఈ సలహా రాజు ఆమోదించాడు.

కాకి - గుడ్లగూబ

           కాకి - గుడ్లగూబ 


దండకారణ్యంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలలో ఎన్నో వందల వేల పిట్టలు గూళ్ళు కట్టుకొని ఉండేవి. ఆ ప్రాంతంలో ఉన్న కాకులు రాజు కూడా ఆ చెట్టు మీదే గూడు కట్టుకొని సుఖంగా ఉండేవాడు. ఈ మర్రిచెట్టుకు దగ్గర్లో, ఓ పెద్ద కొండగుహలో ఉపమర్దనుడు అనే పేరుగల గుడ్లగూబ ఉండేది. అది ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని వేల గుడ్లగూబలకు రాజు. ఆ గుడ్లగూబలకూ, కాకులకూ ఎప్పుడూ విరోధమే.

ఒకరోజు రాత్రి ఉపమర్దనుడు తన మంత్రులనూ, సేనాపతులను పిలిపించి, మంతనాలు జరిపి, అకస్మాత్తుగా నిష్కారణంగా మర్రిచెట్టు మీదికి దాడిచేశాడు. రాత్రివేళ గదా, కాకులు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాయి. ఉపమర్దనుడి గుడ్లగూబల సైన్యం చెట్టు మీద ఉన్న కాకిగూళ్ళన్నీ పడగొట్టి, కాకులని పొడిచి, పొడిచి చంపేశాయి. కొన్ని కాకులకు రెక్కలు తెగిపోయాయి. కొన్నింటికి ముక్కులు విరిగిపోయాయి. కొన్ని వేల కాకులు చచ్చిపోయాయి. గుడ్లగూబలకు అప్పటికి గాని కళ్ళు చల్లబడలేదు. అవి తిరిగి తమ గుహలోకి వెళ్ళిపోయాయి.

తెల్లవారింది. ఎలాగో గుడ్లగూబల దాడినుంచీ తప్పించుకొని, బతికి బయటపడ్డ కాకుల రాజు ఆ చెట్టులో
ఉన్న గూళ్ళన్నీ తిరిగి చూశాడు. ఏదో మహాప్రళయం జరిగినట్లు, ఎక్కడ చూచినా చచ్చిన కాకులే పడి ఉన్నాయి. రాజు గుండె నీరయిపోయింది. తన సంతానం, తన పరివారం, తన మంత్రులూ, తన జాతి కాకులూ వేలాదిగా గుడ్లగూబల దాడికి బలి అయిపోయాయి. ఆ చెట్టు మీద ఉన్న కాకుల్లో సగానికి సగం గుడ్లగూబల అత్యాచారంలో చనిపోయాయని తెలిసి రాజు ఎంతో దుఃఖించాడు.

ఎలాగో బతికిపోయిన మిగిలిన కాకులన్నీ రాజు చుట్టూ చేరాయి. మంత్రులు రాజును ఓదార్చారు. "స్వామీ, నీకు ఏ హానీ జరగలేదు. అదే మాకు పదివేలు. దేవుడు మన శత్రువులతో చేరి మనకు యింత భయంకరమయిన నష్టం కలిగించాడు. కానియ్యండి. ఏనాడు ఏ పాపం చేశామో, ఇవాళ ఈ శిక్ష అనుభవిస్తున్నాం. కాలం కలిసి రాకపోతే చేయగలిగిందేమీ లేదు. ఇన్ని కాకులను నిష్కారణంగా చంపిన ఈ గుడ్లగూబలు వాటి పాపానికి ఫలం అనుభవించకుండా పోవు. మనం నిద్రలో ఉన్నప్పుడు, మన వాళ్ళు ఇంత మంది శత్రువు చేతిలో చచ్చిపోవడం మన దురదృష్టం. మనకిలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. కానీ రాజా, నువ్వు దిగులుపడదు. నీ తోడు మేము ఉన్నాం. నీ ఆదేశం ప్రకారం నడుచుకొంటాం. మనకు మంచికాలం వచ్చినప్పుడు, ఆ గుడ్లగూబల గుంపుమీదికి యుద్ధానికి వెళ్ళి, దేవుడు మేలుచేస్తే, వాటి పనిపడదాం. లేదంటే యుద్ధంలోనే ప్రాణాలు త్యాగం చేసి, కీర్తి సంపాదించుకొందాం. కానీ, ఇప్పుడు శత్రువు మనకంటే చాలా బలవంతుడుగా ఉన్నాడు, వాడిని గెలవలేం. వేరేచోటికి వెళ్ళిపోయి, కొన్నాళ్ళు ఆగి చూద్దాం. ఎవరయినా బలవంతుడి సహాయం సంపాదించి, సరయిన సమయంలో ఈ గుడ్లగూబలను దెబ్బ తీద్దాం" అంటూ తమకు తోచిన సలహా చెప్పారు.

