చిత్రాంగుడి కథ


                 చిత్రాంగుడు

                      లఘుపతనకుడు-కాకి
                      హిరణ్యకుడు-ఎలుక
                      మంథరుడు-తాబేలు

ఓరోజు కాకీ (లఘుపతనకుడు), తాబేలూ (మంథరుడు), ఎలుకా (హిరణ్యకుడు) మూడూ కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నయ్‌. ఇంతలో అక్కడికి ఒక లేడి పరిగెత్తుతూ వచ్చింది. దానిని చంపటానికి ఓ బోయవాడు దాని వెనక తరుముకొంటూ వచ్చి, దాని వేగం అందుకోలేక వెనకబడిపోయి, యిక దాన్ని వదిలేసి వెనక్కు వెళ్ళిపోయాడు. కబుర్లాడుకొంటున్న ముగ్గురు మిత్రులూ ఆ లేడినీ, దాని పరుగునీ చూసి మొదట కొంచెం కంగారుపడ్డాయి. కానీ, వేటగాడు వెనక్కెళ్ళటం చూసి వాటికి ధైర్యం వచ్చింది. లేడిని పలకరించి ‘నీ కథేమిటి?’ అని అడిగాయి.

“నా పేరు చిత్రాంగుడు. వేటగాడి భయంతో నేను పారిపోయి వచ్చాను. మీరు నాతో నేస్తం కడితే, మీతోపాటు యీ అడవిలోనే ఉండిపోతాను!” అన్నదా లేడి.

మంథరుడు, “చిత్రాంగా, నువ్వు మంచివాడివని చూడగానే తెలుస్తున్నది. హాయిగా మాతో జట్టు కట్టు. నిర్భయంగా ఈ అడవిలోనే ఉండిపో. అందరం కలిసే ఉందాం” అన్నాడు. అప్పట్నించీ ముగ్గురు మిత్రులు నలుగురయ్యారు.

ఒకనాడు చిత్రాంగుడు మేతకోసం వెళ్ళి, మామూలు వేళకు తిరిగి రాలేదు. మంథరుడికి కొంచెం భయం వేసింది. “ఈ చిత్రాంగుడు ఇవాళ యింతసేపయినా తిరిగి రాలేదేమిటి? ఏదయినా ప్రమాదంలో చిక్కుకున్నాడా? పోనీ, అడవిలోకి వెళ్ళి చూసొద్దామంటే, నేను తాబేలును, అంత త్వరగా కదలి చూసి రాలేను. పోనీ మిమ్మల్ని పంపిద్దామంటే, మీరు తిరిగి వచ్చేవరకూ నాకు మనసు మనసులో ఉండదు. ఎలా?” అన్నాడు.

లఘుపతనకుడు, “నేను కాకిని కదా! ఎగిరి క్షణాల మీద అడవి అంతా వెతికి, యిక్కడున్నట్టు తిరిగొచ్చేస్తాను” అంటూ ఎగిరి వెళ్ళాడు. అడవిలో ఓ మూల వలలో చిక్కుకుపోయిన చిత్రాంగుడు కనిపించాడు. కాకి వెంటనే వెనక్కి వెళ్ళి, హిరణ్యకుడిని తన వీపు మీద ఎక్కించుకొని తీసుకొచ్చింది. ఎలుక చకచకా వల తాళ్ళు కొరికేసి చిత్రాంగుణ్ణి విడిపించింది.

ముగ్గురూ కలిసి తిరిగివస్తూండగా, చిత్రాంగుడు అన్నాడు “ఎవరికయినా కర్మ అనుభుంచక తప్పదనుకొంటాను. నేను కిందటి జన్మలో చేసిన పాపమో ఏమిటో, ఎప్పుడూ నాకిలాంటి యిబ్బందులు తప్పటం లేదు. అసలు నాకు
ఆరునెలల వయస్సప్పుడ ఓసారి ఒక వేటగాడి వలలో చిక్కుపడిపోయాను. మా గుంవులో మిగిలిన లేళ్ళన్నీ పారిపోయాయి. ఆ వేటగాడు ఎందుకో నామీద దయదలిచాడు. వలలో నుంచి నన్ను బయటకు తీసి, తన భుజాన ఎత్తుకున్నాడు. సరాసరి నన్ను తీసుకెళ్ళి ఆ దేశం రాజకుమారుడికి కానుకగా యిచ్చేశాడు. ఆ రాజకుమారుడు నన్ను చూసి ముచ్చటపడ్డాడు. నన్ను చాలా ప్రేమగా చూసుకొనేవాడు. అందువల్ల నేను ఆ ఊరంతా యథేచ్ఛగా, హాయిగా తిరుగుతూ, మేత మేస్తూ ఆడుకొంటూ కాలక్షేపం చేసేవాణ్ణి. ఓరాత్రి నేను రాజకుమారుడి పడకగది పక్కన వసారాలో పడుకొని ఉండగా, మంచి వాన పడింది. ఆ వాన చూడగానే నాకెందుకో మా లేళ్ళగుంవు జ్ఞాపకానికి వచ్చింది.‘మళ్ళీ మా లేళ్ళ గుంపులో మిగిలిన లేళ్ళను కలుసుకొని అడవిలో హాయిగా, వాటితో కాలం గడిపే అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో!’ అనుకొని ఆ మాటే పైకి అన్నాను. నేను మనిషి భాషలో మాట్లాడటం విని రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిచి -‘యిలా జంతువులు మనిషి భాషలో మాట్లాడితే, అదేమయినా శుభానికీ, అశుభానికీ శకునమా?’ అని అడిగాడు. జ్యోతిష్కుడు ‘జంతువులు మానవభాషలో మాట్లాడితే రాజ్యానికి అరిష్టమూ, అపశకునమూ కాబట్టి వెంటనే జపాలూ, హోమాలూ చేసి శాంతి చేయాలని’ సలహా యిచ్చాడు. నన్ను మాత్రం వెంటనే తీసుకెళ్ళిపోయి మళ్ళీ అడవిలో వదిలేశారు. అప్పుడే వేటగాడు నావెంట బడటం, నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యివాళ ఈ ప్రమాదంలో చిక్కుకున్నాను. ఏరోజు ఏం జరుగుతుందో, ఎలా రాసిపెట్టి ఉందో ఎవరూ చెప్పలేదు! ఇలా చిత్రాంగుడు తన పాత కథలన్నీ చెపుతుంటే, ముగ్గురూ నిదానంగా వెనక్కి వెళుతున్నారు. వీళ్ళు చేరటం ఆలస్యమవుతున్నకొద్దీ, అక్కడ మంథరుడికి కంగారు పెరిగిపోయి, ఆగలేక తను కూడా వాళ్ళను వెతుకుతూ అడవిలోకి నడవసాగాడు. మధ్యలోనే వాళ్ళు ఎదురుపడటంతో, మంథరుడికి ప్రాణం లేచి వచ్చింది . “అమ్మయ్యా! మీరు ముగ్గురూ క్షేమంగానే ఉన్నారు కదా! మీరు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి ఏం ప్రమాదం జరిగిందోనని నేను చాలా భయపడిపోయాను. అందుకే యిక ఆగలేక నేను దియల్దేరి వచ్చాను” అన్నాడు.

హిరణ్యకుడికి మాత్రం యిది నచ్చలేదు. “అంత కంగారయితే ఎలా? ఓ గడియ అటూ ఇటూగా రానే వస్తున్నాం కదా, నువ్వెందుకింత సాహసం చేసి బయల్దేరాటం? అక్కడయితే చెరువు ఉంది కాబట్టి ఏదయినా యిబ్బంది వస్తే నువ్వు చటుక్కున నీళ్ళలోకి దూరి తప్పించుకోవచ్చు. ఈ అడవి మార్గంమంత మిట్ట. నువ్వేమో తొందరగా నడిచి తప్పించుకోలేవు. నువ్వు యిలా రావలసింది కాదు!” అన్నాడు.

ఇంతలో నీళ్ళతో పాటు ఎగురుతూ వస్తున్న లఘుపతనకుడు కేకవేశాడు. “అదిగో చూడండి! మీరు మాటలతో పెళ్ళినడకలు నడునస్తూంటే అక్కడ వలపన్నిన వేటగాడు మనవెనకే వచ్చేశాడు. పారిపోకపోతే ప్రాణాలు దక్కవు. పరుగుపెట్టండి” అని.

ఆ కేక విని లేడి అయితే పరుగు పెట్టి పారిపోయింది. ఎలుక కూడా చకచకా వెళ్ళి దగ్గరలో ఉన్న కలుగులోకి దూరిపోయింది. తాబేలు ఏం చేస్తుంది పాపం, పరిగెత్తలేదాయె. వేటగాడికి దొరికిపోయింది! వాడు కనీసం అదయినా  దొరికినందుకు సంతోషించి, దాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్ళిపోయాడు.

మంథరుడిని యిప్పుడెలా రక్షించాలో తెలియక, మిగిలిన ముగ్గురు మిత్రులూ కళ్ళనీళ్ళు కారుస్తూ ఆ వేటగాడికి కొంచెం వెనుకగా నడవసాగారు. హిరణ్యకుడు ఆలోచనాపరుడూ, తెలివయినవాడూ కదా? “ఊరికే దుఃఖిస్తూ కూర్చోకూడదు. ఈ వేటగాడు అడవి దాటిపోయే లోపల మంథరుణ్ణి విడిపించే ఉపాయం ఆలోచించాలి. లేకపోతే మనకు మంథరుడు దక్కడు!” అన్నాడు.

“ఒక గండం తప్పింది గదా అని యిప్పుడే కొంచెం సంతోషిస్తుంటే ఈ రెండో ప్రమాదం వచ్చిపడింది. మాకయితే బుర్రలు వనిచేయట్లేదు. నువ్వే ఏదయినా ఉపాయం ఆలోచించాలి!” అన్నారు చిత్రాంగుడూ, లఘుపతనకుడు.

“ఆయితే, వినండి. చిత్రాంగుడు వేటగాడికి కనపడకుండా వెళ్ళిపోయి చెరువుగట్లున, కాళ్ళు చాచి, కళ్ళు
తేలవేసి చచ్చి పడిపోయినట్టు నటిస్తూ పడుకోవాలి. అప్పుడు లఘుపతనకుడు లేడి మీద వాలి, ముక్కుతో లేడి కళ్లు పొడుస్తున్నట్లు నటించాలి. అప్పుడు వేటగాడు లేడి చచ్చిపోయి పడి ఉన్నదనుకొని దానికోసం వస్తాడు. లేడిని తీసుకెళ్ళాలంటే తాబేలును నేలమీద పెట్టి రాక తప్పదు. అతను అలా చేయగానే నేను వెళ్ళి తాబేలు కట్లు కొరికివేసి విడిపిస్తాను. తాబేలు చటుక్కున నీళ్ళలోకి దూరిపోతుంది. నేను ఒక కలుగు చూసుకొని అందులోకి వెళ్ళిపోతాను. ఇంతలో చిత్రాంగుడు లేచి పరుగుపెడతాడు. లఘుపతనకుడు తన మానాన తను ఎగిరిపోతాడు!” అని ఉపాయం చెప్పాడు హిరణ్యకుడు.

