శంఖచూడుడి వధ

          శంఖచూడుడి వధ 

శంఖచూడుడు యక్షుడు. కుబేరుడి అనుచరుడు, గదాయుద్దంలో ఆరితేరినవాడు. ఈ భూమండలంలో తనవంటి బలశాలి, గదాయుద్ధంలో తనను ఓడించగల పరాక్రమవంతుడు లేడంటూ విర్రవీగేవాడు.

ఒకనాడు నారద మహర్షి శంఖచూడుని వద్దకు వచ్చాడు. నారదునికి శంఖచూడుడు స్వాగత సత్కారాలు చేశాడు. కలహభోజనుడైన నారదుడు కంసుడి పరాక్రమాన్ని పొగుడుతూ శంఖచూడుణ్ణి రెచ్చగొట్టాడు.

'కంసుడు నన్ను మించిన పరాక్రమవంతుడా?" ఉక్రోషంగా అడిగాడు శంఖచూడుడు.

'అది నేనెలా చెప్పగలను? నువ్వే తేలుకోవాలి' బదులిచ్చాడు నారదుడు.

నారదుడి మాటలకు రెచ్చిపోయిన శంఖచూడుడు వేలాది గదాయుధాలతో మధురా నగరం చేరుకున్నాడు. రాజసభకు వెళ్లాడు. కంసుడికి అభివాదం చేసి, 'రాజా! సువ్వు త్రిభువన విజయుడవని విన్నాను. నీతో గదాయుద్ధం చేయాలని నా కోరిక, నువ్వు గెలిస్తే, నీకు దాసుడిగా ఉంటాను. నేను గెలిస్తే నువ్వు నా దాసుడివి కావాలి' అన్నాడు.

శంఖచూడుని ఉబలాటం చూసి, 'సరే'నంటూ పెద్ద గద తీసుకుని, యుద్ధానికి సిద్ధపడ్డాడు కంసుడు. ఇద్దరూ గదలతో గోదాలోకి దిగి పోరాడసాగారు. ఒక గద పగిలిపోతే మరో గద తీసుకుని పోరాదారు. వారి వద్ద ఉన్న గదలన్నీ తునాతునకలై

పోయాక, చివరకు ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. అదే సమయానికి గర్గ మహర్షి అక్కడకు చేరుకున్నాడు.

'కంసా! ఇక యుద్ధం చేయకు. ఈ శంఖ చూదుడు నీతో సమానమైన బలసంపన్నుడు.. నిన్ను చంపబోయే పరమాత్ముడు ఇతడిని కూడా హతమారుస్తాడు. ఇక నుంచి ఈ యక్షుడితో అభిమానంగా ఉండు' అని చెప్పాడు.

'శంఖచూడా! నువ్వు కూడా ఇకపై కంసుడితో మైత్రితో మెలగుతూ ఉండు' అని సూచించాడు.

గర్గుని మాటలతో ఇద్దరూ యుద్ధం విరమించుకున్నారు. సవినయంగా గద్ద. మహర్షికి నమస్కరించారు. ఆయన ఆశీస్సులు పొంది, పరస్పరం అలింగనం చేసుకున్నారు. శంఖచూడుడు కొన్నాళ్లు కంసుడి వద్ద ఉండి, అతడి ఆతిథ్యం స్వీకరించాడు.

ఒకనాడు శంఖచూడుడు కంసుడి వద్ద సెలవు తీసుకుని ఆకాశమార్గాన తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో బృందావనం కనిపించింది.

బృందావనంలో గోపకాంతల మధ్య రాధామాధవులు కనిపించారు. కృష్ణుడు తన మోచేతిని రాధ భుజంపై ఉంచి, మురళి వాయిస్తుండగా, రాధ తన్మయత్వంతో ఆలకిస్తోంది. గోపకాంతలు ఆనంద పరవశులై నాట్యమాడుతున్నారు.