కాకులకు చిరంజీవి అనే మంత్రి ఉన్నాడు. అతను చాలా తెలివయినవాడు. బాగా ఆలోచించి, చిరంజీవి రాజుకు ఒక సలహా చెప్పాడు. "రాజా! నువ్వు బుద్ధిశాలివని మాకందరికీ తెలుసు. అయినా అకస్మాత్తుగా పెద్ద కష్టం వచ్చినపుడు ఎంత మేధావికయినా మనసు పరిపరివిధాల పోతుంది, సరయిన ఉపాయం ఆలోచించటం కష్టమవుతుంది. అందుకని నే చెప్పే మాటొకటి ఆలోచించు, ఇప్పుడయితే మనం చాలా క్లిష్టమయిన పరిస్థితిలో ఉన్నాం. శత్రువు మీద ఎదురుదాడి చేసే స్థితిలో లేము. కొంచెం ఆగాలి. ఈ లోపల మనం ఒక పనిచేద్దాం. మీరు అనుమతిస్తే నేను శత్రువుల గుహకు వెళ్ళి, వాళ్ళ ఆశ్రయం కోరుతున్నట్లు నటించి, ఆశ్రయం సంపాదించి తరువాత కథ నడిపిస్తాను.

మీరందరూ నాకో సహాయం చెయ్యాలి. ఎక్కడికయినా వెళ్ళి కొంచెం రక్తం సంపాదించి అది నా ఒంటికి పూయండి. ఆ తర్వాత మీరంతా యీ చెట్టు వదిలిపెట్టి, అల్లంత దూరంలో ఉన్న 'ఋష్యమూకం' అనే కొండమీదికి వెళ్ళిపోయి అక్కడ హాయిగా కొన్నాళ్ళు కాలక్షేపం చేయండి. అపైన మీరేం చేయాలో తరువాత నేను వచ్చి చెప్తాను” అన్నాడు చిరంజీవి.

కాకులన్నీ వెళ్లి వెదికి రెండు ఎలుకల్ని పట్టి చంపి, వాటి కొత్త నెత్తురు చిరంజీవి వంటికి పట్టించాయి. ఆ తర్వాత అవి సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోయాయి.

చిరంజీవి మాత్రం, చీకటి పడేదాకా ఆగి, ఆ తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, బిక్కు బిక్కుమంటూ, ఎలాగో ధైర్యం చేసి ఆ గుడ్లగూబల గుహ దగ్గరకు చేరాడు. ఆ గుహ లోపల చాలా పెద్దది కానీ, లోపలికెళ్ళే ద్వారం చాలా చిన్నది. ఆ ద్వారం దగ్గిరకి వెళ్ళి చిరంజీవి 'కావు కావు'మని దీనంగా కేకపెట్టాడు.

అనుకోకుండా వినిపించిన ఆ కేకకు లోపల గుడ్లగూబలు ఉలిక్కిపడ్డాయి. ఓ గుడ్లగూబ బయటికి వచ్చి కాకిని తీసుకెళ్ళి, తమ రాజు ఉపమర్దనుడి ముందు నిలబెట్టింది. రాజు', 'ఎవరు నువ్వు ఈ రక్తమేమిటి?' అని అడిగాడు.