మిత్రులందరూ ఉపాయాన్ని తూచా తప్పకుండా పాటించాయి. మంథరుడు చెరువులోకి వెళ్ళిపోయాడు. హిరణ్యకుడు కలుగులోకి దూరిపోయాడు. చిత్రాంగుడు చెంగు చెంగున పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఎగిరిపోయాడు. వేటగాడికి ఏమీ మిగలలేదు, నిరాశ తప్పా!



మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
                  ధన్యవాదలు...

                        ఇంకా ఉంది...

    తరువాత కథ: మిత్రభేదంలోనీ కరటకుడు-దమనకుడు

Please visit the blog.share and comment the story...enjoy by reading the story

నక్క దురాశ



                  నక్క 🦊 దురాశ

                      లఘుపతనకుడు-కాకి
                      చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                      హిరణ్యకుడు-ఎలుక
                      మంథరుడు-తాభేలు

వెనకటికి ‘కల్యాణకటకం’ అని ఒక ఊరుండేది. ఆ ఊళ్లో ఓ భోయవాడుండేవాడు. వాడి పేరు భైరవుడు. వాడొకరోజు విల్లూ, బాణాలూ, వలా యివన్నీ తీసుకొని అడవిలోకి వేటకు వెళ్ళాడు. అడవిలో ఓమూల చిన్న గుంట తవ్వి, అందులో నక్కి కూర్చున్నాడు. ఆ వయిపుగా వెళ్ళే జంతువులకు ఎరగా కొలత మారిసాన్ని ఉంచాడు. ఆ మాంసానికి ఆశపడి అటుగా ఒక బలిసిన జింక వచ్చింది. భైరవుడు దాన్ని చంపేసి, మోసుకొంటూ యింటిదారి పట్టాడు. దోవలో పెద్ద అడవిపంది కనిపించింది. ‘ఇవాళ నా అదృష్టమే, అదృష్టం!’ అనుకొంటూ భైరవుడు జింకను కింద ఉంచి, విల్లు పట్టుకొని గురిగా పందిమీదికి బాణం వేశాడు. బాణం పందికి గట్టిగా తగిలింది కానీ పంది వెంటనే చావలేదు. కోపంగా వచ్చి బోయవాడి మీదకు ఉరికి వాణ్ణి చంపేసింది. ఆ తర్వాత, బాణం దెబ్బకి బాగా రక్తం కారిపోయి ఉండటం వల్ల పందికూడా చచ్చిపడిపోయింది. బోయవాడు, పంది పెనుగులాడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మధ్య ఒక పాము నలిగి చనిపోయింది.

ఇదంతా జరిగిన కాసేపటికి ‘దీర్హరావం’ అనే నక్క ఆ వైపు వచ్చింది. ఎదురుగా చచ్చి పడున్న జింక, మనిషి. పంది, పాము వీటన్నిటినీ చూసి దానికి నోరూరిపోయింది. “ఇంక నాకు కొన్ని నెలల పాటు మంచి మాంసానికి కొరత లేదు!” అని ఆనందంతో తబ్బిబ్బయిపోయింది.

“నాకు ఈ మనిషి మాంసం నెలరోజులు సరిపోతుంది. పందీ, జింకల మాంసంతో మరో రెండు నెలలు తేలిగ్గా గడిచిపోతయ్‌. ఈ పాము మాంసం ఒకరోజుకు సరిపోతుంది” అని లెక్కలు వేసుకొంది.

“ఇదంతా నిదానంగా హాయిగా తింటాను. ఈ విల్లుకున్న తాడు కూడా జంతుపుల నరంతో చేసిందే. ప్రస్తుతానికి యిది కొరికి చూస్తాను” అనుకొంటూ విల్లు తాడు కొరికింది. తాడు తెగి, నక్కకు ఠక్కున విల్లు తగిలేసరికి ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే చచ్చిపడిపోయింది.

“విన్నారా కథ? దురాశవల్లే నక్క చావును కొని తెచ్చుకొంది” అన్నాడు మంథరుడు. “అందుకే చెప్పాను, తను తినక, యితరులకివ్వక కూడబెట్టే డబ్బు వల్ల ఏం ప్రయోజనిం. చచ్చిన తరువాత, వెంట వచ్చేదేమీ కాదు గదా!”

“అయినా, అయిపోయిన కథ యిప్పుడెందుకు తవ్వుకోవటం? తెలివయినవాళ్ళు రాని దానికోసం చూస్తూ కూర్చోరు, పోయిన దానికోసం ఏడవనూ ఏడవరు. కష్టం వస్తే దిగాలు పడనూ పడరు. కాబట్టి , హిరణ్యకా, ఎప్పుడు ఉత్సాహంగా ఉండు. హుషారుగా ఉండేవాడే నిజంగా పండితుడు. ఎప్పుడూ దిగులువడే విద్వాంసుడు ఎన్ని విషయాలు తెలిసినా మూర్ఖుడు.


మందుల పేర్లన్నీ తెలిసి, విన్న మాత్రాన రోగంపోదు, మందు తీసుకొంటేనే దానివల్ల ఉపయోగం. గుడ్దివాడికి వాడి చేతిలో ఎంత మంచిదీపం ఉండీ లాభం ఎలా ఉండదో, అలాగే వివేకం లేనివాడికి ఎన్ని శాస్త్రాలు తెలిసీ ఉపయోగం ఉండదు.

“నన్ను చూడు. ఆపదలు వస్తే నేను దుఃఖించను. సంపద వస్తే తబ్బిబ్బయిపోను. అప్పుడప్పుడు కష్టాలొస్తయ్. అప్పుడప్పుడూ సుఖాలొస్తయ్. ఇది సహజం. డబ్బు రావటం, పోవటం , ఎందుకంటే అది ఎలాగూ కలకాలం ఉండేది కాదు. డల్చులేనంత మాత్రాన, నిలకడగల మనిషికి గౌరవానికేమీ భంగం ఉండదు. డబ్బు ఉన్నంత మాత్రాన ఓ క్షుద్రుడికి చాలా గౌరవం లభిస్తుందనటం కూడా సరికాదు. వంద బంగారు గొలుసులు వేస్తే మాత్రం కుక్క సింహంతో సమానమవుతుందా? నువ్వు బుద్దిమంతుడివి. ఇప్పుడు నీ గౌరవానికొచ్చిన లోపమేమీ లేదు. నువ్వే అన్నట్టు, పరమ దయామయుడయిన దేవుడు మనకింత ఆహారం చూపించకుండా ఉండడు. ఎలా బతుకుతానో అని ఎక్కువ దిగులుపడవలసిన పనిలేదు.

“'పైగా నువ్వేమో ధర్మాలన్ని తెలిసినవాడివి. నీకు నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. నాకు ఈ లఘుపతనకుడెంతో నువ్వు అంతే. ఆ దేవుడే మన ముగ్గురినీ కలిపాడు. ఏదో దొరికింది యింత తిని హాయిగా కాలం గడుపుదాం. దిగులుపడకు” అన్నాడు మంథరుడు.

ఈ మాటలు హిరణ్యకుడికి నచ్చాయి. అతని దిగులు వదిలిపోయి ఉల్లాసం కలిగింది.

“మంచిమిత్రుడు చెప్పాల్సిన మాటలు చెప్పావోయ్‌ మంథరా! నువ్వు చెప్పింది నిజం. దేవుడుండనే ఉన్నాడు మనకెందుకు చింత? ఈ సృష్టి నిండా ఎన్నో రకాల పశువులనీ ,పిట్టలనీ యితర జంతువుల్నీ పుట్టించేప్పుడే దేవుడు వాటికి తగ్గ ఆహార, విహారాల్నీ సృష్టించే ఉంచాడు. ఇది మర్చిపో ఊరికే అవసరానికి మించిన డబ్బు, దస్కం సంపాదించటానికి నానా పాట్లూ పడటం, అది కాపాడుకోవటానికి మరిన్ని అగచాట్లు పడటం యిదంతా ఎందుకు? ఈ మితిమీరిన డబ్బు ఆశ వల్ల దుఃఖమే గానీ, సుఖం లేదు. ఆశ ఒక్కటి తగ్గించుకొంటే, ఇక
 ధనికుడూ లేడూ, దరిద్రుడు లేడు. ధనధాన్యాల సరిపడ కంటే నీలాంటి మిత్రులు లభించటమే, ఈ మిత్రలాభమే గొప్పసంపద” అన్నాడు.

కాలం గడుస్తూ ఉంది.

మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
                  ధన్యవాదలు...

                        ఇంకా ఉంది...

    తరువాత కథ: చిత్రాంగుడు

Please visit the blog.share and comment the story...enjoy by reading the story

హిరణ్యకుడి కథ

 

               హిరణ్యకుడి కథ

                      లఘుపతనకుడు-కాకి
                      చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                      హిరణ్యకుడు-ఎలుక
                      మంథరుడు-తాభేలు


                                  1

లఘుపతనకుడు, హిరణ్యకుడిని మంథరుడికి పరిచయం చేశాడు, “మిత్రమా, ఈ ఎలుకల రాజు మంచి గుణవంతుడు, పుణ్యాత్ముడు, ఎంతో గౌరవించదగ్గవాడు” అంటూ.

మంథరుడు విని సంతోషపడ్డాడు. “హిరణ్యకా, నువ్వు దేశమంతా వదిలిపెట్టి కీకారణ్యంలో ఎందుకుంటున్నావు? దానికేమయినా కారణం ఉందా?” అని అడిగాడు.

హిరణ్యకుడు తన జీవితకథ చెప్పుకొచ్చాడు. "మంథరా, మొదట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ ఊళ్ళో చాలామంది సన్యాసులు ఉండేవాళ్ళు, వాళ్ళలో చూడాకర్ణుడు అనే వాడొకడుండేవాడు. ఆయన రోజూ భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్ధాలన్నీ ఓ గిన్నెలో పెట్టి, దాన్ని ఓ చిలక్కొయ్యకు తగిలించి నిద్రపోయేవాడు. ఆయన నిద్రలో పడగానే నేను గబగబా ఆ గిన్నెలో ఉంచిన అన్నం తినేస్తూ ఉండేవాణ్ణి.

ఓరోజు, చూడాకర్ణుడిని కలవటానికి  వీణాకర్ణుడు అనే మరో సన్యాసి అతని దగ్గిరకు వచ్చాడు. అతనితో మాట్లాడుతూ చూడాకర్ణుడు మధ్య మధ్యలో నన్ను భయపెట్టేందుకు ఓ కర్రతో నేలమీద కొడుతూ కూర్చున్నాడు.

“ఏమిటయ్యా, చూడాకర్ణా, అలా మధ్య మధ్య చప్పుళ్ళెందుకు చేస్తున్నాపు?“ అని అడిగాడు వీణాకర్ణుడు.

“ఈ గదిలోకి రోజూ ఓ ఎలుక వచ్చి, నేను దాచి పెట్టుకొన్న కాస్త అన్నం తినేసి పోతున్నది. దీనితో నాకు పెద్ద బెడదగా ఉన్నది” అన్నాడు చూడాకర్ణుడు.

