కాకి - పాము 2

                  కాకి - పాము 2

చివరికి చెరువు దగ్గర ఎండ్రకాయ ఒక్కటీ మిగిలిపోయింది. ఒకరోజు కొంగ వచ్చి, "చేపలన్నింటినీ భద్రంగా ఆ చెరువుకు చేర్చేశాను. నువ్వు కూడా నాతో వచ్చేయి. నిన్న అక్కడికే చేరుస్తాను" అంది.

కొంగ మోసం తెలియని ఎండ్రకాయ ఒప్పుకొంది. కొంగ దాన్ని ముక్కున కరచుకొని పైకి ఎగిరింది. కొంచెం పైకి ఎగిరిన తర్వాత, ఆ చుట్టుప్రక్కలంతా కొండలూ, గుట్టలే తప్పు, మరో చెరువేదీ లేదని ఎండ్రకాయకు తెలిసింది. దాంతో కొంగ మోసం కూడా అర్ధమయిపోయింది. అయితే చేపలకంటే ఎండ్రకాయ తెలివిగలది. అందుకే కొంగ ఎత్తుకు పై ఎత్తు వేసింది.

"కొంగబావా, నువ్వు యిలా తీసుకెళ్తుంటే నాకేమిటో భయంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయ్. కిందపడిపోతానేమో. ఇలాకాదు. నేనే నీ మెడని కరుచుకొని గట్టిగా పట్టుకుంటే మనం భద్రంగా వెళ్ళొచ్చు. ఒక్కసారి దించు" అంది. కొంగ సరేనంది. ఎండ్రకాయ కొంగ గొంతు కరచుకొని గట్టిగా పట్టుకొంది.

చివరికి కొంగ కొండగుట్ట మీద వాలబోయే ముందు ఎండ్రకాయ కొంగ మెడను తన గిట్టలతో కటుక్కున విరిచేసింది. కొంగ ప్రాణం పోయి, కింద పడిపోయింది. ఎండ్రకాయ తప్పించుకొని వెళ్ళిపోయింది.

అని నక్క కథ ముగించి, 'కనక కాకి బావా, శత్రువును చంపేందుకు నువ్వుకూడా సరయిన సమయం చూసి, మంచి ఉపాయం ఉపయోగించాలి' అంది. సరేనని కాకి తన యిల్లు చేరింది.

తర్వాత కొద్దిరోజులకు కాకికి అవకాశం దొరకనే దొరికింది.

కాకి ఉంటున్న చెట్టు దగ్గర్లో ఒక చెరువు ఉంది. ఓరోజు దగ్గరలో ఉన్న నగరం నుంచీ కొంతమంది రాజకుమార్తెలు జలక్రీడల కోసం ఆ చెరువుకు వచ్చారు. వాళ్ళు తమ నగలూ, బట్టలూ చెరువు ఒడ్డున ఉంచి సరదాగా జలక్రీడలాడుతుండగా, కాకి గమనించి వాళ్ళు ఒడ్డున వదలిన ఒక విలువయిన శ్రీ మణిహారాన్ని తన ముక్కున కరుచుకొని తీసుకుపోయింది. ఇది చూసిన రాజకుమార్తెలు కంగారుపడుతూ జలక్రీడలు ఆపేశారు. రాజభవనానికి వెళ్ళిపోయి, కొందరు రాజభటులను ఆ కాకిని వెతికి మణిహారాన్ని తిరిగి తెచ్చేందుకు పంపించారు. భటులు అడవిలోకి వచ్చారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించింది కాకి. మెల్లిగా ఎగురుతూ తనే ఆ భటుల కంట పడింది. భటులు కాకిని పట్టుకొనేందుకు దాన్ని వెంబడించారు. కాకి మెల్లిగా ఎగురుతూ వెళ్ళింది. భటులు దాని వెనకే వెళ్ళారు. కాకి తన చెట్టు కొమ్మదాకాచేరి, ముక్కున కరచుకొని పట్టుకొన్న హారాన్ని వాళ్ళు చూస్తుండగా మెల్లిగా చెట్టు మొదట్లో ఉన్న పాము పుట్టలోకి జారవిడిచింది. భటులకు కావల్సింది. మణిహారం కాని, కాకి కాదు గదా! వాళ్ళు కాకి సంగతి మర్చిపోయి, తమ ఆయుధాలతో ఆ పుట్టను బాగా తవ్వేశారు. పుట్టలో ఉన్న పాము బయటికి వచ్చి భటులను కరవబోయింది. భటులు దుడ్డుకర్రలతో పామును బాదేసి చంపేశారు. హారాన్ని చేజిక్కించుకొని రాజభవనానికి వెళ్ళిపోయారు. దాంతో కాకి జంటకు పాము బెడద తీరిపోయింది.

ఇలా దమనకుడు కాకి-పాము కథ పూర్తి చేశాడు. కానీ తన ఉపన్యాసం ఆపలేదు. "బుద్ధిబలం ఉన్నవాడికి శరీరబలం లేకపోయినా ఫరవాలేదు. తెలివిగల కుందేలు తన యుక్తితో సింహాన్ని చంపేసిన మరో కథకూడా చెబుతాను. విను” అంది. అని ఆ కథ మొదలుపెట్టాడు.

కాకి- పాము 1

               కాకి - పాము - 1

ఒకానొక కాలంలో యమునా నదీతీరంలో ఉన్న ఒక పెద్ద అడవిలో ఒక మర్రిచెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తూ ఉండేది. ఆ మర్రిచెట్టు మొదట్లో ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక పాము.