చిరంజీవి ఏడుపు నటిస్తూ యిలా అన్నాడు: "నేను కాకుల రాజు ప్రధానమంత్రిని, నా పేరు చిరంజీవి. ఈ రోజు పొద్దున మా రాజు మమ్మల్నందర్నీ పిలిచి, 'కాకులకింత నష్టం జరిగింది. ఇప్పుడేం చేద్దాం?' అని సలహా అడిగాడు. నేను 'ఉపమర్దనుడు మహా బలవంతుడు. మనం ఆయనకి లొంగిపోయి, ఆయన కాళ్ళమీద పడి శరణు వేడుకొందాం. ఆయన మనల్ని రక్షించగలదు. నువ్వేదో పెద్ద రాజునవి గర్వపడక, వెంటనే ఉపమర్దనుడి శరణుకోరు' అని మా రాజుకు సలహా యిచ్చాను. ఆ దుర్మార్గుడు నా మాట చెవిపెట్టలేదు సరికదా! తన పరివారం చేత నన్ను తిట్టించి, కొట్టించి, ముక్కులతో పొడిపించాడు. ఒళ్ళంతా గాయాలతో నేను నేలకొరిగాను. నేను చచ్చిపోయాననుకొని, ఆ రాజు మిగతా కాకులతో కలిసి ఎటో ఎగిరిపోయాడు. అలాంటి దుష్టులు రాజులుగా ఉండబట్టే, ఈ ప్రపంచం యిలా వుంది! కొన ఊపిరితో ఉన్న నేను, ఏకాకిగా మిగిలిపోయాను. ఎలాగయినా మీ దగ్గరికి చేరి మా రాజు దుష్టచర్యలు, మీకు వివరించి, ప్రాణం వదిలేయాలని, నేను కష్టం మీద ఇక్కడికి చేరాను. నాకింక మీరేదిక్కు, సరి వాళ్ళలో యింత అవమానం పొందిన తర్వాత ఏ ముఖం పెట్టుకు బ్రతికేది? ఎవరికోసం బ్రతకాలి? చెప్పాల్సిన ఈ నాలుగు మాటలూ మీకు చెప్పేందుకు ఇంతవరకూ బ్రతికి ఉన్నాను. పైగా, ఇంత వరకూ నాకు మీలాంటి మహానుభావుల్ని దర్శించే అదృష్టం పట్టలేదు. ఇవాళ ఆ కోరికా తీరింది. మీకు తెలియదు కానీ, నేను రోజూ మా రాజు దగ్గర, మీ గొప్పతనం తెగపొగుడుతుండేవాణ్ణి. ఆ ధూర్తుడికి అందుకే నామీద కోపం. వాడికి నేను చేసిన సేవంతో వ్యర్ధం. దాని బదులు నేను మొదట్నుంచి మిమ్మల్ని సేవించుకొని ఉంటే ఎంతో సుఖపడేవాణ్ణి".

ఇలా చిరంజీవి మాయమాటలు ఉపన్యానం దంచేశాడు.

ఉపమర్దనుడి మంత్రులకి చిరంజీవి ధోరణి కొంచెం అనుమానాస్పదంగానే కనిపించింది. "ఓ రాజా! వీడి మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. వీడి బోటి వాళ్ళని మనం చేరనివ్వకూడదు. చేరిస్తే దూదిగుట్టలో నిప్పురవ్వను చేర్చినట్టే. క్షణాల్లో కొండంత దూది, బూడిద అయిపోతుంది" అని తమ రాజుకు సలహా యిచ్చారు. కానీ, ఉపమర్దనుడు వినలేదు.