“ఎలుకేమిటి? చిలక్కొయ్య మీదికెగరటమేమిటి? అంత చిన్న ఎలుకకి అంత బలం ఎలా ఉంటుంది? యిలాంటి వాటికేదో ప్రత్యేకమయిన కారణం ఉంటుంది” అని వీణాకర్ణుడు తన అనుభవమొకటి కథగా చెప్పసాగాడు.

“ఇదివరకోసారి నేను ఓ బ్రాహ్మణుడి యింటికి భిక్ష కోసం వెళుతుండేవాణ్ణి. ఓ రోజు ఆ !బాహ్మణుడు తన భార్యతో
మాట్లాడుతూ, ‘రేపు అమావాస్య, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా! ఏం “వండబోతున్నావు?’ అని అడిగాడు. ‘మీరేమయినా కూరలూ, పప్పులూ తెస్తే, నేను వండిపోస్తాను. మీరు ఏదీ తేకపోతే నేనేం వండుతాను?’ అంది అ యిల్లాలు. బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. ‘ఉన్నంతలో యిల్లు జరపాలి, ఉన్నదే పెట్టాలి గానీ, అది కావాలీ, యిది కావాలీ అని లేనివాటి గురించి అరాటపడటం అనవసరం’ అన్నాడు. “అలా అయితే సరే, ఉన్న పదార్థాలతోనే రేపటికి ఏదో ఏర్పాటు చేస్తాన్లెండి” అంది అతని భార్య నొచ్చుకుంటూ. యింట్లో నువ్వులు మాత్రం ఉన్నాయి. వాటితోనే ఏదో చేసి పడేద్దామని ఆ ఉన్న నువ్వులు కడిగి, దంచి, ఎండబోసింది. అంతలో ఓ కోడి వచ్చి ఎండబోసిన నువ్వులలో కాళ్ళు పెట్టి కెలికింది. బ్రాహ్మణుడు ‘ఈ కోడి కెలికిన నువ్వులు మైల పడిపోయినయి. ఇవి వంటకు పనికిరావు. ఇవి మార్చి వేరే ఏవయినా దొరుకుతాయేమో’ చూడమన్నాడు. ఆయన భార్య ఆ నువ్వులు పక్కింటికి తీసుకెళ్ళి “ఏమండీ, ఈ దంచిన నువ్వుల పప్పు తీసుకొని నాకు ముడి నువ్వులిస్తారా?” అని అడిగింది. పక్కింటావిడకి ఈ బేరం నచ్చింది. ఆమె నువ్వు పప్పు తీసుకొని, ఎత్తుకెత్తు ముడినువ్వులు యిన్వబోతుంటే ఆమె భర్త వచ్చి అడ్డుపడ్డాడు. “పిచ్చిదానా! ఎవరన్నా నువ్వు పప్పు యిచ్చి ఎత్తుకెత్తు ముడినువ్వులు తీసుకొంటారా? ఆమె అలా యిస్తున్నదంటే దానికేదో కారణం ఉండి ఉండాలి. అది తెలుసుకోకుండా, యిలాంటి బేరాలకు దిగితే నష్టం నీకే” అని చెప్పాడు. ఆయన చెప్పిన నీతి నా చెవిలోనూ పడింది, అదే నీకు చెపుతున్నాను. ఈ ఎలుక యిక్కడ ఉండటానికి, యింత బలం సంపాదించడానికీ కారణం ఏమిటో తెలుసుకోకుండా, యిలా కర్రతో చప్పుళ్ళు చేస్తూ కూర్చొంటే ఏం ప్రయోజనం?” అని కథ ముగించాడు వీణాకర్ణుడు.

                                 2


దాంతో చూడాకర్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఒక
పలుగు తెచ్చి నేను ఏర్పాటు చేసుకొన్న కలుగు తవ్వి పడేశాడు. అందులో నేను ఎన్నాళ్ళనుంచో తీసుకొచ్చి పెట్టుకొన్న పదార్ధాలన్నీ తీసిపడేశాడు, దానితో నాకు కష్టకాలం వచ్చింది. తిండీతిప్పలూ లేక కృశించిపోయాను. ఓరోజు అలాగే నీరసంగా మెల్లగా తిరుగుతుండగా చుడాకర్జుడు నన్ను చూశాడు. నవ్వుతూ యిలా అన్నాడు :

“ధనం కలవాడే బలవంతుడు. ధనం కలవాడే పండితుడు. ధనముంటేనే అన్ని సుఖాలు.  ఈ ఎలుక తన సొమ్మంతా పోగొట్టుకొని, బలం ఉడిగిపోయి, నీరసించి, మిగతా ఎలుకల్లాగా అయిపోయింది. ధనం లేకపోతే దుఃఖమే. ఆ దుఃఖం వల్ల తెలివితేటలూ నశించిపోతయ్. ధనముంటేనే పౌరుషము, మేధాశక్తీ, బంధుమిత్రులూ ఉంటారు. దారిద్ర్యం  కంటే చావే మేలు. మరణం వల్ల బాధ అప్పటికప్పుడు మాత్రమే. దరిద్ర్యం వల్ల బతికి ఉన్నన్నాళ్ళూ బాధలే. శరీరం, మాట తీరూ, పేరూ, బుద్ధీ మారకపోయినా, ధనం పోగొట్టుకొన్నవాడు మునుపటి లాగా బతకలేడు. ఇదొక చిత్రం!”

ఈ మాటలు విని నాకు చాలా దుఃఖం వచ్చింది. ఇక అక్కడ నేను ఉండలేకపోయాను. నా బాధ ఎవరితో చెప్పుకొనేదీ కాదు. ధనం పోగొట్టుకొన్న విషయమూ, మనోవ్యథా, ఇంటిలో సభ్యుల తప్పుడు ప్రవర్తనా, మోసమూ, అవమానమూ యివన్నీ నలుగురికీ చెప్పుకొనే విషయాలు కాదంటారు పెద్దలు. దైవం అనుకూలించక, పరిస్థితులు చెడిపోయినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరు వదిలిపెట్టి, ఏ అడవిలోనో తలదాచుకోవటం సుఖం. అభిమానం కలవాడు పూలగుత్తిలాగా నలుగురి తలల మీదనన్నా ఉండాలి, లేదా అడవిలో ఏకాంతంలో వాడిపోవాలి. ఇక్కడ ఉండి, వాళ్ళనూ వాళ్ళనూ బిచ్చమడుగుతూ బతకటం కంటే దురవస్థ మరోటి ఉండదు. ఒక్క అల్పుణ్ణి యాచించటం కంటే నిప్పులో పడి చావటం మేలు. అబద్ధం చెప్పటం కంటే, మౌనంగా ఉండటం మేలు. యితరుల సొమ్ము దొంగిలించటం కంటే, బిచ్చమెత్తుకోవడం మేలు. ఎవరి పంచనో పడుండి, వాళ్ళు వేసే బిచ్చం మీద బతికేకంటే అసహ్యం మరోటి ఉండదు.

ఇలా అనుకొంటూనే ఉన్నాను కానీ, ఆశ వల్ల ఆ యిల్లు వదిలిపెట్టలేదు. అక్కడే ఉంటూ, పోయిన సొమ్మంతా మళ్ళీ సంపాదించుకోవచ్చునన్న ఆశతో యింకా కొన్నాళ్ళు అక్కడే ఉన్నాను. ఆశ వల్ల భ్రాంతి కలుగుతుంది. దానివల్ల దుఃఖం. దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే బుద్ధిమంతుడు దురాశకు దూరంగా ఉండాలి.

బుద్ధిలేక నేను అక్కడే ఉండిపోయాను. నాతో విసిగిపోయి, ఓరోజు చూడాకర్ణుడు యిక ఊరుకోలేక నామీద ఒ కర్ర విసిరాడు. అది తగిలిఉంటే అప్పటికప్పుడే నా ప్రాణం  పోయేది. కానీ అదృష్టవశాత్తూ నేను తప్పించుకొన్నాను కానీ, ఆ దెబ్బతో నాకు జ్ఞానోదయమయింది. “ఆహా,యీ ప్రపంచంలో అన్ని కష్టాలకూ కారణం ధనం  మీద అశే. అది వదిలేయ గలిగితే లోకంలో అంతకంటే సుఖం ! మరోటి లేదు. ఆశ వదిలేసినవాడు అన్ని రకాలా ఉత్తముడు. పండితుడంటే వాడే సజ్జనుడంటే వాడే ఊరికే పొట్టకోసం పదిమందినీ వేధించకుండా, దొరికినదాంతో తృప్తిపడేవాడు ధన్యుడు. అన్ని రకాలుగా సుఖపడతాదు. మనం చేసుకొన్న కర్మబట్టి, మనకు రావాల్సినవి రానే వస్తాయ్‌. దానికోసం తిప్పలు పడటం నిరర్థకం.

ఈ సన్యాసుల మఠం నా తాత, ముత్తాతలు సంపాదించిపెట్టిన అస్తేమీ కాదు. యిన్ని అగచాట్లు పడుతూ నేను యిక్కడ ఉండటం యింక అనవసరం. ఈ సన్యాసి చేత రోజూ దెబ్బలు తినే కంటే, ఏదో అడవిలో దూరి కాలం గడపటం మంచిది. బండరాయి మధ్యలో దాక్కొన్న కప్పకు కూడా ఆహారం చూపించే ఆ దయామయుడయిన భగవంతుడు నాకు దోవ చూపించకపోతాడా?’ అనుకొంటూ, అక్కణ్నుంచి బయలుదేరి  ఊరు వదిలిపెట్టి, అడవిలోకి వెళ్ళిపోయాను. ఆ అడివిలోనే ఆకులూ, అలములు తింటూ, కుంటల్లో నీరు తాగుతూ, చెట్లకింద ప్రశాంతంగా కాలం గడిపాను. తర్వాత నాకు ఈ లఘుపతనకుడితో స్నేహం కుదిరింది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాం. ప్రాణానికి హాయిగా ఉంది.

మంచిమిత్రులతో కలిసి కాలం గడపటం కంటే గొప్ప సుఖం లోకంలో లేదు. అసలీ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప ఆనందాలు రెండు. ఒకటి, చక్కటి పుస్తకాలు చదివి సంతోషించటం, రెండు మంచి మనసు గల మిత్రులతో కాలక్షేపం.” అంటూ హిరణ్యకుడు తన కథ ముగించాడు. (పిల్లాలూ, ఈ కథల్లో జంతువులు మనుషులలాగే మాట్లాడుకొంటున్నట్లు చెప్పుకొంటున్నాం. అవి చెప్పుకునే మాటలు నీతులు! మనలాంటి మనషులకోసం అని మర్చిపోవద్దు!) .

                                3

శ్రద్ధగా విన్న మంథరుడు తలపంకించాడు.