కృష్ణుడిని సామాన్య బాలకుడిలాగానే తలచాడు శంఖచూడుడు. ఒక సామాన్య బాలుడి చుట్టూ అందగత్తెలైన అంతమంది. గోపికలు నాట్యం చేస్తుండటం చూసి అతడికి మతిపోయింది.

ఈ బాలకుడేంటి, ఇతగాడి గొప్పేంటి. ఇంతమంది అందగత్తెలూ ఇతడి చుట్టూనే చేరి ఎందుకు ఆడుతున్నారు, ఇతడికి ప్రత్యేకతేంటి? ఇతడి సంగతేదో చూడాల్సిందే అనుకున్నాడు.

వెంటనే బృందావనంలో దిగాడు. నల్లని దేహం, ఎర్రని కళ్లతో నేల దద్దరిల్లేలా అడుగులు వేస్తూ వస్తున్న భీకరాకారాన్ని చూసి గోపికలు భీతిల్లిపోయారు. అప్పటి వరకు నృత్యగానాలతో ఆహ్లాదభరితంగా గడిపిన రాసమండలమంతా గోపికల ఆర్తనాదాలతో, హాహాకారాలతో హోరెత్తిపోయింది.

అందగత్తెలయిన గోపికలందరినీ ఒకేసారి చూసేసరికి శంఖచూడుడికి మతిచలించింది. గోపికల వైపు ముందుకు రాసాగాడు. భయంతో గోపికలు పరుగులు తీశారు. శతచంద్రానన అనే గోపిక శంఖచూడుడి చేతికి చిక్కింది. అతడు ఆమెను పట్టుకుని, ఉత్తరదిశ వైపు శరవేగంగా వెళ్లసాగాడు.

భయకంపితురాలైన శతచంద్రానన 'కృష్ణా! కృష్ణా!' అంటూ రక్షణ కోసం కేకలు వేయసాగింది. గోపికల కలకలానికి కృష్ణుడు లేచి వచ్చాడు. శతచంద్రానన కేకలు విన్నాడు. అటువైపుగా పరుగున ముందుకు సాగాడు. భీకరాకారుడైన శంఖచూడుడు శతచంద్రానను ఎత్తుకుపోతుండటాన్ని గమనించాడు. 'నిలువురా మాయావి! నిలువు. అబలను విడిచిపెట్టు' అంటూ హెచ్చరించాడు. అతడు నిలవకుండా, ముందుకు పరుగున పోతుండటంతో, కృష్ణుడు దగ్గరే ఉన్న సాలవృక్షాన్ని పెకలించి, అతణ్ణి వెంబడించసాగాడు.

సాలవృక్షంతో తరుముకొస్తున్న కృష్ణుణ్ణి చూసి, శంఖచూడుడు భయపడ్డాడు. ఎత్తుకుపోతున్న గోపికను అక్కడికక్కడే విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా పరుగు తీశాడు. అయినా కృష్ణుడు అతణ్ణి విడిచి పెట్టలేదు. యోజనాల కొద్ది దూరం తరుముకుంటూ వెళ్లాడు. చివరకు హిమాలయ సానువుల చెంత అతణ్ణి అడ్డగించాడు. ఇక తప్పించుకుపోవడానికి ఎటూ మార్గం

కనిపించక, తప్పనిసరిగా కృష్ణుడితో యుద్ధానికి దిగాడు శంఖచూడుడు. ఇద్దరూ ఒకరిపై మరొకరు చెట్లతో దాడి చేసుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. చివరకు ముష్టియుద్ధానికి దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఒకళ్లనొకళ్లు నేల మీదకు నెట్టుకుని కలబడ్డారు. కృష్ణుడు ఒడుపుగా శంఖచూడుడి మెడ దొరకబుచ్చు కున్నాడు. అతడి నెత్తి మీద, మెడ మీద పిడిగుద్దులు కురిపించి, మెడ నుంచి తలను వేరుచేశాడు. అతడి తలలో ఉన్న చూడామణిని పెకలించి తీశాడు. శంఖచూడుడి నుంచి ఒక దివ్యతేజస్సు వచ్చి, కృష్ణుడి మిత్రుడైన శ్రీదాముడిలో చేరింది. శ్రీదాముడి అంశే కాలవశాన యక్షుడిగా జన్మించి, శ్రీకృష్ణుడి వల్ల

తిరిగి శ్రీదాముడిలోనే విలీనమైంది.