“నాకు చూస్తే వీడు మంచివాడుగానే కనిపిస్తున్నాడు. జాతి వేరు కాబట్టి శత్రువు అనుకోవద్దు. సత్యం మాట్లాడుతున్నారు. ఇలాంటి సజ్జనుడు మన దగ్గరకి తనే రావటం ఓ రకంగా మన అదృష్టం. పాతకథలు మర్చిపోయి, ఇతనితో స్నేహం చేద్దాం. ఇది నా ఆజ్ఞ" అని రాజు తన మంత్రుల నోళ్ళు మూయించాడు.

ఈ మాట విని చిరంజీవి రాజు కాళ్ళ మీద పడిపోయాడు. "ఓహోహో ఎంత దొడ్డబుద్ధి! నేను నిజంగా ధన్యుణ్ణి, ఉదారబుద్ధి గల మీలాంటి రాజులు యింకా కొందరుండబట్టే ఈ ప్రపంచం ఇంకా నిలబడి ఉంది. ఈ భూమి మీద మిగతా రాజులందరూ మీనించి నేర్చుకోవాల్సిందెంతో ఉంది. వీళ్ళందరూ నన్ను గురించి చెడుగా ఎంత చెప్పినా, లక్ష్యపెట్టకుండా, నాకు ఆశ్రయం ఇచ్చిన మీ గొప్పతనం పొగడడానికి మాటలు చాలవు" అంటూ మరికొన్ని యిచ్చకాల మాటలు చెప్పాడు. రాజు ఉబ్బిపోయాడు.

ఆనాటినుంచీ చిరంజీవి, ఉపమర్దనుడికి సన్నిహితుడయిపోయాడు. ఆ గుహ రహస్యాలు, ఆ గుడ్లగూబల అలవాట్లూ అన్నీ జాగ్రత్తగా కనిపెట్టాడు. ఆ గుహకి రక్షణ బాగా ఉంది గానీ, అంత పెద్ద గుహకీ, ఒకే చిన్న ద్వారం అని గమనించాడు.

ఓరోజు పగటిపూట, గుడ్లగూబలన్నీ గుహలో ఆదమరచి నిద్రలో ఉండగా, చిరంజీవి బయటకు వచ్చాడు. ఆ చుట్టుపక్కల అవుల గుంపులున్న చోట్లకు వెళ్ళి బోలెడంత అవుపేద పోగుచేసి దాన్ని కాళ్ళల్లో, ముక్కుల్లో యిరికించి గుహ దగ్గరకు తెచ్చి, గుహ ద్వారం దగ్గర వేశాడు. కొంత గుహ ద్వారానికి పట్టించాడు.

ఆ తర్వాత ఎగురుకొంటూ వెళ్ళి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్న తన కాకుల గుంపును చేరాడు. కాకుల రాజుకు నమస్కారం చేశాడు. "రాజా! నేను నానా పాట్లుపడి ఉపమర్దనుడి కొలువులో చేరి, వాడి విశ్వాసం సంపాదించాను. వాడి అనుచరులంతా నన్ను ఎలా చంపాలా, బాధించాలా.. అని ఎంత ప్రయత్నించినా, నేను ఓపిగ్గా అదంతా తట్టుకొని నిలబడ్డాను. వాళ్ళు తిండిపెట్టినా, పెట్టకపోయినా అలాగే కాచుకొని కూర్చొన్నాను. నాతో స్నేహం వద్దని, మంత్రులెంత చెప్పినా, ఆ రాజు వినలేదు. వాడి కర్మ. వాళ్ళకు మంచిరోజులు అయిపోయినాయి. ఇప్పుడు మనకో మంచి అవకాశం వచ్చింది.