“నువ్వు చెప్పినదాంట్లో కొంతవరకూ నిజం ఉన్నది. కానీ ధనం శాశ్వతంగా ఉండేది కాదు. వస్తుంటుంది పోతుంటుంది. ఆరోగ్యమూ, యౌన్వనం అవీ అంతే. నిలబడేవి కావు. నదీప్రవాహంలాగా పరిగెత్తిపోయేవే. అసలు జీవితమే నీటిబుడగ లాంటిది, నిలిచేది కాదు. అయితే బుద్ధిమంతుడు ఎప్పుడు ధర్మకార్యాలు చేస్తూకాలం గడపాలి. లేకపోతేకాలం దాటిపోయిన తర్వాత, అయ్యో మంచిపనులు చేయలేకపోయానే అని పశ్చాత్తాపపడాల్సిందే. నువ్వు సొమ్ము అవసరాన్ని మించి కూడబెట్టి దాచిపెట్టావు. దానివల్లే అన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది .

చెరువులో నీళ్ళు ప్రవహిస్తూ పోవాలి. అలాగే సంపాదించిన సొమ్ము మంచిపనులకు, దానాలకు' ఖర్చుపెట్టాలి. తను తినకుండా ఉరికే డబ్బు కూడబెడుతూ పోతే, దానివల్ల సుఖం లేదు, కష్టమే. మరొకడి బరువు మన నెత్తిన పెట్టుకొని మోస్తూ తిరిగితే దానివల్ల లాభం ఏమిటి? ధనం అన్నది తను అనుభవించాలి, కొంత యితరులకి దానం చెయ్యాలి. ఈ రెండూ చేయలేకపోతే ఆ ధనం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, పిసినారివాడు ఎంత డబ్బున్నా దరిద్రుడే.

నిజానికి పిసినారి కంటే దరిద్రుడే నయం. వాడికి డబ్బు సంపాదించి దానికి కాపలాకాసే చాకిరీ లేదు. పీనాసివాడు తను తినడు, పేదవాళ్ళకు పెట్టడు. చివరికాసొమ్ము నేలపాలే, లేదంటే దొంగల పాలు. తెలివయినవాడు డబ్బు సంపాదించాల్సిందే, కానీ మరీ ఎక్కువగా కూడబెట్టాలని అనుకోగూడదు. మితి లేకుండా డబ్బు దాచాలను కొనేవాడు పాతకథలో దీర్ఘరావమనే నక్కలాగా నాశనమయిపోతాడు.‘ కథ తెలుసా నీకు? చెప్తాను, విను” అంటూ మరో కథ మొదలెట్టాడు మంథరుడు.


మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి....
                  ధన్యవాదలు...

                        ఇంకా ఉంది...

    తరువాత కథ: నక్క 🦊 దురాశ

Please visit the blog.share and comment the story...enjoy by reading the story

గుడ్డి గద్ద-3


                    గుడ్డిగద్ద - 3

                      లఘుపతనకుడు-కాకి
                      చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                      హిరణ్యకుడు-ఎలుక




నేను యిలాంటి నరాలు పళ్ళతో తాకకూడదు. ఇది నాకో వ్రతం. అంచేత, నువ్వు మరోలా అనుకోకు. ఇదిగాకుండా నువ్వు ఏ ఉపకారం కోరినా నేను చెయ్యడానికి సిద్దం!” అంటూ దూరం వెళ్ళిపోయింది, రైతు ఎప్పుడొచ్చి జింకను చంపేస్తాడా చూద్దామనుకొంటూ. జింకకు నక్క జిత్తులమారితనం అర్ధమయిపోయింది. ఏం చేస్తుంది? తన దురదృష్టాన్ని తిట్టుకొంటూ అలాగే వలలో చిక్కి ఉండిపోయింది. కొంతసేపటికి కాకి కూడా జింకను వెతుక్కుంటూ అక్కడికి వచ్చి జింక అవస్థ గమనించింది. ఏం చేయగలదు? ఆ వల తాళ్ళు కొరకటం కాకి వల్ల అయ్యే పని కాదుమరి. “మన నక్కబావ ఎక్కడ? అతనికీ విషయం తెలుసా?” అని అడిగింది. “తెలియకేం! తెలిసే, నా మాంసం ఎప్పుడెప్పుడు భోంచేద్దామా అని చూస్తూ యిక్కడే ఎక్కడో దాక్కున్నాడు” అంది జింక. 

“నేను ముందే చెప్తే నువ్వు వినలేదు, చూశావా యిప్పుడేమయిందో? చెడ్డవాడు మంచివాళ్ళకు కూడా కీడే చేస్తాడు. నేను వాడికి కీడు చేయకపోతే వాడు నాకెందుకు కీడు చేస్తాడు అనుకోవటం నీ పొరపాటు. ‘పొయ్యేకాలం దాపరించిన వాళ్ళు ఆరుతున్న నూనెదీపం వాసన పసిగట్టలేరు. అరుంధతీ నక్షత్రం చూడలేదు. స్నేహితుల మంచిమాటలు పట్టించుకోలేరు’ అని పెద్దలు చెబుతారు. 

“ఊరికే ఎదురుగుందా యిచ్చకాల కబుర్లు చెప్పి, వెనక గోతులు తవ్వే స్నేహితులు పాలలా కనిపించే విషపుకుండ లాంటివారు. వాళ్ళ సావాసం ఎంత త్వరగా మానుకొంటే అంత మంచిది” అన్నది కాకి. 

జింక నిట్టూర్చింది : “నువ్వు చెప్పేది అక్షరాలా నిజం. మంచివాళ్ళతో  స్నేహం వల్ల అన్నీ లాభాలే, దుర్మార్గుడితో స్నేహం వల్లా అన్నీనష్ఠాలే. జిత్తులమారి నక్కతియ్యటి మాటలు విని మోసపోయాను. దానికి నాలిక తీపి, లోపల విషమని తెలుసుకోలేకపోయాను” అంటుండగానే దూరంలోరైతు పొలం వైపే నడిచి వస్తూ కనిపించాడు. 

కాకి యిలా అంది: “మిత్రమా! అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడేమో ఆ రైతు దుడ్డుకర్ర తీసుకొని యిటే వస్తున్నాడు. నువ్వు తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం నాకు తడుతున్నది. నువ్వు ఊపిరి బిగించి, కాళ్ళు చాచి బిగుసుకుపోయి చచ్చిపోయినట్లు నటిస్తూ పడుకో. నేను నీ మీదెక్కి నీకళ్ళు పొడుస్తున్నట్లు నటిస్తాను. రైతు యిదంతా చూసి నిజంగా నువ్వు చచ్చిపోయావనుకొని, కొంచెం ఏమన్నా అజాగ్రత్త చూపిస్తే, నేనొకసారి కావుమని అరుస్తాను. వెంటనే నువ్వు లేచి పారిపోవాలి”. సరేనంది జింక. 

రైతు వచ్చి చూశాడు. జింక చచ్చిపోయిందనుకొని, వలను తీసేశాడు. తీయగానే కాకి అరిచింది. జింక చటుక్కున లేచి, పరిగెత్తి పోయి ప్రాణాలు దక్కించుకొంది. 

జింక చేసిన మోసానికి రైతుకు పట్టరానంత కోపం వచ్చింది. చేతిలో దుడ్డుకర్ర బలంగా విసిరాడు జింక మీదికి. అదృష్టవశాత్తు అది జింకకు తగలలేదు. ఆ పరిసరాల్లోనే కాచుకు కూర్చొన్న నక్కకు తగిలింది. దాని తాకిడికి నక్క చచ్చిపడిపోయింది. 

అంటూ కథ ముగించిన హిరణ్యకుడు, లఘుపతనకుడితో “ఈ కథతో తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే, తియ్యటి మాటలతో, స్నేహం నటించి, యితరులకు హాని చేద్దామనుకొన్నవాడు తనే నాశనమయిపోతాడని” అన్నాడు. 

మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి....
                  ధన్యవాదలు...

                        ఇంకా ఉంది...

    తరువాత కథ: ఎలుకతో  సావాసం

 Please visit the blog.share and comment the story...enjoy by reading the story

గుడ్డిగద్ద-2

                గుడ్డిగద్ద-2




ముసలిగద్ద ఈ మాటలన్నీ నమ్మేసింది." బాధపడకు కొత్తవాళ్ల స్వభావం ఎలా ఉంటుందో మొదటే తెలియదు కదా! కనుక నీ సంగతి తెలియక గట్టిగా మాట్లాడాను.తప్పు నాదే యింక అది వదిలేసెయ్‌. ఇక ముందు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు, పోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు” అన్నది. 

అప్పటినించీ పిల్లి, గద్దతో 'స్నేహం నటిస్తూ ఆ చెట్టు తొర్రలోనే ఉండిపోయింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత, పిల్లి ముసలిగద్దకు తెలియకుండా ప్రతిరోజూ, అర్ధరాత్రి చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షికూనల్ని గొంతు కొరికి చంపి, తొర్రలో పెట్టుకొని తినేయడం మొదలెట్టింది. 

ఆ పక్షులకు తమ పిల్లలెలా మాయమవుతున్నయ్యో అర్ధంగాక అన్నిచోట్లా వెతకటం మొదలెట్టినయ్. ఆ విషయం తెలుసుకొని ఓరోజు పిల్లి చల్లగా పారిపోయింది. 

పక్షులను వెతకగా, వెతకగా చెట్టు తొర్రలో పక్షికూనల బొమికలు కనపడ్డయ్. ఈ ముసలిగద్దె రహస్యంగా తమ పిల్లల్ని పొట్టనపెట్టుకుందని అనుమానించి, పక్షులన్నీ కలిసి గద్దమీద పడి దాన్ని రక్కి, పొడిచి చంపేసినయ్‌. 

కనక, కొత్తవాళ్ళని తెలియకుండా నమ్మేస్తే కష్టాల్లో 
పడే అవకాశం ఉంది, అని కథ ముగించింది కాకి. కాకి యిలాంటి నీతి బోధించి జింకను కూడా సందేహంలో పడేయటం చూసి నక్కకు ఒళ్ళు మండిపోయింది. “చాలు చాల్లే, పెద్ద నీతి` చెప్పావు. జింక మొదట్లో నీతో ‘స్నేహం చేసినపుడు దానికి నీ గురించి మాత్రం ఏం తెలుసు? అప్పుడు నువ్వూ కొత్తే. కొత్తని సందేహిస్తే మీకు యిలా చక్కగా స్నేహం కుదిరేదా? నువ్వు ముందొచ్చావు కాబట్టి యిప్పుడు నోటికొచ్చినట్టూ మాట్లాడుతున్నావ్‌, నీకే అన్ని తెలిసినట్లు. చెట్టులేని చోట ఆముదం చెట్టే మహావృక్షమని సామెత చెప్తారు. అలాగ, మహానుభావులు లేనిచోట అల్పబుద్ది వాళ్ళమాట చెల్లుతుంది. వీడు మనవాడు, వీడు పరాయివాడని లెక్కలు అల్పులకి. మహాత్ములకి ప్రపంచమంతా ఒకటే కుటుంబం. అందరూ కావలసివవాళ్ళే. ఎందుకీ లేనిపోని అనుమానాలు? నువ్వూ నేనూ, ఈ జింకా మనమందరం బంధువులమే. అందరం నాలుగురోజులు బతికి, తరువాత వెళ్ళిపోయవాళ్ళమే. ఈ ప్రపంచం ఉన్నన్నాళ్ళు బతకబోతున్నామా? యముడు ఏదోరోజు మనల్ని మింగేయటానికి సిద్దంగా కాచుకొనేఉన్నాడు. ఈ మూన్నాళ్ళ ముచ్ఛటలో అనుమానాలూ, శత్రుత్వలూ ఎందుకూ? 