శల్యుని ఆతిథ్యం

            శల్యుని ఆతిథ్యం 


మాయద్యూతంలో ఓడిపోయిన పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకున్నాక, కౌరవ పాండవుల మధ్య సయోధ్య కోసం జరిపిన శ్రీకృష్ణ రాయబారం విఫలమైంది. పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వనని దుర్యోధనుడు మొండికేయడంతో యుద్ధం అనివార్యమైంది. రణానికి ముందు సైనిక సమీకరణల కోసం కౌరవ పాండవులు ఎవరి ప్రయత్నాలను వారు ప్రారంభించారు. కృష్ణుడు ఒంటరిగా పాండవుల పక్షాన నిలుస్తానన్నాడు. బలరాముడు ఏ వక్షానా చేరబోనంటూ తీర్ధయాత్రలకు సిద్ధమయ్యాడు. కృతవర్మ తదితర యదువీరులంతా కౌరవుల పక్షాన చేరాడు.


నకుల సహదేవుల మేనమామ అయిన మద్ర సరేంద్రుడిని తమ పక్షాన యుద్ధంలో పాల్గొనాల్సిందిగా ఉపప్లావ్యంలో విడిది చేసిన ధర్మరాజు ఆహ్వానం పంపాడు. ధర్మరాజు నుంచి కబురు అందగానే శల్యుడు తన బలగాలతో ఉపప్లావ్యానికి బయలుదేరాడు. అమిత బలాఢ్యుడైన శల్యుడిని తమవైపు తిప్పుకుంటే యుద్ధంలో తేలికగా విజయం


సాధించవచ్చని, ముఖస్తుతికి ప్రీతిచెందే శల్యుడిని మర్యాదలతో లొంగదీసుకోవాలని దుర్యోధనుడికి శకుని సలహా ఇచ్చాడు. కల్యుడు. మద్రదేశం నుంచి ఉపషావ్యం వైపు బయలుదేరినట్లు వేగుల ద్వారా వర్తమానం తెలుసుకున్న దుర్యోధనుడు ఆ దారి పొడవునా తన బలగాలను, సేవకులను రంగంలోకి దించాడు. దుర్గమమైన ఆటవీ మార్గంలో శల్యుడు, అతడి పరివారం డేరాలు వేసుకుని బస చేసిన చోటల్లా దుర్యోధనుడి భృత్యులు వెళ్లి, వారికి ఏ లోటూ లేకుండా అతిథి మర్యాదలు చేశారు. కందమూలాదులు తప్ప దొరకని అడవిలో శల్యుడికి, అతడి పరివారానికి ఘుమఘుమలాడే వంటకాలతో భోజనానికి లోటు లేకపోయింది. దుర్యోధనుడి సిబ్బంది శల్యుడి ఇష్టాయిష్టాలను కనుక్కొని మరీ మర్యాదలు చేయడంతో శ్రమదమాదులు తప్పవసుకున్న ఉపప్లావ్య యాత్ర శల్యుడికి,అతడి పరివారానికి వినోదయాత్రలా మారింది.


ఆడుగడుగునా షడ్రసోపేతమైన విందుభోజనాలతో దొరుకుతున్న మర్యాదలన్నీ ధర్మరాజు భృత్యులే తనకు చేస్తున్నారని తలచాడు శల్యుడు. మనసుకు సంతోషు కలిగేలా అతిథి సత్కారాలకు ఏర్పాట్లు చేస్తున్న ధర్మజుడి అమాత్యులెవరో కనుక్కొని తన. వద్దకు తీసుకొస్తే, వారికి స్వయంగా కృతజ్ఙతలు చెబుతానని, వారెవరో కనుక్కొని తన ముందుకు తీసుకు రమ్మని తన భృత్యులను ఆజ్ఞాపించాడు.