ఈ పాము కాకులు లేనపుడు వాటి గూటిలోకి పాకి, కాకిగుడ్లన్నీ తినేసి వస్తుండేది. ఇలా జరుగుతున్నదని తెలిసి కూడా, కాకులు ఆ పామునేమీ చేయలేక, బాధపడుతూ ఉండేవి.

ఒకరోజు అవి ఆ అడవిలోనే ఉన్న ఒక నక్క దగ్గరకు వెళ్లి, ఈ పాము పీడ వదిలించుకొనే ఉపాయమేదన్నా చెప్పమని కోరాయి. వాటి సమస్య శ్రద్ధగా విన్న నక్క బావ ముందు వాటికో కథ చెప్పాడు,

బదరికావనంలో ఒక ముసలి కొంగ ఉండేదట. ముసలితనం వల్ల దానికి ఓపిక తగ్గి ఆహారం సంపాదించడం కష్టమయింది. అది రోజూ ఆ అడవిలో ఉన్న ఒక చెరువులో నిల్చొని, కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్టు నటించేది. చెరువు దగ్గర వున్న ఓ ఎండ్రకాయ ఓ రెండు రోజులు ఈ తంతు గమనించి ఆశ్చర్యపోయింది.

కొంగ దగ్గిరకి వెళ్ళింది, “కొంగ బావా! రోజూ చూస్తూ ఉన్నాను, నువ్వు చేస్తున్నదేమిటో నాకు అర్ధం కావటం లేదు. అలాగ తపస్సు చేస్తూ ఉంటావ్. చెరువునిండా చేపలు తిరుగుతుంటే వాటిని తినే ప్రయత్నమే చేయవు. రోజురోజుకీ తిండిలేక చిక్కిపోతున్నావు. ఇదంతా ఏమిటి?" అని అడిగింది.

“నేను పుట్టినప్పటినుంచీ యిప్పటిదాకా, ఎన్నో చేపలను తిని పాపం కట్టుకొన్నాను. ఒకరోజు కాశీలో ఒక యోగి తన శిష్యులకు బోధచేస్తుంటే విని, నా తప్పు తెలుసుకున్నాను. అప్పణ్ణించీ, జీవహింస మానేశాను. నీళ్ళూ, నాచు యివే యిప్పుడు నాకు ఆహారం. ఎప్పుడూ తపస్సులోనే కాలక్షేపం చేస్తాను" అన్నది కొంగ.

ఈ మాటలు ఎండ్రకాయే కాకుండా, ఆ చెరువులో కొంగకు దూరంగా తప్పించుకు తిరుగుతున్న చేపలు కూడా విన్నాయి. నిజమనుకొని నమ్మేశాయి. వాటికి కొంగంటే భయం పోయి, 'నీలాంటి మంచివాణ్ణి మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. క్షమించమంటూ ఆ కొంగని ఒక పెద్దమనిషిలాగా గౌరవించటం మొదలెట్టాయి, కొంగరూ.. చేపలకూ మధ్య స్నేహం ఏర్పడింది.

ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే ఒకనాడు చేపలు కొంగను పలకరించటానికి దాని దగ్గరకు వెళ్ళాయి. కొంగ దిగులుగా, కన్నీళ్ళు కారుస్తూ కూర్చొని ఉంది. కారణమేమిటని అడిగాయి. చేపలు.

"నా దుఃఖమూ, దిగులూ నా గురించి కాదు, మీ గురించి. ఇప్పుడే కొంతమంది జాలరి వాళ్ళు వచ్చి మన చెరువు చూసి వెళ్ళారు. మరి కొద్దిరోజుల్లో మన చెరువులో నీళ్ళు బాగా ఇంకిపోయి, చెరువు లోతు తగ్గిపోబోతున్నదట. అప్పుడు జాలరులు మళ్ళీ వచ్చి చెరువులో చేపలనన్నింటినీ వలవేసి పట్టుకుపోతారట. ఇది విన్నప్పట్టించి నాకు దుఃఖం ఆగటం లేదు. మిమ్మల్ని ఎలా రక్షించాలా అని చాలా దిగులు పడిపోతున్నాను" అంది కొంగ చేపలు భయపడిపోయాయి. ఈ ఆపదనించీ ఎలాగైనా మమ్మల్ని తప్పించమని ప్రాధేయపడ్డాయి.

"అయితే వినండి, యిక్కడికి కొంచెం దూరంలో నేనెరిగిన మరొక పెద్ద చెరువున్నది. వీలయినంత త్వరగా నేను మిమ్మల్నందర్నీ ఆ చెరువుకు చేర్చగలిగితే మీరు క్షేమంగా. ఉంచొచ్చు. కానీ నేను ముసలిని కదా? మిమ్మల్నందర్నీ ఒకేసారిగా అక్కడికి చేర్చలేను. రోజూ కొన్ని చేపలను నా నా ముక్కుకు కరుచుకొని ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్తాను. కొన్ని రోజులకల్లా అలా ఒక్కరున్న చేపలన్నింటినీ అక్కడికి చేరుస్తాను" అంది కొంగ.

కానీ అవన్నీ మాయమాటలే. ఈ పథకం ప్రకారం) కొంగ రోజూ కొన్ని చేపల్ని తనముక్కున కరుచుకొని వెళ్ళి దగ్గర్లో ఉన్న ఓ కొండబాటుకు తీసుకెళ్ళి వాటిని శుభ్రంగా తినేసి, తిరిగి రాసాగింది. కొద్దిరోజుల్లో అలా అది ఆ చెరువులో ఉన్న చేపలనన్నింటినీ తినేసింది.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...