ఉన్నన్నాళ్ళూ అందరిచేత మంచి అనిపించుకొని అందరిలోనూ  స్నేహంగానే ఉందాం” అని పెద్ద ఉపవ్యాసమిచ్చింది.

జింకక్కూడా ఈ వాదాలన్నీ అనవసరం అనిపించింది “ఉన్న నలుగురం నాలుగురోజులు కలిసి మెలిసి ఉండటమే సుఖం. వీడు మిత్రుడూ, వీడు శత్రువూ అని మొహం చూడగానే చేప్పలేం” అంది. 

కాకి కూడా యిదంతా విని సరేనంది. కాకీ, జింకా, నక్క కొన్నాళ్ళు ఆ అడవిలో సావాసంగానే గడిపాయి. 

ఓరోజు నక్క జింకను తనతోపాటు తీసికెళ్ళి ఒక పంటపొలం చూపించింది. ఆ పొలంలో పంట బాగా ఏపుగా పెరిగి ఉంది.“ జింక రోజూ ఆ పొలంలో పడి కడుపునిండా మేయడం మొదలెట్టింది. ఆ పొలం యజమాని చూస్తూ ఊరుకోడు గదా! “ఈ జింక ఏదో యిక్కడ బాగా మేయడం మరిగింది. నా పంట నాశనం చేస్తుంది. దీన్ని ప్రాణాలతో వదిలిపెట్టను” అనుకొని, ఒకనాడు పొలంలో కనపడకుండా వల సరిచేసి యింటికెళ్ళాడు. అలవాటు ప్రకారం జింక మేత కోసం వచ్చి వలలో చిక్కుకుపోయింది. 

ఎలా బయటపడుతుంది? “ఎంత దురదృష్టం, యిక్కడ చిక్కుపడిపోయాను! ఇప్పుడు నక్క వస్తే ఏదో ఉపాయం ఆలోచించి నన్ను బతికిస్తుంది” అని ఆలోచిస్తూ కూర్చొంది. 

నక్కరానే వచ్చింది. దాని ఆలోచన వేరు. “యిన్నాళ్ళకి జింక వలలో పడిపోయింది. యిప్పుడు రైతు వస్తాడు. తన పైరంతా మేసి నాశనం చేసిన జింకను ప్రాణాలతో వదలడు. జింక చావు ఖాయం. నాకూ బోలెడంత మాంసమూ, ఎముకలూ దొరక్కమానవు. ఇవాళ నాకు పండగే” అనుకొంటూ వల్లో పడిపోయిన జింకకు దగ్గిరగా వెళ్లింది. 

నక్కను చూసిన జింకకు ప్రాణం లేచొచ్చింది. అమ్మయ్యా! యింక బ్రతికినట్లే అనుకొంది. “నక్కబావా, నీకోసమే చూస్తున్నాను. రైతు వచ్చే వేళయింది. అతనొచ్చె లోపు ఈ వల తాళ్లు కొరికిపెట్టావంటే నేను బతికి బయటపడతాను. త్వరగా కొరికెయ్యవా?” అంది. 

మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి....
                  ధన్యవాదలు...

                        ఇంకా ఉంది...

    తరువాత కథ: గుడ్డిగద్ద-3

 Please visit the blog.share and comment the story...enjoy by reading the story


గుడ్డిగద్ద-1



                       గుడ్డిగద్ద-1


                   


"పూర్వం గంగానది ఒడ్డున ఓ జువ్విచెట్టు తొర్రలో జరద్గవం అనే గద్ద ఉండేది. అది గుడ్డిది. పైగా మసలిదయిపోయింది. అంచేత, ఆ చెట్టుమీద గూళ్ళు కట్టుకొని ఉండే యితర పక్షులు కొన్ని దానిమీద దయ తలిచి, రోజూ తాము తెచ్చుకోనే ఆహారంలో కొంచెం దానికీ పంచేవి. అలా బతుకుతూ ఉండేది ఆ గుడ్దిగద్ద. పక్షులు ఆహారం కోసం పగలు బయటికి వెళితే, ఆ పక్షుల గూళ్ళలో ఉండిపోయిన పక్షిపిల్లలకు కొంచెం తోడుగా, కాపలాగా ఉండేది.

“ఓరోజు ఆ చెట్టు దగ్గరికి ఓ పిల్లి వచ్చింది. దానిపేరు దీర్ఘకర్ణం. పక్షులు లేనపుడు, ఎలాగయినా చెట్టెక్కివాటి గూళ్ళలో ఉన్న పక్షి పిల్లలని చంపి తినేయాలని దాని ఆలోచన. పిల్లి వచ్చినట్టు, గుడ్డి గద్దకు తెలియలేదు కానీ, పక్షి పిల్లలు మాత్రం పిల్లిని చూసి భయంతో కేకలు పెట్టాయి. ఆ శబ్దం విని, గుడ్డిగద్ద "ఎవరొచ్చారు?" అని బిగ్గరగా అరిచింది.

ఆ అరుపుకు పిల్లి భయపడిపోయింది. గద్ద గుడ్దిదని దానికి వెంటనే తెలియలేదు. “చచ్చాను, మరీ దగ్గరికి వచ్చేశాను. తప్పించుకోవాలంటే మార్గం లేదు. అయినా రోటిలో తలపెట్టి, రోకలి దెబ్బకు భయపడి ఏం లాభం? చేసిన పొరపాటు చెయ్యనే చేశాను. ఇప్పుడు బయటపడాలంటే ఈ గద్దకు ఏదో మాయమాటలు చెప్పి నమ్మించటమే తప్పా మరో ఉపాయం లేదు“ అనుకొని గద్ద ఎదురుగా నిలబడ్దది.

“అయ్యా నమస్కారం!” అన్నది.

“ఎవరు నువ్వు?” గద్దించింది గద్ద.

“నేనొక పిల్లిని. నాపేరు దీర్ఘకర్ణం”

“అయితే యిక్కడేం చేస్తున్నావు. తక్షణం యిక్కణ్ణించి పో, లేకపోతే చంపేస్తాను.”

“ముందు నే చెప్పేది వినండి. తరువాత నన్ను చంపాలో, చంపక్కర్లేదో మీరే తేల్చుకోండి. మంచిచెడ్డలు తెలుసుకోకుండా, దగ్గరికొచ్చిన వాళ్ళందంనీ చంపటం ధర్మంకాదు”.

“త్వరగా చెప్పు, యిక్కడికెందుకొచ్చావ్‌ నువ్వు?” మళ్ళీ గద్దించింది గద్ద.

"నేను సాధుజంతువును. పుణ్యం కోసం రోజూ యిక్కడ గంగానదిలో స్నానం చేయటానికి వస్తూ ఉంటాను. నేను మాంసాహారం తినటం ఎప్పుడో మానేశాను. బహ్మచారిని, చాంద్రాయణ వ్రతం చేసుకొంటూ ఉన్నాను. ఇక్కడి పక్షులన్నీ మీరు పెద్దలనీ, నీతిశాస్త్రం తెలిసినవాళ్ళనీ, చాలా మంచివారనీ, పండితులనీ ఎప్పుడూ చెప్పుకొంటూ ఉంటే విన్నాను. ఎప్పణ్ణించో మిమ్మల్ని కలవాలని నా కోరిక, మీలాంటి పెద్దల దగ్గిర నాలుగు మంచి నీతులూ, ధర్మాలు తెలుసుకోవాలని వచ్చాను. మీరు నన్నిలా చంపుతాననటం న్యాయం కాదు. శత్రువయినా, యింటికొస్తే మర్యాద చేయటం ధర్మం. అలా చేయకపోవటం గొప్ప పాపమని మీకూ తెలుసు గదా?” అని పిల్లి అనేసరికి, ముసలి గద్ద కొంచెం మెత్తబడింది.

“నువ్వు చెప్పేదీ నిజమే. కానీ ఈ చెట్టు మీద పక్షిపిల్లలెన్నో ఉన్నయ్‌. మామూలుగా పిల్లులకు ఈ పిట్టల మాంసమంటే మహాయిష్టం. అందుకని నిన్ను గద్దించి నిలదీయక తప్పలేదు.” అంది.

పిల్లి యిది విని చెవులు రెండూ మూసుకొంది.

“కృష్ణా, కృష్ణా! ఎంత మాటన్నారు! అసలు ఈ పిల్లి జన్మ ఎత్తటమే మహాపాపమని నేను కుమిలిపోతుంటే, అది చాలక పక్షిపిల్లల్ని తినేసి మరింత పాపం కూడగట్టుకొంటానా? ధర్మశాసస్త్రాలన్నిట్లోనూ, “అహింసా పరమో ధర్మః” అనే గదా నీతి బోధించారు, అంటే జీవహింస చేయకపోవటమే అన్నిటికంటే ముఖ్యమయిన ధర్మమనే గదా? జీవహింస చెయ్యని దయాళువులే స్వర్గానికి వెళతారు. భూతదయ మించిన ధర్మం లేదని నాకు తెలియదా? తెలిసి ఈ పసికూనలను తింటానా? నా పాడు పొట్ట నింపుకోవాలంటే 'ఈ అడవిలో యిన్ని చెట్లున్నాయి, ఏదో యింత శాకాహారం దొరక్కపోదు. ఈ చిన్న చిన్న పిట్టలను తినేసి, నరకానికి పోవాలని నేనెందుకు కోరుకొంటాసు?” అంటూ అతి వినయంగా మాయమాటలు వల్లించింది.
 
మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి....
                  ధన్యవాదలు...
 
                        ఇంకా ఉంది...
    తరువాత కథ: గుడ్డిగద్ద-2
 Please visit the blog.share and comment the story...enjoy by reading the story

జిత్తులమారి నక్క

                 జిత్తులమారి నక్క  

"అనగా అనగా మగధదేశంలో ఒక అడవి. ఆ అడవిపేరు మందారవతి. ఆ అడవిలో ఒక జింకా, ఒక కాకీ ఉండేవి. వాటికి మంచి సఖ్యత కుదిరింది. ఎన్నో సంవత్సరాలు అవి స్నేహంగా, హాయిగా తిరిగాయి. జింకకు ఆ అడవిలో మేత కావలసినంత దొరికేది. హాయిగా తిని ఆరోగ్యంగా, బలంగా ఎదిగింది.