శల్యుడి ఆజ్ఞ మేరకు అతడి భృత్యులు వెదుకులాటలో పడ్డారు. ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారో నెమ్మదిగా ఆరా తీశారు. సమాచారం తెలిసిన వెంటనే వచ్చి, శల్యుడి ఎదుట వాలారు.


'మద్ర మహారాజా! తమరి రాక తెలుసుకుని సుయోధన సార్వభౌములు ఈ దుర్గమ అరణ్యమార్గాన్ని తమరి ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దారు. తమకు మార్గాయాసం కలగకుండా అడుగడుగునా ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సుయోధన సార్వభౌముల వారి ఆజ్ఞ మేరకు ఆయన అమాత్యుల పర్యవేక్షణలో తమరి మర్యాదకు లోటు లేకుండా చూసుకున్నారు' అని చెప్పారు భృత్యులు.


భృత్యులు చెప్పిన సమాచారంతో శల్యుడు ఆశ్చర్యచకితుడయ్యాడు.


ఆనందభరితుడయ్యాడు. తన పట్ల ఇంతటి ఆదరణ, మన్నన కనబరచిన దుర్యోధనుడిపై శల్యుడికి అభిమానం ఉప్పొంగింది.


తనకు మర్యాదలు చేసినదెవరో శల్యుడు ఆరా తీస్తున్న సంగతి తెలిసి, దుర్యోధనుడు స్వయంగా బయలుదేరాడు. కొద్దిమంది పరివారంతో శల్యుడు విడిది చేస్తున్న మందిరానికి చేరుకున్నాడు. తనను తాను పరిచయం చేసుకుని, వినయంగా నమస్కరించాడు. శల్యుడు తన ఆసనం నుంచి లేచి వచ్చి, దుర్యోధనుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తన ఎదుటనున్న మరో ఆసనంపై దుర్యోధనుణ్ణి కూర్చోబెట్టాడు.


'కురుకులాగ్రణీ! మేము కోరకుండానే మాకు మార్గాయాసం తెలియనివ్వకుండా అడుగడుగునా అతిథి మర్యాదలు చేశావు. ఇదంతా నీ పెద్దమనసుకు నిదర్శనం. నిన్నెంత పొగిడినా నువ్వు మాకు చేసిన సహాయానికి సాటి రావు. నేను తీర్చగలిగే కోరిక ఏదైనా ఉంటే కోరుకో! తప్పక తీర్చి నీ రుణం తీర్చుకుంటాను' అన్నాడు శల్యుడు.


'మద్ర మహీపతీ! నువ్వు సత్యవాక్పరిపాలకుడవు. ఉచితానుచితాలను ఎరిగిన వివేకవంతుడివి. అమిత బలశాలివి. పరాక్రమవంతుడవు. సర్వసమర్థుడవు. నాకు సదా హితుడవై, సమయం వచ్చినప్పుడు నాకు సైన్యాధిపతివై నా బలగాలను ముందుకు నడిపించాలి. ఇదే నా కోరిక. పాండవులూ కౌరవులూ ఉభయులూ నీకు సమానులే! అయినా నీవంటి శక్తిసంపన్నుడి అండ ఉంటే నాకు అదే మహద్భాగ్యం' అని వినయంగా వేడుకున్నాడు దుర్యోధనుడు.


'తప్పక నీ కోరిక తీరుస్తాను. నువ్వు నిశ్చింతగా హస్తినకు మరలి వెళ్లు. ఉపప్లావ్యంలో ధర్మరాజును కలుసుకుని, నా సేనలతో వచ్చి నిన్ను చేరుకుంటాను. యుద్ధంలో నీ పక్షాన నిలిచి పోరాడతాను' అని మాట ఇచ్చాడు శల్యుడు. తన ప్రయోజనం నెరవేరడంతో దుర్యోధనుడు సంతృప్తిగా పరివారంతో హస్తినకు వెనుదిరిగాడు.