"మనందరం కలిసి గుహ దగ్గరకు వెళదాం. గుహ ద్వారం దగ్గిర నేను ఏర్పాటుచేసి వచ్చిన ఆవుపేడ రాసి వచ్చాను. అది ఎండి పిడకలా తయారయి ఉంటుంది. మనందరం తలా ఒక కట్టెపుల్లా కాల్చి దాన్ని ముక్కున పట్టుకొని గుహముందు పడేస్తే, ఆ అగ్ని బాగా రగులుకొని గుహలో పడుకొని ఆదమరచి నిద్రపోతున్న గుడ్లగూబల ప్రాణాలు తీయటం ఖాయం. ఒక్కటిగూడా తప్పించుకొనేందుకు వీలు ఉండదు. అందరూ కదలండి. లేకపోతే మంచి తరుణం మించిపోతుంది" అన్నాడు. చిరంజీవి.

కాకులన్నీ కాలే కట్టెలు ముక్కున కరుచుకొని గుహ దగ్గరికి ఎగిరివెళ్ళాయి. పెద్ద కార్చిచ్చు ఏర్పడి, బయటపడే మార్గం కూడా లేక గుహలో గుడ్లగూబలన్నీ ఆ చిచ్చులో కాలిపోయాయి!

"రాజా! ఈ కథ వల్ల నేను చెప్పదలచుకొన్నదేమంటే, ఎరగని వాళ్ళ తియ్యటి మాటలు నమ్మి దగ్గిర చేర్చుకోవటం వల్ల ముప్పు తప్పదు. ఈ నీలవర్ణుడి తేనెమాటలు నువ్వు నమ్మకు. ఇతనేదో తెలివిగలవాడు, మనకు యుద్ధ సమయంలో సహాయం చేస్తాడనుకొంటున్నావు నువ్వు. సహాయం మాట దేవుడెరుగు, అపాయం కలిగించకుండా ఉంటాడని కూడా నమ్మకం లేదు. నువ్వు విన్నా సరే, వినకపోయినా సరే, నేను చెప్పాల్సిన హితవు నేను చెప్తున్నాను. నువ్వు తక్షణమే ఈ నీలవర్ణుణ్ణి చంపించేయి. అప్పుడే పీడ విరగడవు తుంది" అంటూ మంత్రి తన ఉపన్యాసం ముగించాడు.

ఈ మాటలన్నీ విని హిరణ్యగర్భుడు చిరునవ్వు నవ్వాడు.

“నువ్వు చెప్పింది నిజం, కాదనను. కానీ కొత్తవాళ్ళు అందరూ నమ్మదగ్గవాళ్ళు కాదనటం సరికాదు. ఇతను ఇంతవరకూ మనకే అపకారమూ చేయలేదు. గుణాల బట్టి చూడాలి కానీ, జాతి బట్టే ఫలానావాడు దుర్మార్గుడనటం ఎలా? ఒక్కొక్కప్పుడు తనవాడే కీడు చేయొచ్చు. పరాయివాడే మేలు చేయచ్చు. మన శరీరంలోనే రోగం పుడుతుంది, దానికి మందు అడివిలో చెట్టునించీ వస్తుంది. ఇతను పాపం ధార్మికుడు.

అకారణంగా ఇతన్ని చంపిస్తే లోకం ఏమంటుంది? ఇప్పుడు మనం బలమైన శత్రువుతో యుద్ధం తలపెట్టాం. గెలవాలంటే, సహాయం చేయగలవాళ్ళందరినీ మనతో కలుపుకోక తప్పదు. మనసులో నమ్మినా, నమ్మక పోయినా, నమ్మినట్టే నటించి, మన పని పూర్తయిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించవచ్చు. ఒక ముల్లును మరొక ముల్లుతో తీసేసి, తర్వాత రెండు ముళ్ళూ అవతల పారేస్తాం కదా? అలాగే యితని సహాయంతో శత్రువును జయించి, తర్వాత ఇతని సంగతి చూసుకొందాం.

పూర్వం యిలాగే ఒక ఎలుక, ఓ పిల్లితో అవసరార్ధం స్నేహం చేసి, పని జరిగిన తర్వాత దాన్ని వదిలేసిన కథ ఒకటి ఉంది, విను చెప్తాను” అని కథ మొదలెట్టాడు హిరణ్యగర్భుడు.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...