ఓరోజు జింక అడవిలో అటూ యిటూ గెంతులేస్తూ ఆడుకౌంటుంటే ఓ నక్క దాన్ని చూసింది. నక్కకు కళ్ళు కుట్టినయ్. “ఎంత బలంగా బలిసిందీ ఈ జింక! దీన్ని చూస్తే, ఎప్పుడెప్పుడు దీన్ని చంపి, ఆ మాంసం తినగలనో అని నాకు నోరూరిపోతున్నది. దీన్ని చంపటానికి ఏదయినా మంచి ఉపాయం ఆలోచించాలి” అనుకొన్నది.

జింకకు దగ్గిరగా వెళ్ళింది. “మిత్రమా, బావున్నావా?” అని అడిగింది కుశలప్రశ్నగా.

జింక బెదిరిపోయి, “నువ్వెవరో నాకు తెలియదు, నా
జోలి నీకెందుకు?” అంటూ అక్కన్నించి పారిపోబోయింది. “భయపడకు, నేను నక్కను. నా పేరు సుబుద్ది. నావల్ల నీకేమీ భయంలేదు. ఎటొచ్చీ నేనే ఈ అడవిలో ఓంటరిగా బతుకుతున్నాను. నా తోటి నక్కలన్నీ ఈ అడవి వదిలేసి ఎటో వెళ్ళిపోయాయి. ఇప్పుడిక్కడ ఎవరూ తోడు లేకుండా ఒక్కడినీ చావలెక బ్రతుకుతున్నాను. నిన్ను చూడగానే ఎందుకో నాతోటివాళ్ళందరినీ చూసినంత ఆనందం కలిగింది. దేవుడిలాంటి నిన్ను చూస్తేనే, నాకు నీతో సహవాసం చెయ్యాలని అనిపిస్తున్నది. నాలాంటి నిర్భాగ్యుడి ఒంటరితనం పోగొడితే నీకేం నష్టం చెప్పు?” అంటూ నక్క తన జిత్తులన్నీ ఉపయోగించి జింకకు నచ్చజెప్పింది.

జింక నమ్మెసింది. సరే, కానియ్యమని నక్కతో కలిసి తిరగటానికి ఒప్పుకొంది. సాయంత్రం దాకా తిరిగి, జింక తన యింటికి వెళుతూ నక్కని కూడా తనతో తీసుకెళ్ళింది. అక్కడ జింక కోసం కాకి కాచుకొని ఉంది.

నక్కతో పాటు వచ్చిన జింకని చూసి, ‘ఈ కొత్త 'స్నేహితుడినెక్కడ సంపాదించావ్‌?’ అంది.

“దీని పేరు సుబుద్ది, ఒంటరిదట. నక్క అయినా మంచిదానిలాగే కనిపిలచింది. మనతో స్నేహం చేస్తానంది’ సరేనన్నాను” అంది జింక.

కాకికిది నచ్చలేదు. “కొత్తగా వచ్చినవాళ్ళని అలా ఎలా నమ్మేస్తావు? ఇది ఏమాత్రం మంచిపని కాదు. గుణగణాలు తెలియకుండా కొత్తవాళ్ళతో స్నేహం చేయటం చాలా ప్రమాదం పిల్లికి చోటిచ్చి, గద్ద అన్యాయంగా చచ్చిపోయిన కథ ఉండనే ఉంది. మరిచిపోయావేమో, చెప్తా విను” అంటూ కథ మొదలెట్టింది.

మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...
                  ధన్యవాదలు...
                                         ఇంకా ఉంది...
    తరువాత కథ: గుడ్డిగద్ద మొదటి భాగము

కాకి-ఎలుక

మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...

                 కాకి-ఎలుక
                      లఘుపతనకుడు-కాకి
                      చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                      హిరణ్యకుడు-ఎలుక




పావురాలను సాగనంపేసిన తరవాత, హిరణ్యకుడు తన కలుగులోకి వెళ్ళిపోయాడు.

కానీ, ఈ జరుగుతున్న వ్యవహారమంతా పావురాల వెనకాలే వచ్చిన లఘుపతనకుడు చూస్తూనే ఉన్నాడు. ఎలుక పావురాలను విడిపించే వింత సంఘటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు.

ఎలుక కలుగు దగ్గర వాలాడు. “హిరణ్యకా! నువ్వు సామామ్యడివి కాదు. జరిగిన కథంతా నేను చూస్తున్నాను. నీలాంటి “స్నేహితులుండటం ఒక ఆదృష్టం. నాక్కూడా నీతో స్నేహం చేయాలనుంది. నాతో జట్టు కట్టరాదా, మనిద్దరం హాయిగా స్నేహంగా ఉండిపోతే, అది యిద్దరికీ మంచిదే కదా?” అన్నాడు.

హిరణ్యకుడు కలుగు లోపల్నుంచి, ‘అసలు నువ్వెవరివొ నాకు తెలియదు. నీతో స్నేహం ఎలా చేస్తాను?’ అని అడిగాడు. ఎవళ్ళ భటం వాళ్ళది. ‘నేను ఒక కాకిని. నా పేరు లఘుపతనకుడు” అని కాకి జవాబు.

“సరి సరి, నీతో నాకు ‘స్నేహం ఎలా కుదురుతుంది? అసలు కాకుల పనే ఎలుకల్ని వెతికి, చంపి తినటం. నేను బయటికి రాగానే నువ్వు నన్ను చంపేసి తినేస్తావు. ఎవరికి తగినవాళ్ళతో వాళ్ళు స్నేహం చేయాలి. నీతో ‘స్నేహానికి నేను ఒప్పుకొంటే, నా చావు నేను కోరి తెచ్చుకొన్నట్లే. మనిద్దరికీ 'స్నేహం కుదరదు. వెనకటికియిలాగే ఒక జింక, ఓ నక్కతో ‘స్నేహం చేసి ప్రొణం పోగొట్టుకొన్న కథ అందరికీ తెలుసు గదా?” అన్నాడు హిరణ్యకుడు.

“అదేం కథ? నాకు తెలియదు, నాకు చెప్పవా?” అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడు కాకికి కథ చెప్పాడు.

                             ధన్యవాదాలు...
                                                           ఇంకాఉంది...
 తరువాత కథ:జిత్తులమారి నక్క..
       Please share and comment...

పులి-కంకణం & చిత్రగ్రీవుడి ఉపాయం

     మిత్రులారా ఈ కథ అర్థం కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన కథలని చదవండి...

             పులి 🐯 కంకణం



ఓసారి ఒక ముసలిపులి ఒక చెరువులో స్నానం చేసి చేతిలో దర్భలు పట్టుకొని చెరువు ఒడ్డున కూర్చున్నది.ఎలా సంపాదించిందో గాని దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది.అది చేతిలో పుచ్చుకొని కూర్చొని ఉంది. ఆ దోవంటే ఓ బాటసారి నడిచి వస్తున్నాడు.పులి బాటసారిని పలకరించి,అతను భయపడుతుంటే భయపడొద్దని చెప్పింది.'నాయనా, ఇదుగో ఈ బంగారు కంకణం నాకు ఉపయోగపడదు. దీన్ని నీలాంటి వారికి దానం చెద్దామని‌‌ ఇక్కడ కాచుకొని కూర్చున్నాను. నేను ముసలి పులిని.నా వల్ల నీకు ఏ భయమూ లేదు. వచ్చి కంకణం తీసుకెళ్ళు' అని పిలిచింది.భటసారికి బంగారం చూడగానే ఆశ కలిగింది.
'ఈ రోజు నా అదృష్టం బాగుంది. అందుకే అయాచితంగా బంగారు కంకణం దొరుకుతుంది' అనుకొని బాటసారి ధైర్యం చేసి, కొంచెం దగ్గరికి వచ్చాడు.'ఇదిగో చూడు,బంగారు కంకణం! మేలిమి బంగారం ఏల మెరుస్తున్నదో' అని పులి చేతిలో కంకణాన్ని ఊపుతూ, బాటసారిని మరింత ఊరించింది.
మరింత దగ్గరికి వెళ్ళడానికి బాటసారి జంకాడు.'బంగారు మేలిమి బంగారమే కానీ నువ్వే క్రూర జంతువువి. నిన్ను నమ్మడమెలా?' అన్నాడు.
పులి అన్నది ' ఓ బాటసారీ! నేను చిన్నప్పుడు చాలా పాపాలూ,తప్పుడు పనులు చేశాను.ఎన్నో ఆవుల్నీ, ఎంతమందినో మనుషుల్నీ చంపి తినేశాను.నా పాపాల వల్లే నా భార్యాపిల్లల్ని పోగొట్టుకున్నాను. ఎకకినయిపోయ్యానూ. ఓ రోజు ఒక పుణ్యాత్ముడు కనిపించాడు. జీవితంలో ఇక ముందెప్పుడూ అలాంటి పాపాలు చేయకుండా మంచిగా బతకమని ఉపదేశం చేసాడు. ఆరోజు నుండి నేను జీవహింస చేయకుండా పవిత్రంగా బతుకుతున్న.పైగా ఇప్పుడేమో పూర్తిగా ముసలితనం వచ్చేసింది. పళ్ళు ఊడిపోయినయ్. గోళ్ళు లేవు.మునుపటిలా బలం లేదు.నా వల్ల నీకు ఏ ప్రమాదం లేదు. నన్ను నమ్ము. నువ్వేమో పేదవడివి, మంచివాడివి.కనక నీకు న దగ్గరున్న బంగారం దానం చేసి పుణ్యం సంపాదించుకొంటాను.నువ్వు ఈ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ దానం తీసుకో '.
బాటసారికి ఇది విని ఇంకా ఆశ పెరిగింది. ' నిజమే, ముసలి పులి చావడానికి సిద్దంగా ఉంది.తననేం చేస్తుంది? వదిలేసి పారిపోతే, బంగారు కంకణం చెయ్యిజారిపోతుంది.ప్రతి దానికి భయపడితే ఎలా?' అనుకున్నాడు. పులి చెప్పినట్లు,స్నానం చేసేందుకు చెరువులో దిగాడు.ఆ చెరువులో పెద్ద ఊబి ఉంది.ఆ లోతయిన ఊబిలో బాటసారి ఇరుక్కుపోయాడు.బయటకి రాలేకపోయాడు.
' అయ్యో, ఊబిలో దిగిపోయావా? నేను బయటికి లాగుతాను. చెయ్యి యివ్వు' అంది పులి. బాటసారి పులి చేతిలో చిక్కిపోయాడు.పులి అతన్ని చెయ్యి పట్టి లాగేసి, చంపి, తినేసింది.బాటసారి ఆశకుపోయి అలా ఊబిలో చిక్కుకోకపోతే,అతని వెంబడి పరిగెత్తే బలం పులికి లేదు. అందుకే అది ఈ ఎత్తు వేసింది.దురాశ వల్ల బాటసారి పులికి బలి అయిపోయాడు.
"అంచేత తొందరపడి ఏ పని చేయరాదు. ఆలోచించి పనులు చేసుకొంటే ప్రమాదాల్లో చిక్కుకోకుండ చల్లగా బతకొచ్చు. పదండి, వెళ్లిపోదాం"అన్నాడు చిత్రగ్రీవుడు.
ఆ పావురాల గుంపులో ఓ ముసలి పావురం ఉంది. చిత్రగ్రీవుడి మాటలు విని పెద్దగా నవ్వింది."ఏమి పిరికి రాజువయ్యా, పిచ్చి పిచ్చి కథలు చెబుతున్నావు. ఇలాంటి సందర్భాల్లో వయసుమళ్ళిన నాలాంటి అనుభవజ్ఞుడి మాట వినాలి. ఊరికే ప్రతి విషయానికి ఇలా భయం
పెట్టుకోకూడదు.ప్రతిదానికీ భయపడితే తిండి ఎలా దొరుకుతుంది? తిండి లేకుండా బ్రతకడం ఎలా? అసుయపడేవాడు, అన్నీ అసహ్యిచికొనేవడూ, ఎప్పుడూ విచారిస్తూ కూర్చునేవాడూ, కోపిష్ఠివాడూ, ప్రతిదానికీ సందేహించేవాడూ,పరుల సొమ్ము తిని బతికేవాడూ అనే ఈ ఆరు రకాల మనుషుల,ఎప్పుడూ దుఃఖమే కలుగుతుంది. సుఖంగా ఉండాలంటే ఈ గుణాలు వదిలేయాలని పెద్దవాళ్ళు చెప్తారు. అంచేత సందేహించటం మాని, కిందకు దిగి ఆ నూకలు కడుపునిండా తిందాం పదండి' అంది.
పావురాలన్నీ ఆ మాట మీద బిలబిలా దిగిపోయి నూ ఆశపడి, బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి.
చూశారా, దురాశ వల్ల ఎంత ప్రమాదమో! అన్ని తెలిసినవాళ్ళు, తెలివైనవాళ్ళు కూడా అప్పుడప్పుడూ దురాశపడి ఆపదలో చిక్కుకొంటారు.
కానీ, దాంతో కథ అయిపోలేదు.
    