మాయలేడి

              మాయలేడి


ఒకప్పుడు ఫిన్లాండ్ అనే మాజికల్ భూమిలో, ఎలారా అనే యువ మంత్రగత్తె ఉండేది. ఎలరాకు ప్రకృతిలోని అంశాలను తన మేజిక్తో కంట్రోల్ చేసే శక్తి ఉంది. ఆమె మేజిక్ ఫారెస్ట్‌లో చివరగా ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండేది.
అక్కడ చాలా చెట్లు ఇంకా ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి.

ఒకానొక టైంలో ఫిన్లాండ్ ఒక మనిషి వచ్చాడు. వాడే మలాకర్.వాడు ఒక మాంత్రికుడు ఇంకా అసూయ 
  మరియు దురాశతో కలిగి ఉన్నాడు. ఎలారా యొక్క శక్తులను తన కోసం దొంగిలించడానికి ప్రయత్నించాడు. అతను ఆమెను తిస్కురమ్మని తన చీకటి కోటకు తీసుకురావడానికి నీడ జీవులను గుంపుగా వదిలాడు.

రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఎలారా, ఆమె వేగంగా పనిచేయాలని తెలిసింది. తన నమ్మకమైన సహచరుడు, ఓరియన్ అనే తెలివైన ముసలి గుడ్లగూబతో, ఆమె చిన్నప్పటి గార్డియన్ల మార్గదర్శకత్వం కోసం ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది - ప్రపంచంలోని అంశాలను బ్యాలన్స్ కలిగి ఉండాలని ఇంకా ఎన్నో పురాతన జీవులను కలవడానికి తనకు సహాయం చేయమని కోరడానికి వెళ్తుంది.

ప్రమాదకరమైన పర్వతాలు మరియు హాంటెడ్ లోయల ద్వారా, ఎలరా మరియు ఓరియన్ చివరకు చిన్నప్పటి పెద్ద అడవి, అపారమైన శక్తి మరియు జ్ఞానం ఉన్న ప్రదేశంకు చేరుకున్నారు. అక్కడ, వారికి సంరక్షకులు స్వాగతం పలికారు - భూమి, గాలి, అగ్ని మరియు నీరు - ప్రతి ఒక్కటి వారి మూలకం యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది.

ఫిన్లాండ్కు తిరిగి వెలుగుని తెచ్చి, దానిని బెదిరింపులను పారద్రోలేందుకు ఎంపిక చేసుకున్న వ్యక్తి యొక్క ఎదుగుదలను ముందే చెప్పే ప్రవచనాన్ని సంరక్షకులు ఎలారాకు వెల్లడించారు. మాలకర్‌ను ఎదుర్కోవడానికి మరియు భూమికి శాంతిని పునరుద్ధరించడానికి ఉద్దేశించినది ఆమె ఎంపిక చేయబడిందని ఎలారా గ్రహించింది.

చిన్నప్పటి గార్డియన్ల ఆశీర్వాదంతో, ఎలారా తన నీడల కోటలో మలాకర్‌ను ఎదుర్కోవడానికి బయలుదేరింది. ఆఖరి యుద్ధం ఉరుములు మరియు మెరుపులు, మంటలు మరియు మంచుతో ఒక అద్భుతమైన ఇంద్రజాల ప్రదర్శనతో చెలరేగింది.

స్వచ్ఛమైన ధైర్యం మరియు సంకల్పం యొక్క క్షణంలో, ఎలరా తన శక్తులను పూర్తి స్థాయిలో ఆవిష్కరించింది, చీకటిని ఒక్కసారిగా పారద్రోలే కాంతి యొక్క అద్భుతమైన ప్రదర్శనలో అంశాలను ప్రసారం చేసింది. మలాకర్, ఓడిపోయి, అణకువగా,ఫిన్లాండ్ను మళ్లీ బెదిరించకుండా వదిలి వెళ్లిపోయాడు.

మాయ ఫారెస్ట్‌పై సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, ఫిన్లాండ్ బంగారు కాంతితో కనబడింది, భూమి పునరుజ్జీవింపబడి మరోసారి ఆశతో నిండిపోయింది. ఇప్పుడు దేవతగా కీర్తించబడుతున్న ఎలారా, ఆమె ప్రజల మధ్య ఉన్నతంగా నిలిచారు, ధైర్యం, స్నేహం మరియు ఆమెలో ఉన్న మాయాజాలం యొక్క నిజమైన శక్తిని కనుగొనడానికి దారితీసిన ప్రయాణానికి ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. కాబట్టి, ఎలరా కథ, రాబోయే తరాలకు స్పూర్తినిస్తూ పురాణగాథగా మారింది.

మాయామహల్

             మాయామహల్


చుట్టూ అడవులు మరియు నిర్మలమైన సరస్సు మధ్య ఉన్న విచిత్రమైన పట్టణంలోని ఎడ్జ్‌వాటర్లో వినీత్ అనే అబ్బాయి మరియు అతని స్నేహితులు నివసించే వారు. వారు సాహసం కోసం వారి తీరని దాహానికి ప్రసిద్ధి చెందారు, ఎల్లప్పుడూ తెలియని వాటి యొక్క థ్రిల్‌ను కోరుకుంటారు.


ఒక చీకటి సాయంత్రం, చెట్ల మధ్య గాలి వీచినప్పుడు, వినీత్ పట్టణం చివరన ఉన్న పాడుబడిన భవనాన్ని అన్వేషించడానికి వెళదాం అని చెప్పాడు. చీకటి కథలతో కప్పబడిన ఈ భవనం ఎడ్జ్‌వాటర్ యొక్క అత్యంత చిలిపిగా ఉండే పురాణానికి నిశ్శబ్ద సెంటినెల్‌గా నిలిచింది-దాని హాళ్లలో తిరిగే స్పెక్ట్రల్ వితంతువు కథ.


గుండెలు బాదుకుంటూ, చేతిలో ఫ్లాష్‌లైట్‌లతో, వారు క్రీక్ చేస్తున్న ముందు తలుపు గుండా చొచ్చుకు పోయరు. ఆ మందిరం వారి ఉనికిని మింగేసింది, వారిని వింత నిశ్శబ్దం ఆవరించింది. వారు అన్వేషించేటప్పుడు, గాలి చల్లగా పెరిగింది మరియు నీడలు వారి లైట్లకు అందకుండా నృత్యం చేస్తున్నాయి.


గ్రాండ్ బాల్‌రూమ్‌లో, వినీత్ స్నేహితురాలు మాయకి పాత పియానో దొరికింది. దాని కీలు మురికిగా ఉన్నాయి, కానీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ధైర్యంగా, ఆమె ఇంటి ఆత్మతో ప్రతిధ్వనించేలా వెంటాడే మెలోడీని ప్లే చేసింది. నోట్లు గాలిలో తేలాయి, ఒక్క క్షణం అంతా నిశ్చలమైపోయింది.


అప్పుడు అనూహ్యమైనది జరిగింది. ఒక చల్లని గాలులు గదిని చుట్టుముట్టాయి, వారి లైట్లను ఆర్పివేసాయి. చీకటిలో, వారు ఒక దుస్తులు యొక్క మృదువైన శబ్దం మరియు సమీపించే అడుగుజాడల ప్రతిధ్వని విన్నారు. వారు తమ ఫ్లాష్‌లైట్‌లను వెలిగించటానికి తడబడుతున్నప్పుడు భయాందోళనలకు గురయ్యారు, కానీ కాంతి తిరిగి వచ్చినప్పుడు, వారు ఒంటరిగా ఉన్నారు-లేదా అలా అనిపించింది.