         చిత్రగ్రీువుడి ఉపాయం






వలలోపడ్డ పావురాలన్నీ తప్పు సలహా చెప్పిన ముసలిపావురాన్ని బాగా తిట్టేశాయి. “నువ్వు పెద్దవాడివని నీ మాట విని ఇలా యిరుక్కుపోయం. తెలివితేటలున్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ కేవలం వయసు పెరగ్గనే ’పెద్దతనం ఎలా వస్తుంది?” అని తిట్టిపోశాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలని వారించాడు. “ఇది మన ముసలిపావురం తప్పుకాదు. ఆపద వచ్చే సమయంలో మంచి సలహాకు కూడా చెడ్మే ఉంటుంది. మన కాలం సరిగా లేకపోతే, యిలాంటి యిబ్బందులొస్తాయి. దాన్ని నిందించి లాభం లేదు. అది సలహా చెప్తే మాత్రం మన తెలివేమయి పోయింది? ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు బయటపడే మార్గం చూసుకోవాలి. కానీ, యిలాంటి మాటల వల్ల ఏమిటి లాభమ్? ధైర్యం తెచుకొని, యిందులోంచి బయటపడే మార్గం ఆలోచించండి. నాకయితే ఓ ఉపాయం కనిపిస్తున్నది. చెప్తా వినండి. ఒక్కసారిగా మనందరం కలిసి ఈ వలని ఎత్తి ఎగిరిపోదాం. ఇంత చిన్న పాపురాలం, ఇంత 'పెద్ద వలను ఎలా ఎత్తుతామని కంగారుపడద్ధు. పదిమందీ కలిస్తే ఎంత పెద్ద పనయినా యిట్టే చేసేయచు. గడ్డిపరక ఎ౦త సన్నగా ఉన్నా కొన్ని గడ్డిపరకలని కలిపి తాడుగా పేనేస్తే, ఆ తాడుతో
'ఎనుగుని కూడ కట్టేయెుచు. ఆలోచించండి. మీకు ఇంతకంటే మంచి ఉపాయం ఏదయినా తడితే చెప్పండి” అన్నాడు.

ఎంత ఆలోచించినా ఆ పాపురాలకు అంతకంటే మంచి ఉపాయం మరోటి తట్టలేదు. సరే, చిత్రగ్రీవుడి ఉపాయమే బాగుందని నిశ్చయం చేసుకొని, అవన్నీ కలిసి ఒక్కుమ్మడిగా ఎగిరాయి, వలతో సహా!

పొదలోనించి చూస్తున్న బోయవాడు, యిది చూసి బిత్తరపోయాడు. “అరె, ఎంత ఆశ్చర్యం! యిలా పిట్టలు వలతో సహా ఎగిరిపోవటం ఎప్పుడూ చూడలేదు. ఏం తెలివి! అయినా, యివి యిలా ఎంత దూరం పోతాయో అదీ చూస్తాను” అనుకొంటూ ఆకాశంలో ఎగురుతున్న పావురాలను చూస్తూ, వాటి వెంట తను భూమి మీద పరిగెత్తసాగాడు.

ఈ వింతంతా చూస్తున్న లఘుపతనకుడు (మరిచిపోయారా, మన కథ మొదట్లో వచ్చిన కాకి) కూడా ఆ పావురాల వెంబడి ఎగురుతూ వెళ్ళాడు. పక్షులు చూఫుమేర దాటగానే, ఇక భోయవాడు నిరాశ పడిపోయి ఇంటికి వెళ్లిపోయాడు.

            “ఇప్పుడేం చేద్దాం? ఇలా ఎంత దూరం వెళతాం?” అని అడిగాయి, పావురాలు చిత్రగ్రీవున్ని..

“లోకంలో తల్లీ, తండ్రీ, స్నేహితుడూ ఈ ముగ్గురే కాపాడేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళకు ప్రయోజనం ఉంటేనే మన సంగతి పట్టించుకుంటారు. నాకో స్నేహితుడున్నాడు. వాడు ఎలుకల రాజు. గండకీవది ఒడ్డున విచిత్రవనమనే అడవిలో ఉంటాడు. వాడు ఈ వల తాళ్ళను కొరకగలడు. అక్కడికి పోదాం పదండి” అన్నాడు చిత్రగ్రీవుడు.

పావురాలన్నీ ఒప్పుకొని ఎగురుతూ వెళ్ళి హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. పావురాల గుంపు చేసే గోల విని హిరణ్యకుడు ముందు భయపడిపోయాడు. కలుగు లోపలికి వెళ్ళి దాక్కున్నాడు.

అప్పుడు చిత్రగ్రీవుడు కలుగు దగ్గిరగా వెళ్ళి “మిత్రమా, నేను నీ చెలికాడినే. చిత్రగ్రీవుడిని. నువ్వు భయపడాల్సిన పని లేదు. బయటికి వచ్చి నాతో మాట్లాడివెళ్ళవా?” అన్నాడు.

హిరణ్యకుడు చిత్రగ్రీవుడి గొంతు పోల్చేసుకొన్నాడు. చటుక్కున బయటికి వచ్చాడు. చిరకాల మిత్రుడిని చూచి ఎంతో సంతోషించాడు. ‘ఆహా! ఎంత అదృష్ఠం, చిత్రగ్రీవుడా, ఎన్నాళ్ళ తరువాత కనిపించావయ్యా! అయినా ఈ వలలో చిక్కుకొనిపోయి ఉన్నావేమిటి?’ అని ఆప్యాయంగా, ఆత్రంగా పలకరించి వల తాళ్ళు కొరకబోయాడు.

“పూర్వజన్మలో చేసిన ఏవో పాపాలకు ఇప్పుడీ ఫలం అనుభవిస్తున్నాను. చేసిన కర్మకు శిక్ష తప్పదులే. అయినా నువ్వు ముందు విడిపించాల్సింది నన్ను కాదు. నాతోటి పావురాలని ముందు విడిపించి, తరువాత నన్ను బయట పడేయటం న్యాయం” అన్నాడు.

హిరణ్యకుడు, “నా పళ్ళు కొంచెం సున్నితంగా ఉన్నయ్‌. ఈ వల తాళ్ళన్నీకొరికేసే శక్తి నాకు లేదనుకొంటాను, ముందు నిన్ను విడిపించనియ్యి. తర్వాత శక్తి ఉన్నంత వరకూ వల తాళ్ళు కొరికేసి,మిగిలిన పావురాలనీ కూడా రక్షిస్తాను" అన్నాడు.

చిత్రగ్రీవుడు మంచితనానికీ, సద్బుద్దికీ మారుపేరు, “అలాగయితే, హిరణ్యకా, ముందు శక్తీ ఉన్నంతవరకూ మిగిలిన పావురాలని బయటికి రప్పించు. ఇంకా శక్తి ఉంటే, అప్పుడే నా సంగతి చూసుకొందాం” అన్నాడు.

“నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది. ‘తనకు మాలిన ధర్మము, మొదలు చెడ్డ బేరము’ అని సామెత ఉండనే ఉంది గదా! నీ బాగోగులు మర్చిపోయి, నీ వాళ్ళను రక్షిస్తానంటే ఎలా?నువ్వు క్షేమంగా ఉంటేనే నీ వాళ్ళ సంగతి చూస్తావు నువ్వే బ్రతక్కపోతే, ఇంకా వాళ్ళెవరూ, నువ్వెవ్వరూ?” ప్రశ్నించాడు హిరణ్యకుడు.

“అది నిజమే. కానీ నా వాళ్ళు కష్టంలో ఉంటేచూసి సహించటం నా వల్లకాదు. మాంచివాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, నీ జీవితం దారపోసి అయినా వాళ్ళను రక్షించటం కర్తవ్యమని పెద్దలు చెప్పారు. నాలాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళలాంటి వాడిని నేను. వీళ్ళని ఆపదలోనించీ రక్షించకపోతే, నా రాచరికం వల్ల ఏమిటి వీళ్ళకు లాభం? ఏదో ఓ రోజు ఎలాగో నశించిపోయే ఈ శరీరం మీద అంత మోజు మానుకొని, నాలుగు కాలాల పాటు మంచిపేరు నిలిచిపోయేలా నలుగురికి ఉపకారం చేయటమే మంచిదని నాకనిపిస్తున్నది. అంచేత ముందు నా వాళ్ళని కాపాడు. తర్వాతే నన్ను” అన్నాడు చిత్రగ్రీవుడు.

చిత్రగ్రీవుడి మంచితనం చూచి హిరణ్యకుడికి ఎంతో ఆనందం కలిగింది. “చెలికాడా, ఎంత మంచి బుద్ధి నీది!నువ్వు మంచిచెడ్దలు బాగా తెలిసినవాడివి. నువ్వసలు మూడు లోకాలకూ రాజు కావాల్సినంత బుద్దిమంతుడివి” అని మెచ్చుకొని మెల్లిగా వల తాళ్ళన్నీ కొరికేసి, తన వాళ్ళ సహాయంతో పావురాలన్నింటికీ చక్కటి ఆతిథ్యం యిచ్చి సాగనంపాడు..
                      లఘుపతనకుడు-కాకి
                     చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                      హిరణ్యకుడు-ఎలుక
                            ధన్యవాదాలు.   
                                                      కొనసాగుతుంది...

తరువాత కథ: కాకి - ఎలుక
      Pls like,share and comment...