సాహసాలు కొనసాగాయి, ప్రతి గది మరిన్ని రహస్యాలను, గతంలోని మరిన్ని గుసగుసలను వెల్లడిస్తుంది. వారు ఒక సైనికుడి ప్రేమ లేఖలను కనుగొన్నారు, ఎప్పుడూ వాటిని పంపలేదు; ఇప్పటికీ ఆట కోసం వేచి ఉన్న బొమ్మలతో కూడిన ఆట స్థలం; వారి శీర్షికలను గుసగుసలాడేలా అనిపించే పుస్తకాలతో కూడిన లైబ్రరీ.


కానీ అటకపై నిజమైన భయానకం వేచి ఉంది. అక్కడ, చాలా కాలం గడిచిన జీవితపు అవశేషాల మధ్య, వారు వితంతువు యొక్క చిత్రపటాన్ని కనుగొన్నారు. అటువంటి వివరాలతో చిత్రించబడిన ఆమె కళ్ళు, దుఃఖం మరియు ఆవేశంతో నిండిన వాటిని అనుసరిస్తున్నట్లు అనిపించింది. వినీత్ ఫ్రేమ్‌ను తాకడానికి చేరుకున్నప్పుడు, ఉష్ణోగ్రత బాగా పడిపోయింది, మరియు ఒక స్వరం, మృదువుగా మరియు దుఃఖంతో నిండిపోయింది, "ఈ స్థలం నుండి వెళ్ళిపో..."


హెచ్చరికను విస్మరించి, వారు తమను తాము తిరిగి వక్రీకరించే హాలుల చిక్కైనలో కోల్పోయారని మాత్రమే కనుగొన్నారు. తలుపులు మాయమయ్యాయి, గదులు మారాయి, అడుగడుగునా వీక్షిస్తున్న అనుభూతి మరింత బలపడింది.


వారు దాచిన గదిపై పొరపాటు పడినప్పుడే, దాని గోడలు పురాతన బొమ్మలతో కప్పబడి, ఒకే నల్ల కొవ్వొత్తిని కాల్చివేసినప్పుడు, వారి పరిస్థితి యొక్క గురుత్వాకర్షణ వారికి అర్థమైంది. ఆ గది వితంతువుకి చెందినది, మరియు వారు ఆమె అభయారణ్యంలోకి చొరబడ్డారు.


చెవిటి అరుపుతో, కొవ్వొత్తి ఆరిపోయింది, వారిని చీకటిలోకి నెట్టింది. గులాబీల సువాసనతో గాలి దట్టంగా ఉంది, వితంతువుల పరిమళం. ఆమె ఉనికిని చుట్టుముట్టినట్లు వారు భావించారు, ఆమె దుఃఖం మరియు కోపం స్పష్టంగా కనిపించాయి.


తప్పించుకోవడానికి తీరని ప్రయత్నంలో, వారు పరుగెత్తారు, దృష్టి కంటే ప్రవృత్తి ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఇల్లు వారి నిష్క్రమణతో పోరాడుతున్నట్లు అనిపించింది, కానీ చివరికి, వారు రాత్రి గాలి యొక్క భద్రత కోసం ఊపిరి పీల్చుకుంటూ ముందు తలుపు ద్వారా పారిపోయారు.


తమ ఇళ్ళలో సుఖంగా చేరుకున్నారు, ఆ రాత్రి గురించి ఇంకెప్పుడూ మాట్లాడబోమని ప్రమాణం చేశారు. కానీ కొన్నిసార్లు, గాలి సరిగ్గా వీచినప్పుడు, వారు పియానో కీల యొక్క మందమైన శబ్దం మరియు దుస్తులు యొక్క మృదువైన శబ్దం వింటారు, కొన్ని సాహసాలను అన్వేషించకుండానే ఉంచారని వారికి గుర్తుచేస్తుంది.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...