ఆపాయంలో కపోతాలు

         ప్రియమైన వ్యువర్స్ ఈ కథ అర్థం కావాలంటే నేను మొదట పోస్ట్ చేసిన కథని చదవండి మీకే అర్థమవుతుంది...


                                 మిత్ర లాభం





“రాజకుమారులారా, మన దగ్గర డబ్బూ, మంది, మార్బలం లేకపోయినా, మంచివాళ్ళు నలుగురు మనకు స్నేహితులుగా ఉంటే అనుకొన్న పనులు నెరవేర్చుకోవచ్చు. పాతరోజుల్లో ఓ కాకీ, తాబేలూ, జింకా, ఎలుకా స్నేహం చేసుకొని సుఖంగా బతికిన కథ ఒకటుంది , అది మీరు విన్నారా?” అన్నాడు విష్ణుశర్మ. ’ పిల్లలు కథలంటే చెవి కోసుకొంటారు కదా! “గురువుగారూ, ఆ కథేదో మాకు పూర్తిగా చెప్పండి” అన్నారు రాజుగారి కొడుకులు. విష్ణుశర్మ కథ చెప్పడం మొదలెట్టారు.



              ఆపాయంలో కపోతాలు 


గోదావరి గట్టుమీద ఓ పెద్ద బూరుగచెట్టు ఉంది దాని మీద ఎన్నో పిట్టలు గూళ్ళు కట్టుకొని నివసించేవి.పగలు తిండి కోసం తిరిగి, తిరిగి రాత్రికి గూటికి చేరేవి. ఆ పక్షులలో ఒక కాకి ఉండేది. దాని పేరు లఘుపతనకుడు.

ఓ రోజు తెల్లవారుతుండగానే కాకి మామూలుగా నిద్ర లేచింది. లేస్తుండగానే ఆ చెట్టు దగ్గర్లో తిరుగుతున్న భోయవాణ్ణి చూసింది.

“అయ్యో, పొద్దున్నే లేవగానే వీడి మొహం కనిపించింది. ఇదో అపశకునం. ఇవాళ ఏదో ఆపద కలగక తప్పేట్టు లేదు, వీలయినంత తొందరగా ఈ గూడు వదిలిపెట్టి దూరంగా పోయి, మళ్ళీ సాయంత్రం దాకా ఈ ఛాయలకు రాకూడదు, వీడి కంట్లో పడితే చంపేస్తాడు” అని బయల్దేరబోయింది.

బోయవాడు చెట్టు దగ్గిర్లో రెండు గుప్పెళ్ళు నూకలు చల్లి, వాటిమీద తన వల పరిచేసి, దూరంగా వెళ్ళి ఒక పొరలో దాక్కున్నాడు. ఆ నూకల కోసం ఏవయినా పిట్టలు వాలి, వలలో పడగలవని వాడి ఆశ.

కొంచెం సేపయిన తర్వాత, ఓ పావురాల గుంపు ఆకాశంలో ఎగురుతూ ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ పావురాల గుంపుకు ఒక రాజు. అతని పేరు చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుడు నేలమీద చల్లిన నూకలు చూశాడు. ఎత్తునించీ వల కనబడలేదు. కానీ చిత్రగ్రీవుడికి అనుమానం వచ్చింది. ఈ అడవిలాంటిచోట నూకలెలా వచ్చాయని. తోటి పావురాలతో ఇలా అన్నాడు : “ఈ అడవిలో ఇలా నూకలు చల్లి ఉన్నయంటే, ఇందులో ఏదో మోసం ఉంది. మనం వీటికి ఆశ పడకూడదు, అలా ఆశపడితే ప్రమాదం ఖాయం. ఆశపడి వెనకటికి ఓ బాటసారి అన్యాయంగా ముసలిపులి చేతిలో చిక్కి చచ్చిపోయాడు‘ ఏమఇందో తెలుసా? ఆ కథ చెప్తాను వినండి.
                    లఘుపతనకుడు-కాకి
                    చిత్రగ్రీవుడు-పావురాల రాజు
                                                     ఇంకా ఉంది.....

విష్ణుశర్మ కథ

       


అనగా అనగా ఒక దేశం . ఆ దేశనికి రాజు సుదర్శనుడు, అతని రాజధాని పాటలీపుత్రం. ఆయనకు సుఖసౌఖ్యాలకు కొదవేమీ లేదు. కానీ ఏదో ఒక దిగులు లేకుండా మనిషి ఉండడు కదా? ఆయన దిగులు తన పిల్లల గురించి.

ఆయన కొడుకులు బుద్దిమంతులే. కానీ గారాబం వల్ల, చిన్నతనం వల్లా ఎప్పుడూ ఆటలలో మునిగిపోయి, మిగిలిన విషయాలు అశ్రద్ధ చేసేవాళ్ళు.వాళ్ళు సరిగ్గా చదువులు చదువుకొని, శాస్త్రాలు నేర్చుకోవటం లేదని రాజుగారు ఎప్పుడూ దిగులుపడుతూ ఉండేవాడు. , ఓరోజు రాజుగారు తన కొలువులో కూర్చొని, వచ్చిన పండితులతో మాట్లాడుతుండగా, ఒక విద్వాంసుడు వచ్చి రెండు మంచి పద్యాలు చదివాడు. '  పరువంబు, కలిమి, దొరతన మరయమి యనునట్లీ వీని యందొకడొకడే

పొరయిన్చు ననర్థమువా

బరగినవో నాల్గు చెప్పవలయునె చెపుమా

పలుసరిదియముల దొలచును

వెలయిన్చు నగోచరార్ధ విజ్ఞానము లో

కుల కక్షి, శాస్త్రమయవ్రది

అలవడదెన్వనికి వాడె అరిధుడు జగతిన్‌

ధనమూ, అధికరం, కుర్రతనం, అవివేకం అనే ఈ నాల్గిటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీటిలో ఏ ఒక్క దాని వల్లనయినా మనిషి చెడిపోయే ప్రమాదాం ఉంది. నాలుగూ ఉన్నవాడు చెడిపోవటం మరీ తేలిక, అందుకే సరయిన చదువు చదువుకోవటం అవసరం’). దానివల్ల తెలివితేటలూ, వివేకమూ వికసిస్తాయి, మనిషికి విద్యె కన్ను విద్యలేని వాడు గుడ్దివాడితో సమానమే, అని ఆ పద్యాల అర్ధం

పండితుడు చదివిన పద్యాలు విని, రాజుగారికి మరింత దిగులు పెరిగింది. చదువు వదిలేసి, ఎప్పుడూ తోటిపిల్లలతో ఆటలతో కాలక్షేపం చేసే తన సుపుత్రులు గుర్తుకు వచ్చారు..’
                 

               “తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకొని మంచి పిల్లలు అనిపించుకున్నవారు పిల్లలు గానీ, మిగిలిన వాల్లెం పిల్లలు? వాళ్ళ వల్ల తల్లిదండ్రులకెం సుఖం? వంద గులకరాళ్ళకన్నా ఒక్కరత్నం మేలన్నట్టు, వందమంది మూర్ఖుల కన్నా గుణవంతుడయిన కొడుకు ఒక్కడు మేలు, అయినా గుణవంతులూ, విద్యావంతులూ అయిన పిల్లలని చూసి సంతోశాపడే భాగ్యం ఆందరికీ ఉండదు” అని కొంత బాధపడ్డాడు.

అంతలో ఆయనకు మరో ఆలోచన కూడా వచ్చింది. “అసలయినా నేనిలా ఊరికే బాధపడి ఏం లాభం, నేను మంచి గురువులచేత బాగా చదివిస్తానంటే నా పిల్లలు చదవనన్నారా? నేనే అశ్రద్ధచేసి, గారాభం చేసి వాళ్ళ చదువు విషయం నిర్లశ్యం చేస్తున్నాను. పిల్లలకు సరిగా చదువు చెప్పించే ప్రయత్నం చేయటం తల్లిదండ్రుల పని. సరయిన గురువును చూచి, పిల్లలను ఆయనకు అప్పగించక పోవడం నా తప్పు. పిల్లలను బాగా చదివిస్తే విద్వంసులవుతారు తప్ప పుట్టుకతో విద్వాంసులెక్కడ ఉండరు.  ప్రయత్నం  చేస్తే ఫలితం ఉంటుంది, ఊరికే ఆశపడటం వల్లా, దిగులుపడటం వల్లా ప్రయోజనం ఉండదు. ఎంత సింహమయినా ఆహారం కావాలంటే వేటాడాలి కాని, నోరు తెరుచుకొని పడుకొంటే ఆహారం నోట్లోకి దూరదు. కనుక మంచి గురువుని వెతకాలి” అనుకొన్నారు.

సభలో కూర్చొన్న పండితులను అడిగాడు : “ఎప్పుడూ ఆటలలో మునిగి, చదువు సంధ్యలు లేకుండా తిరుగుతున్న

నా పిల్లలకు చక్కగా నీతి శాస్త్రం నేర్పి వాళ్ళను మంచి  దోవలో పెట్టగలవారు మీలో ఎవరయినా ఉన్నారా?” అని.

విష్ణుశర్మ అనే పండితుడు లేచి నిలబడ్డాడు :

“రాజా! అదంత కష్టం కాదని నేననుకొంటున్నను.

కొంగకు మాటలు నేర్ఫటం కష్టం కానీ చిలకకు నెర్పటం కష్టం కాదు. మీ పిల్లలు రాజవంశంలో ఫుట్టినవాళ్ళు, వజ్రల గనిలో గాజుముక్కలూ ఉండవు.మంచిచివంశంలో గుణహీనులు పుట్టరు. కానీ ఎంత వజ్రాన్నయినా సానపడితేనే కంతివస్తుంది. కనుక ఓ ఆరునెలలు మీ పిల్లల్ని నాకప్పగిస్తే నేను వాళ్ళకు చక్కగా చదువుచెప్పి మంచి మార్గం లో పెడతాను” అన్నాడు.

“మీలాంటి గురువుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులు మంచి యోగ్యులపుతారు. పూలు కట్టిన దారానికి పూలవాసన అబ్బినట్లు, సజ్జనులతో తిరిగిన సామాన్యులు కూడా సన్మార్గంలో  మసలుతారు. మంచి సావాసంలో వారు వీరులవుతారు. ఈ పిల్లలకు బాగా విద్యనేర్పి వీళ్ళ కళ్ళు తెరిపించండి” అని రాజు తన పిల్లలను విష్ణుశర్మకు అప్పజెప్పారు.

విష్ణుశర్మ ఆ పిల్లలని తీసుకువెళ్ళి ఒక భవనంలో కూర్చోపెట్టుకొని, “సరదాగా మీకు కొన్ని కథలు చెబుతాను. ఇవి మంచి  నీతికథలు, వీటిలో మిత్రలభం, మిత్రబేదం, విగ్రహం, సంధి అని నాలుగు భాగాలున్నాయి. మీరు శ్రద్ధగా వినండి” అంటూ నీతికథలు చెప్పటం ఆరంభించాడు.
   
             

                                              కొనసాగుతుంది........
                

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...